విహారాలు

India

Gamyam

Showing posts with label మహారాష్ట్ర. Show all posts
Showing posts with label మహారాష్ట్ర. Show all posts

Wednesday, March 9, 2011

ఘనమైన ప్రకృతి అందం... గణపతిపూలే

Ganapati_Phuleసముద్ర తీరానికి ప్రత్యేక అం దాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్ట్ర లోని గణపతిపూలే. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతిపూలే ఒకటి. గణపతిపూలేను పశ్చిమ ద్వార దేవతగా పిలుస్తారు.గణపతిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. గణపతిపూలే ప్రకృతి అందాలతో శోభిల్లుతుంది. పచ్చ దనంతో కూడిన అడవులు ఇక్కడ ఉన్నాయి. గణపతిపూలేలో మామిడి, వక్క, అరటి, కొబ్బరి వంటి వనాలు ఉన్నాయి. పశ్చిమ తీరం వెంట ఇటువంటి వనా లు ఎక్కువగా ఉంటాయి.

ఇతర దర్శనీయ ప్రాంతాలు...
మాల్గుండ్‌:మరాఠీ కవి కేశవ్‌ సూత్‌ జన్మించిన ప్రాంతం ఇది. సూత్‌ సేవలను గుర్తించుకునే విధంగా కేశవ్‌ సూత్‌ స్మారక్‌ అనే మందిరాన్ని నిర్మించారు.

పావస్‌:ప్రకృతి రమణీయతకు నెలవైన ప్రాంతం పావస్‌. ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త స్వామి స్వరూపానంద్‌ ఇక్కడే జన్మించారు.

రత్నగిరి...
పశ్చిమ కోస్తా తీరంలో అందమైన ప్రాంతంతో పాటుగా జిల్లా కేంద్రం రత్న గిరి. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు బాల గంగాధర్‌ తిలక్‌ జన్మస్థలం ఇదే. ఆయన సేవలను గుర్తుపెట్టుకునే విధంగా తిలక్‌ స్మారక్‌ను ఇక్కడ ఏర్పా టుచేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిలక్‌ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. సమీపంలో రత్నదుర్గ్‌ కోట కూడా ఉంది.

వసతి...
గణపతిపూలేలో మహారాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన హో టల్‌తో పాటుగా ఇత ర వసతి సదుపాయా లు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?
విమానమార్గం:బెల్గాంలో (299 కిలో మీటర్లు) విమానాశ్ర యం ఉంది.
రైలు మార్గం:రత్నగిరి (45 కిమీ), భోక్‌ (35 కిమీ) సమీపంలోని రైల్వే స్టేషన్లు.
రహదారి మార్గం: ముంబయి 375 కి.మీ., పూణె (331 కి.మీ.), కొల్హాపూర్‌ (144 కి.మీ.) దూరంలో గణపతిపూలే ఉంది.

కర్టసీ : సూర్య Daily

Tuesday, January 25, 2011

ట్రెక్కింగ్‌ స్పాట్‌... ఖండాలా

Bhaja_Caves
కనుచూపు మేర పచ్చదనం తప్ప మరేమీ కనపడని అద్భుత ప్రదేశం ఖండాల. భారతదేశంలోని ప్రధాన హిల్‌ స్టేషన్లలో ఖండాలా ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహానగరానికి 101 కిలోమీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో కొలువైయున్న ఖండాలాలో ట్రెక్కింగ్‌ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రకృతి ప్రేమికులకు, కొత్త జంటలకు, ప్రేమికులకు స్వర్గధా మంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాల పర్వత ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో ఖండాలా ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అనంతరం బ్రిటీష్‌ వారి పాలన వచ్చాక... దక్కన్‌ పీఠభూమి, కొంకణ్‌ మైదానాల మధ్య గల రోడ్డు మార్గంలో గల భోర్‌ ఘాట్‌లో భాగమయ్యింది. బోర్‌ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలను కలిగి ఉండేవి. ముంబై-పూణే ఎక్స్‌‌‌రరపెస్‌ రైలు మార్గం, అలాగే ముంబై, పూణేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.

అందాల‘లోనవాలా’...

Karla 

ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో లోనవాలా అనే మరో ప్రఖ్యాత హిల్‌ స్టేషన్‌ కూడా చూడదగ్గది. ఖండాలాకంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి రమణీయత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు... తుగవులి, లోనా వాలా, భుషి సరస్సుల హొయలు... ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశే షాలతో లోనావాలా అలరారుతుంటుంది.

పురాతన గుహలు... కర్ల, భజా...
ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న కర్ల మరియు భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని రాతి ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించి నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్‌ పాయింట్‌... తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రదేశం. ఇవే కాకుండా... ముంబయి నుంచి ఖండాలా ప్రయాణ మార్గంలో కూడా అనేక దర్శనీయ ప్రాంతాలు కానవస్తాయి. ఇలాంటి వాటిలో చారిత్రకమైన కోటలు, జలపాతాలు, సరస్సులు అనేకం ఉన్నాయి.

రమణీయ కోట... రజ్‌మాచి...
Khandala 

ముంబయి నుంచి లోనవాలాకు వెళ్లే మార్గమధ్యంలో పర్వతాలు ప్రారంభమయ్యేచోట అందమైన ఓ ఉద్యానవనం వంటివి దర్శనమిస్తాయి. వాటిలో ముఖ్యమై నవి రజ్‌మాచి పార్క్‌, రజ్‌ మాచి కోట గోపురాలు. కోట దిగువ భాగంలో అతి పెద్ద లోయ ఉం టుంది. ఆ లోయలోనే ఒక దేవాల యంతో పాటు హోట ల్‌ కూడా ఉంటుంది. దానికి దగ్గర్లోనే చిన్న పిల్లల ప్రత్యేకంగా రూపొందించిన పార్క్‌ ఒకటి ఉంటుంది. దాని తరువాత వంద అడుగుల ఎత్తునుంచి కిందికి దుమికే ‘కునే’ జల పాతాలు కూడా చూడదగ్గవే. ఇవి ఖండాలాకు లోనవాలాకు మధ్యలో ఉన్నాయి. ఇవేకాకుండా టైగర్స్‌లీప్‌, సాకుర్‌ ప్లాటియా, మంకీ హిల్‌, లో హ్గాడ్‌ దర్శన్‌, శివాజీ పార్క్‌, డ్యూక్స్‌నోస్‌ లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు పర్యటనను మధురానుభూతులతో నింపుతాయి.
ఖండాలా ఎలా వెళ్లాలంటే...
Rajmachi_Hill 

ఖండాలాలో ఎయిర్‌పోర్టు లేని కారణంగా, దానికి దగ్గర్లోని పూణే వరకు విమానంలో వెళ్లవచ్చు. అక్కడికి దగ్గర్లోని రైలు మార్గం ద్వారా 69 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లోనవాలా రైల్వే స్టేషన్‌ చేరుకోవచ్చు. లోనవాలాలో ముంబై-పూణే రైలు మార్గంలో ప్రయా ణించే రైళ్లన్నీ అందుబాటులో ఉంటాయి. కాగా.. లోనవాలా నుంచి ముంబై చేరేందుకు కేవలం 3 గంటల సమయం సరిపోతుంది. అదే విధంగా లోనవాలా నుంచి పూణే వెళ్లాలంటే మాత్రం నాలుగు గంటలు ప్రయాణించాల్సిందే. ఇక బస్సు సౌకర్యం విషయానికి వస్తే.. ముంబై-పూణే మార్గంలో ఖండాలాకు అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

Tuesday, October 5, 2010

ఎల్లలులేని సౌందర్యం... ఎల్లోరా

దేశంలోకెల్లా ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలు మహారాష్ర్టలో ఉన్నాయి. హైదరాబాద్‌ నుండి మన్మాడు వెళ్ళే రైలు మార్గంలో ఉన్న ఔరంగాబాద్‌ స్టేషన్‌కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు. అజంతా గుహలు కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి.అందుకే అజంతా - ఎల్లోరా గుహల చిత్ర శిల్పాలు భారతీయ కళావేత్తలనే కాకుండా ప్రపంచ కళాకోవిదులను కూడా ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాయి. ఇవి ప్రకృతి రమణీయాలైన నదీ పర్వతారణ్య పరిసరాలలో ఉండడం ఒక విశేషం. ఆ పర్వత సానువుల్లో పలు రకాలైన సెలయేర్లూ ఎంతో మోహనంగా అలరిస్తాయి.ఇలాంటి అందమైన ప్రదేశాల్లోనే మునులు తపస్సు చేసుకునేవారేమో! ప్రకృతి కళోపాసకులు, శిల్పులు, బౌద్ధ భిక్షువులు ఇలాంటి సుందర ప్రదేశంలోనే ఆ ళాలక్ష్మికి నీరాజనాలు పలికారు. తరతరాలుగా ఈ ప్రకృతి అందాలు పర్యాటకుల మది దోచుకుంటూనే వున్నాయి. సృష్టికే శోభనిచ్చేంతటి సౌందర్యం ఎల్లోరా సొంతం. అందుకే భారతీయ శిల్పకళా పరిశోధనకు, ఆ విలువైన అందాలను ఆస్వాదించడానికి ఎందరో విదేశీయులు అజంతా ఎల్లోరా గుహలను సందర్శిస్తుంటారు.

WaterFall_Elloraఅనేక శతాబ్దాలుగా ఎల్లోరా గ్రామం వెరూల్‌ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ గ్రామం ప్రాచీన వాణిజ్యకేంద్రంగా పేరు పొం దింది. అరబ్‌, యూరప్‌ దేశాల నుండి ప్రజలు తమ వ్యాపార అవస రాలకు ఈ గ్రామం దర్శించేవారట. ఎల్లోరా కొండల్లోని 34 గుహ ల్లో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులో హిందూ, బౌద్ధ, జైన మతాలకు చెందిన శిల్పరీతుల్ని ప్రతిబింబించే అపురూప శిల్పాలు సర్వమత సౌభ్రాత్రుత్వాన్ని చాటుతున్నాయి. మొదటి 12 గుహలు బౌద్ధమతానికి చెందినవి. వీటిని ఐదో శతాబ్ధం నుండి ఎనిమిదో శతాబ్దం మధ్య కాలంలో చెక్కారు. 13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలూ, పౌరాణిక థల ను తెలుపుతాయి. ఇవి ఆరవ శతాబ్దం నుండి తొమ్మిదవ శతాబ్దంలో చెక్కినవి. 5 గుహలు అంటే 30 నుండి 34 గుహల వరకూ జైన మతానికి సంబంధించినవి. వీటిని ఎనిమిది - పది శతాబ్దాల మధ్య కాలంలో చెక్కినవి.

ఈ గుహల్లో ఎక్కువ భాగం ధ్యానాది సాధనలు, విద్య గడపడానికి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ప్రత్యేక గదులుగా విభజింపబడ్డా యి. కొన్ని గుహలు రెండు అంతస్తులు, మరికొన్ని 3 అంతస్తులుగా ఉండి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా కట్టబడి ఉన్నాయి. ఈ ఎల్లోరా గుహలన్నింటి లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభా లపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

bududu10వ గుహనే విశ్వకర్మ చైతన్యమని అంటారు. ఎల్లోరాలో చైత్యశాల ఇది ఒకటే. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయాలన్నింటికీ మకుటాయ మానంగా వెలుగొందుతోంది. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహ అని పిలు స్తారు. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక్కరాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడట. అందుకే ఈ గుహకు విశ్వకర్మ గుహాలయం అనే పేరు వచ్చిందని ఇక్కడివారు చెబుతారు. ఆయన ఒక్కరాత్రిలో నిర్మించా రో లేదో అనే మీమాంసకు వెళ్లకుండా ఈ గుహను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుంది.ఇక్కడ బుద్ధుని మూర్తి చాలా శాంతంగా, ధ్యానంలో నిమగ్నుడై ఎంతో సౌందర్యంగా ఉంటుంది.

అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది. నిజంగా ఈ విశ్వకర్మ గృహాలయం చాలా వింత గొలుపుతుంది.

హిందూ మతగుహలు...
Ellora-Gohoto13వ గుహ నుండి 29వ గుహ వరకు హిందూ మతానికి, హిందూ పౌరాణిక కథలను తెలిపే శిల్పాలతో ఉన్నాయి. వీటిలో 14వ గుహ రావణ పరా భావ శిల్పం అత్యద్భుతం. 15వ గుహలో నట రాజ శిల్పం, లింగం నుండి ఉద్భవిస్తున్నట్లుగా పరమేశ్వరుడు, ఆయనను స్తుతిస్తున్నట్లుగా బ్రహ్మ, విష్ణువుల శిల్పాలు అమోఘం. 16వ గుహ కైలాస గుహ అంటారు. ఈ కైలాసనాధ దేవాలయపు శిల్పం చాలా అద్భుతంగా ఉంది. ఈ దేవాలయం మొత్తం ఒకే రాతితో తొలిచి శిల్పించారు. అలాగే ఈ ఆల యం ముందు కూడా రాతి ధ్వజస్తంభం కూడా చాలా అద్భుతం. అలాగే 29వ గుహలో రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తబోవడం, శివుడు తన పాదంతో పర్వతాన్ని నొక్కడం ఈ భావాలన్నీ స్పష్టంగా ఈ శిల్పంలో చూ స్తాం.

ఈ అద్భుతమైన శిల్పాలను చూడడం కోసం యాత్రికులు తప్పకుండా ఈ గుహను చూడాల్సిందే. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటా రు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి. 25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.

జైనమత గుహలు...
Ellora-Caves1మిగిలినవి ఐదు గుహలు. ఈ ఐదూ జైనులకు సంబంధించినవి. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కినట్లున్నాయి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పా లున్నాయి. 32వ గుహలో గోమటేశ్వరుడి శిల్పం చాలా అద్భుతం గా ఉంటుంది. ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతి ర్లింగ క్షేత్రం కూడా ఉంది. ఇక్కడి కొలువై ఉన్న స్వామిని ఘృష్ణేశ్వరుడు అంటారు. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. ఎల్లోరా సంద ర్శనకు వచ్చిన యాత్రికులు ఘృష్ణేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

- దామర్ల విజయలక్ష్మి

Sunday, August 22, 2010

శతాబ్దాత చరిత్రకు సాక్ష్యాలు.. ఎలిఫెంటా గుహలు

elephanta-caves
విశేషాలను, ప్రకృతి రమణీయతను తమలో ఇముడ్చుకున్న ఎలిఫెంటా గుహలు మహారాష్ట్ర లోని ‘ఘరాపురి ద్వీపం’ లో ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ పర్యాటక కేంద్రం జాతీయస్థాయిలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచినది. దేశవిదేశాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడి వస్తుంటారు. 1987లోనే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎలిఫెంటా గుహలకు ఆ పేరు పోర్చుగీసు వారు పెట్టారని చెబుతారు. పోర్చుగీసువారి కాలం నుండి ఆంగ్లేయులు, డచ్‌వారు ఎందరో వీటిని సందర్శించారు. 12, 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఈ గుహల్లో ఉన్న విగ్రహాల ముఖాకృతులను మార్చేశారు. 9వ శతాబ్దం, 13వ శతాబ్దాల మధ్యకాలంలో (810-1260) సిల్హారా రాజులు దీనిని నిర్మించారు. వీటిలో కొన్ని విగ్రహాలు రాష్టక్రూటులు నిర్మించారు. ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా ఈ గుహల్లో కొలువై ఉన్న విగ్రహాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

elephanta_caves1
‘త్రిమూర్తి’ విగ్రహం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపాలను పోలివుంటుంది. నటరాజు, సదాశివుడు, అర్ధనారీశ్వరుని విగ్రహాలు రాష్టక్రూటుల కళలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ రాతిలో చెక్కబడిన మందిర సముదాయం, 60,000 చ.అ. విస్తీర్ణం కలిగివున్నది. దీనిలో ముఖ్యమైన హాలు, పక్క హాళ్ళు, ప్రాంగణం లాంటి అనే కట్టడాలు ఉన్నాయి. ఇందులో సుందరమైన శిల్పాలు, శివాలయం ఉన్నాయి. ఈ మందిర సముదాయం శివుని నివాసమని ప్రతీతి. ఇక్కడ ఉన్న ప్రముఖ విగ్రహాల్లో ఒకటైన సదాశివుని విగ్రహం, ఉత్తర దక్షిణ దిశల్లో 20 అడుగుల ఎత్తులో, త్రిముఖంతో, పంచముఖ శివునికి పోలి వుండడం విశేషం. ఇలా ఆధ్యాత్మిక చింతనను, ప్రకృతి అందాలను, చారిత్రక విజ్ఞానాన్ని ఒకే చోట అందిస్తున్న ‘ఎలిఫెంటా’ గుహలు పర్యాటకులకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.