రెండు దేశాల సంస్కృతులు, వేషభాషలు మనదేశంలో ఎక్కడైనా వాడుకలో ఉన్నాయంటే.. అది గోవా తరువాత పాండిచ్చేరి మాత్రమే. ప్రస్తుతం మనదేశలంలో ‘లిటిల్ ఫ్రాన్స్’గా కొనియాడబడుతోన్న పాండిచ్చేరి స్వాతంత్య్రానికి పూర్వం ‘ఫ్రెంచి కాలనీ’ అయిన పాండిచ్చేరిలో.. ఎన్నో గతవైభవ చిహ్నాలతో పాటు.. హిందూ సంస్కృతి మూలాలను కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. అగస్త్య మహర్షి ఆశ్రయం పొందిన స్థలంగా పురాణగాథలు వెల్లడి చేస్తున్న ఈ ప్రాంతం.. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.
తమిళంలో ‘పుదు - చ్చేరి’ అంటే ‘క్రొత్త - ఊరు’ అని అర్ధం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు ‘ౌ్కఠఛీజీఛిజ్ఛిటడ‘ అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో ’ఠ’ బదులు ’’ అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో ‘పాండిచ్చేరి’ అని పిలువడం మొదలయ్యిం దని అంటారు. తరువాత అదే పేరు వాడుకలోకి వచ్చిందట. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా ‘పుదుచ్చేరి’ అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.
ఇదీ చరిత్ర...

విభిన్న సంస్కృతుల సమాహారం...

అలాగే.. బంగాళాఖాతం తీరంలోనే, మన రాష్ట్ర అంతర్భాగంగా, కాకినాడకు సమీపంలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానాం విస్తరించి ఉంది. ఇక చివరిదైన మాహె.. అరేబియన్ సముద్ర తీరాన 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పాండిచ్చేరిలోని నాలుగు జిల్లాల జనాభా మొత్తం సుమారు 10 లక్షలకు పైబడే ఉంటుంది.
ఇక్కడ చూడాల్సినవివే..
పాండిచ్చేరిలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బీచ్, బొటానికల్ గార్డెన్, మ్యూజియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెరినిటీ బీచ్. ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ బీచ్ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. ఈ సెరినిటీ బీచ్లో ముఖ్యంగా రెండు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం, మరొకటి యుద్ధ స్మారక చిహ్నం. బీచ్కు కొంచెం దూరంలో ఉండే లైట్ హౌస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది 150 సంవత్సరాల క్రితం కట్టబడిందంటే నమ్మలేంి్ట. పాండిచ్చేరి స్పెషాలిటీ ఒక్క బీచ్ మాత్రమే కాదు.. అనేక చారిత్రక కట్టడాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ఫ్రెంచ్ సంస్కృతి, పచ్చదనం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
తరువాత చెప్పుకోవాల్సింది.. బొటానికల్ గార్డెన్. దీన్ని ‘ఐలాండ్ ఆఫ్ పీస్’ అని పిలుస్తారు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్ గార్డెన్ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. భారతదేశంలోని పూల మొక్కలే కాకుండా, విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల పూల మొక్కలను ఇక్కడ మనకు దర్శనమిస్తాయి.
ఈ బొటానికల్ గార్డెన్లో ఓ ఆక్వేరియం కూడా ఉంది. అందులోని అరుదైన ‘ఆర్నమెంటల్ చేపలు’ భలే అందంగా అలరిస్తుంటాయి. పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్ను దర్శించకపోతే... వారి విహారం పూర్తి కానట్టే లెఖ్ఖ. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ ప్రాంతం పాండిచ్చేరి మ్యూజియం. భారతి పార్కులోగల ఈ మ్యూజియంలోని శిల్ప సంపద ఒకదాన్ని మించి మరొకటి మనల్ని కట్టిపడేస్తుంది.
ఇలా వెళ్లాలి...
పాండిచ్చేరికి ఎలా వెళ్లాలంటే.. విమానంలో అయితే పాండిచ్చేరికి 135 కిలోమీటర్ల దూరంలో చెనై్న ఎయిర్పోర్టు ఉంది. ఇక్కడ నుండి విల్లుపురం రైల్ జంక్షన్ మీదుగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. పాండిచ్చేరికి సమీపంలో విల్లుపురం, మధురై, త్రివేండ్రం.. రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడినుండైనా సులభంగా పాండిచ్చేరి చేరుకోవచ్చు.
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment