విహారాలు

India

Gamyam

Wednesday, December 28, 2011

అందాల ప్రకృతికి....‘అరుణో’దయం

అక్కడ పేరొందిన పురాతన కట్టడాలు ఎక్కువగా లేవు. చారిత్రాత్మక ఆలయాలకూ ఆ ప్రాంతం ఒకింత దూరమే... అయితే... బౌద్ధ చైత్రాలకు మాత్రం పెట్టింది పేరు. ఎటు చూసినా నిండా పరుచుకున్న పచ్చదనంతో... నీరెండకు మిలమిలా మెరిసిపోయే మంచు శిఖరాల అందాలతో ఆ ప్రాంతం పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. భానుడి తొలి కిరణాలు పరుచుకునే ఆ ఈశాన్య సౌందర్యం పేరే... అరుణాచల్‌ ప్రదేశ్‌.
http://www.indialine.com/travel/images/arunachal.jpg
అరుణాచలప్రదేశ్‌ భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో వున్న రాష్ట్రాలలో ఇది ఒకటి. ఇది సరిహద్దు రాష్ర్టం. దీనికి తూర్పున చైనా, బర్మా, పశ్చి మాన భూటాన్‌, దక్షిణాన అస్సాం, ఉత్తరాన చైనా సరి హద్దు దేశాలుగా వున్నాయి. ఇది ఎన్నో గిరిజన భాషలమ యంగా వుంది. ఇందులో 330 కి.మీ. జాతియ రహదారి ఉంది. ఇది అతి తక్కువ జనాభాగల ప్రాంతం. ఇందులో అనేక రకాల జాతులు కలగాపులగంగా వున్నాయి. ఒకప్పుడు దీనిని రహస్య ప్రదేశం అని అనేవారు. ఇక్కడ నదీ ప్రవాహాలు, కొండ ప్రాంతాలు ఎక్కువ. http://www.tourotravel.com/wp-content/uploads/2010/09/Roing-Arunachal-Pradesh.jpg
కొండ శిఖరాలు మంచుతో కప్పబడి ఎంతో మనోహరంగా వుం టాయి. యాత్రికులను ఆకర్షించేందుకు ఎన్నోరకాల అవ కాశాలు వున్నాయి. ఈ ప్రాంత ప్రజలు మంగోలియా, టిబెట్‌, బర్మా వంశాది జాతులుగా వుంటారు. అపటానీస్‌ కాంపిటీస్‌ పద్మాజ్‌, మిరీస్‌ జాతులవారు వున్నారు. ఇం దులో ఎక్కువ భాగం బౌద్ధులు. అరుణాచల ప్రదేశ్‌లో నృత్యం జీవితంలో ప్రధాన భాగం. వీరు చేసే నృత్యం యుద్ధానికి సంబంధించినట్లు వుంటంది. అరుణాచలర్‌ ప్రదేశ్‌ వెళ్లాలంటే... అస్సాం గుండా వెళ్ళాలి. ఈ రాష్ట్రం లోని ప్రధాన రైల్వేస్టేషన్‌ రంగ్‌పారలఖింపూర్‌ నార్త్‌, డ్రిబూఘర్‌, ధిమ్స్‌కియా, నహర్క్‌టియా ఇవన్నీ కూడా అస్సాంలోనే వున్నాయి. http://3.bp.blogspot.com/-Hsb1oxrkGvI/TdTNJGT861I/AAAAAAAAAO4/NKSlHuK6SiQ/s1600/hilltribal.com.jpghttp://travel.india.com/wp-content/uploads/2011/11/Switchbacks_Himalayas_Arunachal_Pradesh.jpg
దీనికి దగ్గరలో వున్న విమానా శ్రయం గౌహతి, తేజపూర్‌, డిబ్రూఘర్‌ ఈ మూడు ప్రదే శాలు కూడా అస్సాంలోనే వున్నాయి. అన్ని రకాల విహార కేంద్రాలకి వెళ్ళాలన్నా టాక్సీలోనే వెళ్లాలి. అరుణా చల్‌ప్రదేశ్‌కు ఏ విధమైన చారిత్రక రికార్డులు లేవు. కాని దీనికి సాహిత్యం కొన్ని చారిత్రక శిథిలాలు దీని సరిహ ద్దులలో ఉన్నాయి. దీని ఫలితంగా ఎన్నో చారిత్రక శిథిలా లు క్రీస్తుశకానికి ముందువి కనిపించాయి. ఈ ప్రాంతపు ప్రజలు మిగిలిన ప్రాంతపు ప్రజలతో సంబంధాలు వున్నట్లు ఎక్కడా కనిపించలేదు.

చూడవలసిన ప్రదేశాలు...

 http://www.hotelkhoj.com/media/upload/image/hotelstate/Arunachal-Pradesh/ujjayanta-palace.jpg 

తవాంగ్‌ చేరేందుకు 200 మైళ్ళు హిమాలయ పర్వతాలపై ప్రయాణం చేయాలి. ఇక్కడ వున్న భిన్న భిన్న సాంస్కృతులు కెలడియో స్కొపుకు కలసి కలగాపులగం గా కనిపిస్తాయి. తేజపూర్‌ నుంచి ఇక్కడకు 80 నిమిషాల లో హెలికాప్టర్‌ మీద ప్రయాణం చేయవచ్చు. హెలికాప్టర్‌ లో ప్రయాణం చేస్తే రోజు రోడ్డు మీద కనిపించే ఎన్నో సుందరదృశ్యాలు చూడలేని వారం అవుతాం. తవాంగ్‌ లోని ప్రతి ఒక్క భాగాన్ని చూడాలంటే మూడు రోజులు చాలవు. http://travel.sulekha.com/india/arunachal-pradesh/photos/arunachal-pradesh-6.jpg
ఇవన్నీ చూడాలంటే తేజపూర్‌లో వుండి 5 రోజులపాటు చూడాలి. ఈ ప్రాంతం గుండానే అనాది కాలంలో టిబెట్‌ నుండి బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాలకు తేజపూర్‌ ద్వారా ఇక్కడకు వస్తారు. శారిదార్‌ సాంప్రదా యక వ్యాపార కేంద్రం. ఇక్కడ నుండి నమెరివైల్డ్‌ లైఫ్‌ రిజర్వ్‌కు ఏనుగుల రక్షిత ప్రదేశం. భరేలి నది ఎప్పుడూ ప్రవహిస్తుందో, ఎప్పుడు ప్రవహించదో ఎవరికి తెలి యదు. కొన్ని సందర్భాలలో ఈ నదీ ప్రవాహానికి యాత్రి కులు కొట్టుకుపోయిన సందర్భాలూ వున్నాయి.

అంతా అరణ్యాచలమే...

 http://www.t2northeastindia.com/includes/images/arunachal_pic2.jpg 

అస్సాం, అరుణాచలప్రదేశ్‌లను విభజించే భలుక్‌ పాండ్‌ తేజపూర్‌కు 60 మేళ్ళ దూరంలో నది ఒడ్డునగల ప్రదేశం ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడకు యాత్రికులు, వినోద పర్యాటకులు వస్తారు. వీటిని చూసేందుకు ఏ విధమైన అనుమతి అక్కరలేదు. ఎంతో ఆసక్తిదాయకమైన బొమ్మ డాల బులెన్‌ పొంగ్‌కు 100 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుంచే హిమాలయా పర్వతాలకు పర్వతారోహణ ప్రారంభిస్తారు. బొమ్మడాల నుంచి 109 కి.మీ. దాటిన తరువాత నిజమైన పర్వతారోహణ ఆరంభం అవుతుంది. 13828 అడుగులు ఎత్తు వరకు కారు మీద ప్రయాణం చేయవచ్చు. ఇక్కడి రోడ్లు సరిగా వుండవు. సంగ్రిల్లా, బైసాకి, ఆర్మి స్థావరాలు దాటిన తరువాత గాలి ఒక్కసారి చల్లబడిపోతుంది. http://travel.sulekha.com/india/arunachal-pradesh/bhalukpong/bhalukpong/photos/arunachal-pradesh-21.jpg
ఈ కొండపై ఒక గుడి వుంది. ఈ గుడి ని హిందూ బౌద్ధులు సమానంగా పూజిస్తారు. ఈ రెండు కూడా ఒకదానికొకటి కలుసుకుని వుంటాయి. ఇంకొం చెం దూరంలో 3వది వుంటుంది. దీనికి దగ్గరలో పైన్‌ అడవులు వున్నాయి. ఇక్కడకు 21 కి.మీ. దూరంలో జస్వంత్‌ఘర్‌ ఒక సైనిక యుద్ధ మ్యూజియం వుంది. తవాంగ్‌లోయ తవాంగ్‌ చైత్యానికి 57 కి.మీ. దూరంలో వుంది. లహుగ్రామం చైనా సరిహద్దు ప్రాంతం అయిన బరల్లాను కలిసి వుంటుంది.

ఇక్కడ అతి పెద్దదైన యుద్ధ స్మారక చిహ్నాలు వున్నాయి. తవాంగ్‌ పట్టణానికి వాలుగా హిమాలయ పర్వత సానువులు వున్నాయి. దక్షిణాన తవాంగ్‌చూ నది ప్రవహిస్తుంది. తూర్పున కొన్ని కొండ శిఖరాలు వున్నాయి. ఇవన్నీ కూడా అవకాశం చేత కప్ప బడి వుంటాయి. అన్ని కూడా పూర్తిగా మంచుచేత కప్పబడి వుంటాయి. పసుపుపచ్చని తవాంగ్‌ చైత్యం కనిపిస్తుంటుంది.

బౌద్ధానికి ఆలవాలం...

 http://www.iitg.ernet.in/scifac/rsw/public_html/tawang_monastery_entrance.jpg 

తవాంగ్‌ చైత్యం 16వ శతాబ్ధిలో నిర్మితమైంది. గెల్‌ గుపా జాతికి చాలా బలహీనమైన కేంద్రం. ఇది ఈ ప్రాంతాన్ని 400 ఏళ్ళ నుం డి ప్రభావితం చేస్తోంది. ఇది హిమాలయ ప్రాంతంలోని భిన్న బౌద్ధ వర్గాలవారిని స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. ఇక్కడ వున్న బుద్ధ ప్రధాన ఆచార్యులను నీరాలామా అంటారు. ఆయన ఈ చైత్యం కట్టేందుకు కారకుడు. నీరాలామా తమ వర్గాన్ని మిగిలిన వర్గాల వారితో పోట్లాడేందుకు స్థిరమైన స్థావరంగా దీనిని నియ మించారు. నీరాలామా దలైలామాతో చర్చించి గెల్గ్‌పాను ఈ ప్రాంతంలో బలోపేతం చేసి ఆయన ఆశీర్వాదం పొందారు. http://travel.paintedstork.com/blog/image/buddha_tawang_monastery.jpg
నీరా లామా మొదట కోర్టుగాను తరువాత మత విషయక చైత్యంగాను తయారు చేశాడు. అన్ని రకాల వర్గాల ప్రజలతో పోరాడేందుకు బౌద్ధ సన్యాసులకు ప్రజలకు సైనిక శిక్షణ ఇచ్చాడు. వీరికి 13 బ్రెస్‌ సిరిల్‌ ఇచ్చేవాడు. అందులో 10 కి సైనికంగా చేరేందుకు ఇస్తారు. ఖచ్చితంగా ఏ తేదీన ఈ చైత్యం నిర్మించారనేది తెలియ టం లేదు. సోనా ప్రస్తుతం దక్షిణపు టిబెట్‌లో వున్న సోనా చైత్యం లామాలు తవాంగ్‌కు వచ్చి ఇక్కడి అగ్ని గుండాల వద్ద కూర్చుని వెళ్ళేవారు. 26 అడుగుల ఎత్తు బౌద్ధ విగ్రహాన్ని తమకు అప్పగిం చవలసిందని సోనాలామా లుతవాన్‌ చైత్యాధికారులను అడిగారు. వారు అంగీకరించలేదు. తవాంగ్‌కు చెందిన అనేక ప్రాచీన వ్రాతప్రతులను సోనాలామాలు బలవంతంగా ఎత్తుకుపోయారు.

వాటిలో తవాంగ్‌ చరిత్ర కూడా వుంది. ఈ బంగారు బుద్ధ విగ్ర హం నేడు చూడవచ్చు. వచ్చిన యాత్రికులు వినోద పర్యాటకులు ఫోటోలు తీయవచ్చు. ఇప్పటికి ఈ చైత్యపు గ్రంథాలయంలో అనేకమైన బౌద్ధ వ్రాతప్రతులు వున్నాయి. వీటిలో ఎక్కువభాగం బంగారు సిరాతో రాసినవి. ఎక్కువ భాగం ఎర్రటి గుడ్డతో చుట్టారు. ఎవరయినా యాత్రికులు అడిగితే దానిని ప్రార్థనలు చేసి వాటిని తీసి చదువుతారు. ఈ మొత్తపు గ్రంథాలయపు భవనాన్ని పునరుద్ధరించారు.

లోపల మండలాలు చక్రాలు, కప్పులు పైకప్పు లకు రంగులు వేశారు. ముడ్జిలింగ్‌ అరవదలైలామా పుట్టిన ప్రదేశం దీనికి కొంచెం దూరంలోనే వుంటుంది. ఇక్కడ పెద్ద చెట్టు అయిదవ దలైలామా కాలం నాటిది ఇంకా వుంది. దీనికి కొంచెం దూరంలో సంగే ర్యాబ్‌ గెల్లింగ్‌ సత్రం దీనికి దగ్గరలో వుంది. ఇదంతా చెట్లతోటి నింది వుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అడవు లుగాను నరికివేశారు. కిన్‌మే చైత్యం హిమాలయ పునర్నిర్మాణం. ఇది న్యాంగ్‌పా వర్గంవారిది. ఇది ఈ ప్రాంతంలోని చాలా ప్రాచీన చైత్యం. ఇది తైవాన్‌ బుంలా సింషోర్‌ను నది దగ్గర వుంది. ఇక్కిడ నుండి సాయంకాలం నది వద్దకు నడిచి వెళ్ళవచ్చు. ఇది ఒక గంట నడక.

Tourism in Itanagar
ఐతానగర్‌...
ఇది అరుణాచలప్రదేశ్‌కు రాజధాని. ఇది పెద్ద చారిత్రక పట్టణం. ఇది డాన్‌లిట్‌ మౌంటెన్‌ పర్వత భూమి అని అందరికి తెలుసు. ఇది మాయాపూర్‌ అని 14, 15 శతాబ్ధాలలో పిలిచేవారు. అదే నేటి ఐతానగర్‌, ఇక్కడ ఐతానగర్‌ కోట బుద్ధిస్ట్‌ చైత్యం, జవహర్‌లాల్‌ మెమోరియల్‌ మ్యూజియం, జూ, క్రాఫ్ట్‌ సెంటర్‌, సహర్‌లగూంలో పోలో పార్క్‌ బోటింగ్‌ సౌకర్యాలు ట్రెక్కింగ్‌కు ఇవి ఎంతో అనువైన ప్రదేశం.

తవాంగ్‌
assam--bihu
http://www.traveldealsfinder.com/wp-content/uploads/44339061_india_tribal2_416afp.jpg
ఇది అరుణాచల ప్రదేశ్‌కు వాయువ్యాన వున్న చిన్న పట్టణం. దీనికి ఒకపక్క చైనా రెండవ పక్క భూటా న్‌లతో కలిసి ఉంటుంది. సాధారణంగా ఈ పట్టణాన్ని యుద్ధ సమయాలలో తప్ప మిగిలిన సమయాలలో దీనిని గురించి ఆలోచించరు. ఇది ఎంతో విశాలమై చలికాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో పచ్చగా వుంటుంది. ఇక్కడ అకస్మాత్తుగా పడే జలపాతాలు సరస్సులు ఈ తవాంగ్‌లో సరిహద్దులోని మైదాన దృశ్యాలు ఎంతో కష్టంగాను, అందంగాను వుంటాయి. ఇక్కడ 1962లో యుద్ధం (ఇండియా - చైనా) జరిగింది. ఇక్కడ నుండే దలైలామా భారతదేశంలోకి ప్రవేశించారు. 17వ శతాబ్ధిలో బౌద్ధమతంలోని భిన్న వర్గాల మధ్య స్పర్థలు వచ్చాయి. http://www.asianwindow.com/wp-content/uploads/2009/12/tawang-monastery.jpg
మీరాలామా అనే బౌద్ధ సన్యాసి తన తెగకు చెందిన గులుక్‌పా వర్గపు సన్యాసు లను రక్షించుటకై ఒక కోటను నిర్మించాడు. అది నేడు తవాంగ్‌ చైత్యం అని పిలుస్తున్నారు. తరువాత బౌద్ధ సన్యాసులు ఒంటిగా ఈ సత్రంలో నివాసం వుంటున్నా రు. ఇది ఇండియాలోని అతి పెద్దదైన బుద్ధ చైత్యము. ఇందులో 500 మంది బౌద్ధులు వుంటున్నారు. ఇది ప్రభుత్వపు నియమనిబంధనల వల్ల చాలా కాలం పాటు విహార యాత్రకు నోచుకోలేదు. ఇది ఎంతో అందమైన ప్రదేశం. కొన్ని సంవత్సరాల పాటు తవాంగ్‌కు ఎక్కువ గా విదేశీ యాత్రికులు చూసేందుకు అనుమతించారు. హెలికాప్టర్‌ ప్రయాణం దీని ప్రయాణ కాలాన్ని ఎంతో తగ్గించింది. ఈ ప్రాంతంలో బౌద్ధులు యుద్ధాలు ఈ ప్రాంతం చరిత్రను తిరగరాస్తూనే వున్నాయి. ఇక్కడ ప్రజలు తమ స్నేహితులకు వెన్న, టీ ఇచ్చి తరువాత క్షేమ సమాచారాలు అడుగుతుంటారు.Anwesa Chakraborty - A Lake in Arunachal Pradeshhttp://www.tourotravel.com/wp-content/uploads/2010/09/ziro.jpg
జీరో....
ఇది సబన్‌సిరి జిల్లాకు రాజధాని. ఇది సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున వున్న చేపల చెరువు. పైన్‌, వాసాలు అడవులు ఇక్కడ వున్నాయి. వరి ఎంతో ధనవంతులు భోజనం చేసే పదార్థం. విమానంలో తేజపూర్‌ వెళ్ళి అక్కడ నుండి వెళ్ళాలి. నార్త్‌ లఖింపూర్‌ దీనికి దగ్గరలోని రైల్వేస్టేషన్‌. బస్సులో ఐతానగర్‌ నుంచి నహరియాగన్‌లో వెళ్ళవచ్చు.

Wednesday, December 21, 2011

సౌరాష్ట్ర సుందర సీమ... సపుతర

ఉత్తరభారత దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే... ఎవరైనా ఇట్టే చెప్పే సమాధానం గుజరాత్‌. అయితే... ఆ రాష్ట్రం పర్యాటకంగా వెనుకబడే ఉందని చెప్పుకోవాలి. కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పర్యాటకరంగం కూడా చేరిపోయింది. విహారేకంద్రాలు ఎక్కువగా లేకపోవచ్చు కానీ, పుణ్యక్షేత్రాలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు మరే రాష్ట్రంలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో! గుజరాత్‌ పొడవునా లెక్కలేనన్ని పవిత్ర స్థలాలు ఉన్నాయి. ప్రతిరోజూ లక్షలాదిమంది పర్యాటకులు వాటిని సందర్శిస్తుంటారు. గుజరాతీల ఆధ్యాత్మిక దృక్పథానికి ఇదే నిదర్శనం. పర్యాటకరంగంలో వెనకబడి ఉన్నప్పటికీ... కొన్ని పర్యాటక కేంద్రాలు మాత్రం పర్యాటకులను ఆకర్షించడంలో అగ్రభాగాన నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో... గుజరాత్‌లోని ఏకైక పర్వతప్రాంతం సపుతర ఒకటి. వారాంతపు విడిదిలో ఇది రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పవచ్చు.
http://www.indianmirror.com/tourism/images/suputaramainimg.jpg
సౌరాష్ర్ట నుండి సూరత్‌ దాకా ఏకంగా 1600 కిలోమీటర్ల తీరరేఖ గుజరాత్‌ సొంతం. అందువల్ల ఇక్కడ బీచ్‌లకు కొదువలేదు. చోర్వాద్‌, సోమనాథ్‌, ద్వారక, అహ్మద్‌పూర్‌, మాండ్వీ, తిథల్‌, డ్యూమస్‌ వంటి ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. కానీ పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యల తీసుకోవడంలో వెనుకబాటుతనం కారణంగానే ఇన్ని మంచి బీచ్‌లు ఉండి ఎవరినీ ఆకర్షించలేకపోతున్నాయి. కానీ గుజరాత్‌లోని సపుతర మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇది కూడా ఏళ్ళ తరబడి నిరాదరణకు గురైందే. కానీ ఇప్పటికైనా గుజరాత్‌ సర్కారు దీనిపై దృష్టి సారించింది. దీనిని ఓ మంచి పర్యాటక కేంద్రంగా మలిచేందుకు నడుం బిగించింది. ఇప్పుడు మరో కొన్నేళ్లలో సపుతర మంచి పర్యాటక కేంద్రంగా ఎదిగేందుకు అన్ని చర్యలూ చేపట్టింది.

ఎక్కడుంది...

 http://travel.vandeindia.com/wp-content/uploads/2009/09/Saputara-Lake.jpg
సపుతర సముద్ర మట్టానికి కిలోమీటరు ఎత్తున ఉంది. గుజరాత్‌లోని చాలామందికి ఇది పెద్ద హిల్‌ స్టేషనేమీ కాదు. షిరిడీ వెళ్లే దారిలో మహారాష్ర్టకు కాస్త సమీపంలో ఉంటుంది. దక్షిణ గుజరాత్‌లోని వాఘాయ్‌ అనే ఈ చిన్న పట్టణంలో సాదాసీదాగా గిరిజన జనాభా, దట్టమైన అడవి ఉంటాయి. అహ్మదాబాద్‌, బరోడా, సూరత్‌ల నుంచి సమీపంలో ఉంటుంది. 
http://www.uniquelifecare.com/images/places/Saputara_Lake.jpg
కాబట్టి చాలామంది పర్యాటకులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరో రోడ్డు అహ్వా నుంచి ఉంటుంది. ఇది గుజరాత్‌లోకెల్లా అత్యంత చిన్న జిల్లా అయిన దంగ్‌కు ప్రధాన పట్టణం. అహ్వా నుంచి బస్సు మార్గాన ఇక్కడికి మూడు గంటలు పడుతుంది. కానీ ఆ రోడ్డు కాస్త ప్రమాదకరం. రోలర్‌కోస్టర్‌ రైడ్‌ను తలపిస్తుంది. 
http://www.saputara.net/saputararesorts/shilpihillresort/shilpi.jpg
1966 లో ముంబై రాష్ర్టం నుండి గుజరాత్‌ విడిపోయాక సపుతరను రాష్ర్టంలోకెల్లా ఏకైక వేసవి విడిదిగా ప్రకటించాలని గుజరాత్‌ నిర్ణయించింది. కానీ, వేసవి, శీతాకాలం, వర్షాకాలం అని తేడా లేకుండా అన్ని కాలాల్లో పర్యాటకులకు కనువిందు చేస్తోంది ఈ పర్వత ప్రాంతం. ప్రకృతి ఒడిలో సాహసాలు చేయాలనుకునేవారికి ఇది సరైన ప్రాంతం. http://i654.photobucket.com/albums/uu267/aruddharaj/Saputara%20-%20hill%20resort%20of%20Gujarat/Gira-waterfall-saputara.jpg
రూట్‌ గైడ్‌...
అహ్మదాబాద్‌, బరోడా, సూరత్‌ ల నుంచి పుష్కలంగా బస్సులుంటాయి. లేదంటే వాఘై, అహ్వాల నుంచి కూడా రావచ్చు. అదీ కుదరకపోతే... అహ్మదాబాద్‌ నుంచి బిలిమోరా (400 కిలోమీటర్లు) వెళ్లే రైలులో తక్కువ ఖర్చుతో ఇక్కడి చేరుకోవచ్చు. ఆ తరువాత లోకల్‌ ఎస్టీ బస్సు ఎక్కితే సపుతర చేరుకున్నట్టే! సొంతవాహనంలో బయలుదేరితే గనక పెట్రోల్‌ ట్యాంక్‌ ను నిండుగా కొట్టించడం పొరపాటున కూడా మరిచిపోవద్దు. తర్వాత వాఘై, అహ్వాల్లో మరోసారి ట్యాంక్‌ నింపుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సపుతరలో పెట్రోల్‌ పంపు లేదు మరి!

ప్రకృతి అందాల విందు....
Saputara2 

సపుతరలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘గాంధీ శిఖర్‌’. ఈ శిఖరాగ్రానికి ట్రెక్కింగ్‌ చేయడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. కిందనుంచి నదిమీద పడుతున్న తొలి కిరణాలు ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌ చేయడం మాటల్లో వర్ణించలేని అనుభూతిని మిగులుస్తుంది. పచ్చని కొండలమీదుగా అవి పరుచుకునే అద్భుతదృశ్యాన్ని అలా చూస్తూ మైమరిచిపోవడం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సర్వసాధారణమైన అనుభవం. వర్షాకాలంలో ఇక్కడ ఎంత వర్షం పడుతుందో లెక్కగట్టాలంటే కొంచె కష్టమే మరి. ప్రతి సీజన్‌లో సుదీర్ఘంగా వానపడ్డాక అత్యంత దట్టమైన పచ్చదనం ఈ ప్రాంతాన్ని నిండా పరుచుకుపోతుంది. వేసవిలో గవర్నర్స్‌ హిల్స్‌ మీదుగా వెళ్తుంటే పశ్చిమాన సూర్యుడు సపుతర చెరువు లోకి కుంగుతుంటాడు.

చూస్తుండగానే దట్టంగా చీకట్లు పరుచుకొని వెలు గులు విరజిమ్ముతాయి. ఈ అద్భుతం చూడటానికి రెండు కళ్లూ చాలవు. సపుతర బస్టాండ్‌ చేరుకోగానే ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చిరునవ్వుతో నిలుచున్న రెండు అతిపెద్ద భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తాయి. ఏదో ఒక రోజు అమితాబ్‌ బచ్చన్‌ కూడా మోడితో కలిసి కన్పించడం కూడా ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే గుజరాత్‌ పర్యాటక శాఖ బిగ్‌ బీ ని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ పర్యాటక కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో కూడా ప్రకటించింది. కాస్త సమయం పట్టినా సపుతర పర్యాటకులకు మరింత అందాల విందు చేయడం ఖాయం. సపుతర ఇప్పటిదాకా పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా వారాంతాల్లో సరదాగా కుటుంబమంతా కలిసి వెళ్లేందుకు ఎంతో అనువైన ప్రదేశం.

సందర్శించాల్సినవి ఇవీ...

 http://www.holidayiq.com/images/property/resortimg/1997_3.jpg 
ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. బోటింగ్‌ క్లబ్‌, ఎకో పాయింట్‌ అటవీ నర్సరీ, ఆర్టిస్టుల విలేజీ, లేక్‌వ్యూ గార్డెన్‌, మ్యూజియం, నాగేశ్వరాలయం, పూర్ణ శాంక్చురీ, సన్‌సెట్‌ పాయింట్‌, రోజ్‌ గార్డెన్‌, స్టెప్‌ గార్డెన్‌, సపుతర చెరువు, సన్‌రైజ్‌ పాయింట్‌, టౌన్‌ వ్యూ పాయింట్‌, వంశద నేషనల్‌ పార్క్‌, వ్యాలీ వ్యూ పాయింట్‌ మిలీనియం గార్డెన్‌ టేబుల్‌ పాయింట్‌, గవర్నర్స్‌ హిల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. దాంగ్‌ జిల్లాలోని 300 పైచిలుకు గ్రామాల్లో 94 శాతం గిరిజనులే ఉంటారు. గమిట్‌, కంబీ, వర్లీ, వసవస్‌ వంటి స్థానిక గిరిజన సమూహాలు వంట చెరుకు కొట్టి, తేనె సేకరించి జీవనోపాధి పొందుతుంటారు. http://i1.trekearth.com/photos/60273/table_top_hill.jpg
ఇక ఆర్టిస్టుల గ్రామం ఇలాంటి గిరిజన సమూహాల వారే స్థాపించుకున్నారు. వారు అడవి నుంచి వెదురు సేకరించి పలు సాంప్రదాయ కళారూపాలను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఆర్టిస్టుల గ్రామం సపుతర - నాసిక్‌ మెయిన్‌ రోడ్డు పై ఉంది. లోయ నడుమ భాగంలో సపుతర చెరువు ఉంటుంది. ఇది 21 మీటర్ల లోతున లోయ అంతటా పరుచుకుని ఉంటుంది. సపుతరలో ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులేవీ ఉండవు. కాబట్టి ఇక్కడికి రావాలంటే మార్చి నుండి నవంబర్‌ వరకు ఎప్పుడైనా రావచ్చు.

Tuesday, December 20, 2011

కమనీయ ప్రకృతి ‘తీరం’.... కనపర్తి

సెలవు దినాల్ని ఆహ్లాదకరంగా గడపాలనుకునేవారు ముఖ్యంగా పార్క్‌లకు బీచ్‌లకు వెళ్లడం చేస్తుంటారు. అయితే... ఆ బీచ్‌లకు దగ్గరే గుళ్లూ, గోపురాలు, చారిత్రక స్థలాలు కూడా ఎలా ఉంటే ఎలావుంటుంది? ప్రకృతి ఆహ్లాదంతో పాటు... ఆధ్యాత్మిక అనుభూతి, చారిత్రక విజ్ఞానం కూడా మీ సొంతమవుతుంది కదూ! మరి అలాంటి అరుదైన ప్రదేశమే... ఒంగోలు జిల్లాలోని కనపర్తి. శాతవాహనుల ఏలుబడిలో ఎంతో పేరుగాంచిన కనపర్తిలో... ఈ బీచ్‌తోపాటు విశిష్టతను సంతరించుకున్న ధారాలింగం, ఒక పురవాస్తు శాల వంటివెన్నో మీకు ఆధ్యాతిక, వైజ్ఞానిక విషయాలను ఎన్నో బోధిస్తారు. నాగులుప్పలపాడు మండలంలోని "కనపర్తి". వయ్యారాలు ఒలికించే సముద్ర తీరం.. విజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకు నెలవైన మ్యూజియం ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే అద్భుతమైన అనుభూతులను పదిలం

Kanaparthi_Beach 
బ్రహ్మకుండి అని పిలువబడే గుండ్లకమ్మ నది, అనంతసాగరంలో కలగలసిపోయే ప్రాంతంలో వెలసిన ప్రదేశమే కనపర్తి. శాతవాహన పాలకులు పరిపాలించిన, పవిత్ర పుణ్యక్షేత్రంగా అలరారిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, శిల్పాలు దర్శనం ఇస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో వెలసిన కనపర్తి క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకూ విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
గొప్ప నాగరికత, సంస్కృతి, శిల్పకళారీతులతో ఆ రోజుల్లో "కనకాపురి" పట్ణణంగా విరాజిల్లిన కనపర్తి ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా అక్కడి పురాతన విగ్రహాలు పర్యాటకులు స్వాగతం పలుకుతాయి. ఇలా చరిత్రకు సాక్షీభూతాలుగా మిగిలిన ఈ విగ్రహాలతో రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది.
ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల బ్రహ్మపాశాలు కలిగిన శివలింగాలు, వివిధ ఆకృతుల్లో కనిపించే నంది, విఘ్నేశ్వర, దుర్గాదేవి విగ్రహాలు.. నాగబంధాలు, బిక్షాటన చేస్తున్నట్లుగా ఉండే భైరవుడు, నాగ భైరవుడు, లింగోద్భవమూర్తి, పరశురాముడు, సూర్య విగ్రహం, సరస్వతీ ప్రతిమ, ధారాలింగం, సప్తమాతృకలు మొదలైన అద్భుత కళాఖండాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తుంటాయి.
బ్రహ్మపాశంగల ధారాలింగం...
కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల ధారాలింగం. దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది. గొప్ప నాగరికత, సంస్కృతి, శిల్పకళారీతులతో ఆ రోజుల్లో కనకాపురి పట్ణణంగా విరాజిల్లిన కనపర్తి ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా అక్కడి పురాతన విగ్రహాలు పర్యాటకులు స్వాగతం పలుకుతాయి. ఇలా చరిత్రకు సాక్షీభూతాలుగా మిగిలిన ఈ విగ్రహాలతో రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది.

ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల బ్రహ్మపాశాలు కలిగిన శివలింగాలు, వివిధ ఆకృతుల్లో కనిపించే నంది, విఘ్నేశ్వర, దుర్గాదేవి విగ్రహాలు.. నాగబంధాలు, బిక్షాటన చేస్తున్నట్లుగా ఉండే భైరవుడు, నాగ భైరవుడు, లింగోద్భవమూర్తి, పరశురాముడు, సూర్య విగ్రహం, సరస్వతీ ప్రతిమ, ధారాలింగం, సప్తమాతృకలు మొదలైన అద్భుత కళాఖండాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తుంటాయి.

పూర్వకాలంలో కనాపురి పట్టణంలో వాడిన రాతి గొడ్డళ్లు, ఇటుకలు, అలంకరణ సామగ్రి, పూసలు.. తదితర వస్తువులు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి. అలాగే అనేక బావులు, వాటి నిర్మాణానికి వినియోగించిన పెద్ద పెద్ద ఇటుకలు, బ్రహ్మలిపిలో ఉండే బౌద్ధ స్తూపాలు, ప్రాకృత భాషలో గల విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయులవారి శాసనాలు, ద్రావిడ భాషల్లో గల తూర్పు చాళుక్యుల, చోళుల శాసనాలను మనం అక్కడ చూడవచ్చు.

ఇక కనపర్తి గ్రామంలోని శైవ, వైష్ణవ ఆలయాలు ఆనాటి ప్రజల జీవన చిత్రాన్ని కళ్లకు కట్టేటట్లుగా ఉన్నాయి. కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల ధారాలింగం. దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది. దీంతో ఈ శివలింగం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.
పురావస్తు ప్రదర్శన శాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కనపర్తి సముద్ర తీరం సౌందర్యం వర్ణనాతీతం. సాధారణంగా సముద్ర తీరానికి వెళ్లిన వారికి దూరంగా మాత్రమే ఒంపు కన్పిస్తుంది. ఒంపు వద్దకు వెళ్లాలని ప్రయత్నిస్తే, మరికొంచెం దూరంలో కన్పిస్తుంది. అయితే కనపర్తి తీరంలో మాత్రం ఒయ్యారాలు ఒలకబోస్తున్నట్లుండే సముద్ర తీరపు ఒంపుసొంపులను దగ్గర్నించే చూడవచ్చు.

కనపర్తికి ఎలా చేరుకోవాలంటే.. ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనున్న కనపర్తికి చేరుకోవాలంటే ఒంగోలు డిపోనుంచి ఉదయం 5 గంటలనుంచే ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. కనపర్తిలో మ్యూజియం, శివాలయం, సీతారామచంద్రుల ఆలయాలు కూడా దర్శనీయ స్థలాలే. మ్యూజియంలో ఎల్లప్పుడూ గైడ్‌ అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి సముద్ర తీరానికి చేరుకోవాలంటే మ్యూజియం నిర్వాహకులే వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలలో కూడా కనపర్తి సముద్ర తీరానికి చేరుకోవచ్చు.

Friday, December 16, 2011

స్వర్ణోత్సవ...గోవా

http://artandculture.goa.gov.in/golden-jubilee-award/images/goa5.jpg
చల్లని సాయం సమయం... పున్నమి వెన్నెల్లో... ఇసుక తిన్నెలపై... అప్పుడప్పుడూ వచ్చి పలకరించి వెళ్లే అలలు... ఒంటికి హాయిగొలిపే పిల్ల తిమ్మెరలు... వింటేనే ఎంతో హాయిగావుంది కదూ... అలాంటి అద్భుత వాతావరణంతో పాటు... శతాబ్దాల చారిత్రక విశిష్టతను, అరుదైన కట్టడాలను, సర్వమత సౌభ్రాతృత్వాన్ని తనలో ఇముడ్చుకుని వందల ఏళ్ళుగా భారత పర్యాటక రాజధానిగా విరాజిల్లుతోంది గోవా. పోర్చుగీసు పాలన నుండి విముక్తిపొంది... స్వతంత్ర భారతావనిలో భాగమై స్వర్ణోత్సవ వేడుక జరుపుకుంటున్న ఈ విశ్వవిఖ్యాత విహారేకంద్రం గురించి మరోసారి మననం చేసుకుందాం...

కొంకణ తీరాన కొలువై ఉన్న గోవా... వైశా ల్యం రీత్యా దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. అయితే... పర్యాటకంగా అభివృద్ధి చెందిన విహారకేంద్రాల్లో గోవాయే భారత టూరిజం క్యాపిటల్‌ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చు గీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరుచుకొని కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగ తం చేసుకొన్నారు. అప్పటినుండి 450 ఏళ్ళ పరా యి పాలనలో ఉన్న గోవాను 1961 డిసెంబర్‌ 19వ తేదీన భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య తో గోవా భారత్‌లో విలీనమైంది.

ఇదీ చరిత్ర...
Aguada-Fort-Goa 

గోవా ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, దక్కన్‌ నవాబులు పాలించారు. 13వ శతాబ్దంలో ఇది ఢిల్లీ సుల్తానుల వశమైంది. 13వ శతాబ్దపు చివరిలో విజయనగర రాజు మొదటి హరిహర రాయలు గోవాను జయించారు. 14వ శతాబ్దపు చివరిలో బహమనీ సుల్తానులు దీన్ని కైవసం చేసు కున్నారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకుని, కొద్ది కాలంలోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. http://artandculture.goa.gov.in/golden-jubilee-award/images/goa6.jpg
1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కో డ గామా కేరళలోని కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యం. కానీ 1501లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడిన అల్ఫోంసో డి అల్బుకర్క్‌ అనే పోర్చుగీసు అడ్మిరల్‌ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావ రంగా చేయాలన్నది అప్పుడు వారి అభిమతం.



Portuguese prisoners of war, captured during the invasion of Goa by Indian military forces, are lined up at military barracks in Panaji on 28 December 1961.

అప్పటి నుండి అక్కడే స్థిరపడిన పోర్చుగీసువారు స్థానికులను పెళ్లి చేసుకున్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా పోర్చుగీసు వారు గోవాను వదులుకోడానికి ఒప్పుకోలేదు. దాంతో 1961లో ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో భారత సైన్యం గోవాను డిసెంబర్‌ 19న హస్తగతం చేసుకున్నది. 














గోవాతో పాటు డామన్‌, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కానీ 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.

http://artandculture.goa.gov.in/golden-jubilee-award/images/goa7.jpg 

 ఆహారం
వరి అన్నం , చేపల కూర ఇక్కడి ప్రధాన ఆహారం. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారు చేసే రుచికరమైన వంటకాలు సందర్శికులను ఎంతగానో సంతృష్టపరుస్తాయి. జీడిమామిడి, కొబ్బరి కల్లు నుండి తయారు చేసిన ’ఫెన్నీ’ అనే డ్రింక్‌ ఇక్కడి ప్రత్యేకత. సీ ఫుడ్‌ ఇష్టపడే వారికి గోవాను వదిలి రాబుద్ధి కాదు. అవకాశం వచ్చినప్పుడే కదా ఉపయోగించుకోవాలి. ఈ టూర్‌లో వున్నప్పుడే బోలెడన్ని రకాల వంటకాలు రుచి చూడొచ్చు.http://artandculture.goa.gov.in/golden-jubilee-award/images/goa8.jpg
ఇలా వెళ్లండి...
గోవాలో రెండు రైల్వే మార్గాలున్నాయి. ఒకటి స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన వాస్కోడిగామా - హుబ్లీ మార్గం. రెండోది 20 వ శతాబ్దంలో నిర్మించిన కొంకణ్‌ రైల్వే మార్గం. ఇక్కడ సైకిళ్ల లాగే టూ వీలర్స్‌ కూడా అద్దెకిస్తారు. వీటికి అద్దె రోజుకు 400 పైనే వుంటుంది.
బస్‌లో...
హైదరాబాద్‌ నుండి గోవాకి ఎపి టూరిజం వారి ఐదురోజుల టూర్‌ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎసి, నాన్‌ ఎసి, హైటెక్‌ కోచ్‌... ఇలా చాలా రకాలున్నాయి.
రైలులో...
హైదరాబాద్‌ నుండి కాచిగూడ టు యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉంటుంది. ఇది వాస్కోడిగామా స్టేషన్‌కు తరువాతి రోజు మధ్యాహ్నం చేరుకుంటుంది. విజయవాడనుండైతే అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (హౌరా-వాస్కోడిగామా) ప్రతి సోమ, మంగళ, గురు, శని వారాల్లో ఉంటుంది.

బీచ్‌ల నగరం...
http://www.signatureholidays.co.in/images/goa/mandovi_river.jpg
నైట్‌ రివర్‌ క్రూయిజ్‌ షిప్‌ మీద మండోవి నదిలో వెన్నెల విహారం, షిప్‌ డెక్‌ మీద డాన్సులూ, గానా భజానా... పెద్దలూ, పిల్లలూ, జంటలూ అందరూ కలిసి ఆహ్లాదంగా గడపొచ్చు. 
http://images.travelpod.com/tripwow/photos/ta-0099-ee7e-2b22/arambol-beach-goa-goa-india+1152_12780691446-tpfil02aw-12425.jpg
మిరమర్‌ బీచ్‌కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరంబోలా బీచ్‌ మారుమూల ప్రాంతం కావడం వల్ల విజిటర్స్‌ తక్కువ. ఎక్కువ మంది ఫారినర్స్‌ సన్‌బాత్‌ చేస్తూ కనిపిస్తారు. 
http://www.bugbog.com/images/beaches/india-beaches/goa-beaches-india/arambol-beach-travellers-goa.jpg
తర్వాత చూడాల్సింది చపోరా కోట. 
http://www.letseeindia.com/fortsandpalaces/images1/chapora-fort-in-goa.jpg
సముద్రం పక్కన కొండాపై నిర్మించిన ఆ కోట ఒక విజువల్‌ ట్రీట్‌. హిందీ సినిమా ‘దిల్‌ చాహతా హై’ లో ఒక పాటను ఇక్కడే షూట్‌ చేశారు. 
http://www.indiatravelpal.com/States/West%20India/Goa/Images/CALANGUTE-BEACH_goa.jpg
గోవాలో చాలా ఫేమస్‌ అయినది కలన్‌గుటే బీచ్‌. దీన్ని క్వీన్‌ ఆఫ్‌ బీచ్స్‌ అంటారు. ఇది చాలా రద్దీగా వుంటుంది. పారాసైలింగ్‌ లాంటి వాటర్‌ స్పోర్ట్‌‌స ఇంట్రెస్ట్‌ ఉంటే ఇక్కడ చక్కని కాలక్షేపం. 
http://www.threebestbeaches.com/wp-content/uploads/2009/01/baga-beach-goa-india.jpg
తర్వాత ‘బగ బీచ్‌’ నైట్‌ లైఫ్‌కి చాలా ఫేమస్‌. ఇక్కడ కొన్ని పబ్స్‌ రాత్రి 11 గంటల తర్వాతే ప్రారంభమయ్యేవి కూడా ఉన్నాయి. కాని వాటిల్లో కపుల్స్‌కు మాత్రమే ప్రవేశం.http://artandculture.goa.gov.in/golden-jubilee-award/images/goa2.jpg
గోవా పేరు ఇలా...
గోవా లేదా గోమాంటక్‌ అని పిలిచే ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పషష్టమైన ఆధా రాలు లేవు. ఈ ప్రాంతానికి మహాభారతం లోనూ, ఇతర ప్రాచీన గ్రంధాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమం చాల, గోవపురి వంటి పేర్లు వాడుకలో ఉండేవి. కాలగమనంలో గోవా పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ దేశంలో మరెక్కడా లేనన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి.

పర్యాటకమే ప్రధాన వనరు....
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEix2LcwqAxpK69ketaKDsOXkYJijsDtK7g0GzZroFgOwzDyyqU968OX3CaKFBZD1u8mQYVfm7VHCLhVvUhX3Fqrbfiw3FJgoTFD-NwA5vy6Z3nx36K9mKxjcD2nXBM5cd5MulmiJJcgMO4-/s1600/goa-leisure.jpg
ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఇక్కడి ఆర్థిక రంగం వృద్ధిచెందడమే. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది. 
http://static.ibnlive.in.com/ibnlive/pix/sitepix/10_2010/anjuna-beach-goa-630.jpg
భారతదేశానికి వచ్చే విదేశీ యాత్రికుల్లో 12 శాతం మంది గోవాను దర్శిస్తున్నారు. గోవాలో మాండవి, జువారి, తెరెఖోల్‌, ఛపోరా, బేతుల్‌ అనే నదులు ప్రవహిస్తున్నాయి. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం సహజ నౌకాశ్రయం.


ఇవి ఇక్కడ ఎంతో ఫేమస్‌... 
గోవాలో ఫెన్నీ అని జీడి పండ్లతో, కొబ్బరితో చేసిన డ్రింక్‌ చాలా ఫేమస్‌. అక్కడికి దగ్గరలో బిగ్‌ఫుట్‌ అనే ప్రదేశంలో ఓ సాధువు ఒంటికాలితో తపస్సు చేశాడట. ఆ ప్రదేశంలో మనం కూడా కాలు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని అంటారు. 
http://www.worldofstock.com/slides/TAN1715.jpg 
http://www.shrimangesh.org/index_files/mangesh.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/f/f7/Shri_Mangeshi_Temple,_Goa.jpg http://upload.wikimedia.org/wikipedia/commons/f/f7/Shri_Mangeshi_Temple,_Goa.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/f/f7/Shri_Mangeshi_Temple,_Goa.jpg http://upload.wikimedia.org/wikipedia/commons/f/f7/Shri_Mangeshi_Temple,_Goa.jpg

http://upload.wikimedia.org/wikipedia/commons/f/f7/Shri_Mangeshi_Temple,_Goa.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/f/f7/Shri_Mangeshi_Temple,_Goa.jpgమంగేశ్‌ టెంపుల్‌లో శివలింగం బదులు శివుని విగ్రహానికి చేస్తుంటారు. ప్రఖ్యాత గాయని లతా మంగేశ్వర్‌ ఈ ఆలయాన్ని డెవలప్‌ చేశారట. 
భారతదేశానికి వచ్చే విదేశీ యాత్రికుల్లో 12 శాతం మంది గోవాను దర్శిస్తున్నారు. గోవాలో మాండవి, జువారి, తెరెఖోల్‌, ఛపోరా, బేతుల్‌ అనే నదులు ప్రవహిస్తున్నాయి. 
http://goabest.com/WondersOfGoa/imgaes/Mormugoa-port/Mormugao-port.jpg
జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం సహజ నౌకాశ్రయం.
http://idealmeditours.com/images/Panjim.jpg
http://www.indiacatalog.com/cityguide/images/goa.jpg
సెయింట్‌ జేవియర్‌ చర్చ్‌లో 400 ఏళ్ళ కిందటి జేవియర్‌ మమ్మీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా సమాధి స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా పోర్చుగీస్‌ స్టయిల్‌లో కట్టిన ఆ చర్చ్‌ కూడా చాలా పెద్దది, పురాతనమైనది. తర్వాత డోనా పౌలా బీచ్‌ ఒక అద్భుతమైన సీనిక్‌ వ్యూ.
చూడాల్సనవి....
గోవా మొ
త్తం రెండు భాగాలుగా ఉంటుంది. నార్త్‌ గోవా, సౌత్‌ గోవా. 
http://www.indianetzone.com/photos_gallery/44/Temple%20of%20Saptakoteshwar,%20Old%20Goa.jpg 
http://bookmyhotel.in/wp-content/uploads/2011/07/Mayem-Lake-In-Goa.jpghttp://0.tqn.com/d/goindia/1/0/V/4/-/-/vagator.jpg
నార్త్‌ గోవాలో చూడదగ్గ ప్రదేశాలు నార్వాలో వెయ్యి సంవత్సరాల సప్తకోటేశ్వర ఆలయం, మేయమ్‌ లేక్‌, మపుసా టౌన్‌ గుండా వగాటోర్‌, అంజున, కలన్‌గుటే బీచ్‌లు, అగౌడా ఫోర్ట్‌, పాంజిమ్‌ హాండీక్రాఫ్ట్‌‌స ఎంపోరియమ్‌. సౌత్‌ గోవాలో లేదా ఓల్‌‌డ గోవాలో చూడదగ్గ ప్రదేశాలు పోర్చ్‌గీస్‌ శైలి చర్చ్‌లు, బోమ్‌ జీసెస్‌ బాసిలికా, సె కేధిడ్రిల్‌, వాక్స్‌ వరల్డ్‌ మ్యూజియం, క్రిస్టియన్‌ ఆర్ట్‌ మ్యూజియం, మంగేశ్‌ టెంపుల్‌, శాంతాదుర్గ టెంపుల్‌, పురాతన గోవా మ్యూజియం, మార్‌గోవా, కోల్వా బీచ్‌, డోనా పౌలా బే, మిరామర్‌ బీచ్‌లు.http://www.orchidhotel.com/india/goa/images/old_goa_basilica.jpg
http://blog.mobissimo.in/uploads/1_ancestralgoa_casaaraujo_loutolim.jpg
250-year old Portuguese House 'Casa Araujo Alvares'

Archeological Museum



Archeological Museum Goa
http://pictures.goa-trip.com/Photos/old-goa.jpg
India's second wax museum.

ఇక దక్షిణ గోవా దీన్నే పాత గోవా అని కూడా అంటారు. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలకొస్తే... పోర్చుగీస్‌ శైలిలో నిర్మించిన చర్చిలు, బోమ్‌ జీసెస్‌ బాసిలికా, సె కేథిడ్రిల్‌, వాక్స్‌ వరల్‌‌డ మ్యూజియం, క్రిస్టియన్‌ ఆర్ట్‌ మ్యూజియం, మంగేశ్‌ టెంపుల్‌, శాంతాదుర్గా ఆలయం, పురాతన గోవా మ్యూజియం, మార్‌గోవా, కోల్వా బీచ్‌, డోనా పౌలా బే, మిరామర్‌ బీచ్‌ ఉన్నాయి. భారత పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలు గోవాలో మరొక ఆకర్షణ. కానీ ఇవి ప్రస్తుతం చాలా వరకు శిధిలావస్థలో ఉన్నాయి. పాంజిమ్‌లోని ఫౌంటెన్‌ హాస్‌ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తింపబడింది. గోవా జీవనాన్ని, నిర్మాణాలను ప్రతిబింబించే పేట అని దీన్ని చెప్పొచ్చు. http://www.goa-tourism-india.com/images/temples.jpg
కొన్ని హిందూ దేవాలయల్లో కూడా ఈ శైలి కనిపిస్తుంది. 
http://www.timescrest.com/timthumb.php?src=http://www.timescrest.com/media/content/2011/Nov/img_6701_20926_Pc0160700.jpg&w=300&zc=1
December 19, 2011, the day Goa celebrates the golden jubilee of its liberation from Portuguese rule, a new museum called Goa Chakra displaying over 70 of these almost-forgotten modes of transport, will be thrown open.