విహారాలు

India

Gamyam

Friday, September 14, 2012

అద్భుత సౌందర్యం ఆన్గ్‌కార్ వాట్ ఆలయం

 కొద్దిరోజుల క్రితం ప్రపంచ ప్రసిద్ధ ఆన్గ్‌కార్ వాట్ దేవాలయాన్ని సందర్శించే అవ కాశం కలిగింది నాకు. కాంబోడియా దేశంలోని సయాంరీప్ రాష్ట్రంలో ఉన్న ఈ వైష్ణవ దేవాలయం ప్రపంచంలోని హిందూ దేవాలయ సముదాయాలన్నిటిలోకి అతి పెద్దది. అద్భుత శిల్ప నైపుణ్యంతో కూడుకున్నది. ఈ 12 వ శతాబ్దపు కట్టడం 400 ఏళ్లపాటు అడవిలో అజ్ఞాతవాసం చేసి 20 వ శతాబ్దంలోనే మళ్లీ వెలుగులోకి వచ్చిందంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఒకటిన్నర రోజు ఆ దేవాలయ ప్రాంగణమంతా తిరిగి మేము చూసిన విశేషాలు....

మా అబ్బాయి ఆదిత్య సింగపూర్‌లో ఆసియా-పసిఫిక్ దేశా గూగుల్ సంస్థల మానవ విభాగానికి డైరెక్టరుగా పని చేస్తున్నాడు. మా కోడలు పారుల్, మనవరాలు కనక్ కూడా అక్కడే ఉంటారు. వాళ్లతో కొంతకాలం గడుపుదామని నేను, నా శ్రీమతి విజయలక్ష్మి మొదటి సింగపూర్ వెళ్లాం. అక్కడి నుంచి ఆగస్టు 24 న బయలుదేరి కాంబోడియాలోని సయాంరీప్‌కు వెళ్లాం. భారతీయులకు విమానాశ్రయంలోనే వీసా పొందేవీలుంది. కాబట్టి ఐదు నిమిషాల్లో ఆ పని ముగించుకుని మేము ముందుగానే రిజర్వు చేయించుకున్న 'బోర్ ఆన్గ్‌కార్' అనే హోటల్‌కు చేరుకున్నాం.
http://i.telegraph.co.uk/multimedia/archive/02159/siem-reap620_2159798b.jpg
బోర్ ఆన్గ్‌కార్ ఒక ఫైవ్‌స్టార్ హోటల్. ఐదు లక్షల జనాభా కలిగిన సయాం రీప్ నగరం నడిబొడ్డులో ఉంది. ఆ సాయంత్రం రెండు 'టుక్-టుక్'లను తీసుకుని దగ్గరలో ఉన్న నైట్ మార్కెట్‌కు వెళ్లొచ్చాం. 'టుక్-టుక్' చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక మోటార్ సైకిల్‌కో లేక మోపెడ్ కో ఆటో వెనుక భాగాన్ని తగిలించి ప్రయాణీకులను తిప్పుతారు. లోపల కూర్చున్నవారికి వాన, ఎండ తగలకపోయినా నడిపేవారికి మాత్రం ఏ ఆసరా ఉండదు. మేం నైట్‌మార్కెట్‌కు వెళ్లడానికి 8000 కాంబోడియా రియల్స్ ఇచ్చాం. రాత్రి భోజనం చేసిన చోట 90,000 ఇచ్చాం. ఆ తరువాత అర్థమయింది మాకు, కాంబోడియా కరెన్సీ విలువ చాలా తక్కువ అని. ఒక అమెరికన్ డాలర్‌కు 4000 రియల్స్ మారకం రేటు. రియల్స్‌కంటే డాలర్ల చలామణీయే ఎక్కువ అనిపించింది మాకు.
'ఆన్గ్‌కార్ వాట్'కు వెళ్లి రావడానికి 45 డాలర్లకు కారు, 35 డాలర్లకు గైడ్, మా నలుగురికి కలిపి 80 డాలర్ల ఎంట్రీ ఫీజు-మొత్తం 160 డాలర్ల ఖర్చుతో అన్నీ సమకూరాయి. మొదటిరోజు పగలంతా, రెండో రోజు ఉదయం కూడా అక్కడే గడిపాం. అంత గొప్ప అనుభూతి గురించి ఎలా చెప్పాలో తెలియడం లేదు.తెలియకుండానే నాలుగైదు కిలోమీటర్లు అలసట లేకుండా తిరిగాం.

రాజధాని యశోధరపురం
ఇప్పుడు ఆన్గ్‌కార్ వాట్ ఉన్న ప్రదేశం ఒకనాడు ఆ దేశ రాజధాని. అప్పుడు దాన్ని యశోధరపురం అనేవారు. ఖ్మేర్ రాజవంశస్థుడైన రెండవ సూర్యవర్మన్ దీన్ని నిర్మించాడు. తన పూర్వీకుల మతమైన శైవాన్ని దూరం పెట్టి, ఆన్గ్‌కార్ వాట్ దేవాలయాన్ని విష్ణు దేవుడికి అంకితమిచ్చాడు సూర్యవర్మన్. మొదట హిందువుల ఆలయంగా ఉన్నప్పటికీ, ఆ తరువాత బౌద్ధుల ఆరామంగా కూడా వుంటూ వచ్చింది. సాంప్రదాయిక ఖ్మేర్ వాస్తుకళకు ముమ్మూర్తులా ప్రాతినిధ్యం వహించే విధంగా మలిచిన ఈ దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల పాటు అడవిలో ఎవరికీ కానరాని విధంగా చెట్ల మధ్య-పుట్టల మధ్య జాడ తెలియకుండా ఉండిపోయింది.

ఇప్పుడు ఆన్గ్‌కార్ వాట్ కాంబోడియా సంస్కృతీ-సాంప్రదాయాలకు ప్రతీకగా ఆ దేశ జాతీయ జండాపై దర్శనమిస్తుంది. హిందూ పురాణాలలో దేవ తల నిలయంగా పేరొందిన మేరు పర్వతం తరహాలో దీనిని డిజైన్ చేశారు. దేవాలయ సముదాయం చుట్టూతా ఎల్లప్పుడూ నీటితో నిండివుండే వెడల్పాటి కందకం ఉంది. సుమారు మూడున్నర కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడ కూడా ఆలయం చుట్టూతా ఉంది. వీటికి అదనంగా దీర్ఘ చతురస్రాకారంలో వున్న మూడు గ్యాలరీలు  ఒకదానికంటే మరొకటి ఎత్తుగా ఉండే విధంగా ఆన్గ్‌కార్ వాట్ చుట్టూ వున్నాయి.
http://www.interessantes.at/angkor-wat/angkorwat12.jpg
టెంపుల్ సిటీ
ఆంగ్లంలో ఆన్గ్‌కార్ వాట్ అంటే 'టెంపుల్ సిటీ'. ఖ్మేర్ భాషలో 'దేవాలయాల నగరం' అని అర్థం. లోగడ ఈ దేవాలయాన్ని ఖ్మేర్‌లో 'ప్రేహ్ పిష్ణులోక్' (సంస్కృతంలో 'వర విష్ణులోక') అనేవారు. దీనికి అతి సమీపంలోనే శివుడికి అంకితం చేసిన 11వ శతాబ్దంనాటి 'బాఫువాన్'దేవాలయం కూడా ఉంది. అదీ చూడదగ్గ స్థలమే.
http://farm4.static.flickr.com/3052/3070806814_79b354737b.jpg
ఆన్గ్‌కార్ వాట్ దేవాలయం నిర్మాణం ఇంకా కొంచెం మిగిలి వుండగానే, రాజా సూర్యవర్మన్ చనిపోవడంతో, పని ఆగిపోయింది. కొన్నేళ్లు గడిచాక, ఏడవ జయవర్మన్ రాజయ్యాడు. 'ఆన్గ్‌కార్ థాం' పేరుతో ఆన్గ్‌కార్ వాట్‌కు ఉత్తర దిక్కుగా నూతన రాజధానిని, అధికారిక దేవాలయంగా 'బాయాన్'ను నిర్మించారాయన. పదమూడవ శతాబ్దంనాటికి ఆన్గ్ కార్ వాట్ హిందువుల అధీనంలోంచి క్రమేపీ థెరవాడ బౌద్ధుల చేతుల్లోకి పోయింది. నేటికీ ఒక విధంగా అలానే ఉందనాలి. ఆ మాటకొస్తే ఏ దేవుడికీ పూజా పునస్కారాలు లేవక్కడ. ఒకనాడు జరిగిన దాఖలాలు కూడా లేవు.

ఆలయమంతా తిరుగుతూ దక్షిణం వైపున్న టవర్ కింది భాగంలోని విష్ణుమూర్తి భారీ విగ్రహం దగ్గరకు వెళ్ళాం. సుమారు పదిహేను అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి ఎనిమిది చేతులున్నాయి. ఖ్మేర్ భాషలో ఆ మూర్తిని 'టారీచ్' అంటారు. బహుశా ఆన్గ్‌కార్ వాట్ దేవాలయ ప్రధాన పూజా విగ్రహం ఇదే అయ్యుండాలి. ఈ విగ్రహానికి కూడా పూజా పునస్కారాలు ఏమీ లేవు.
http://blog.zeemp.com/wp-content/uploads/2010/11/cambodia_angkor_5.jpg
కొద్దిదూరంలో తల-చేతులు నరికేసిన లక్ష్మీ దేవి భారీ విగ్రహం ఉంది. బహుశా ఏదో దండయాత్రలో అలా జరిగుండాలి. టవర్ల మధ్య గ్యాలరీలున్నాయి. గోపురానికి రెండువైపులా 'ఏనుగు ద్వారాలు'గా పిలువబడే రెండు మార్గాలున్నాయి. వెలుపలి గ్యాలరీ నుంచి లోపలి ఒక భాగాన్ని కలిపే ప్రదేశానికి 'వేయి దేవుళ్ల హాల్' అని పేరు. శతాబ్దాల తరబడి యాత్రికులు వస్తూ, వస్తూ బుద్ధుడి విగ్రహాలను తెచ్చి వేసి పోయేవారట. తల భాగం తీసేసిన మొండేలుగా ఉండడంతో అతి జుగుప్సాకరంగా కనిపిస్తుంది. వెలుపలి గ్యాలరీలోని లోపలి గోడలపైన హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతం నుంచి ఎన్నో గాథలను చెక్కారు. హిందువుల పురాణగాథలలోని 32 నరకాలను, 37 స్వర్గాలను కూడా చెక్కారు. తూర్పువైపున వున్న గ్యాలరీ గోడపై సముద్రమథనం దృశ్యం, ఉత్తరం వైపు గ్యాలరీ గోడపై శ్రీకృష్ణుడు పూతనను వధించడం మొదలైన దృశ్యాలున్నాయి.
ఈజిప్టు 'ఖాఫ్రే' పిరమిడ్ కట్టడానికి ఎంత కంకరరాయి అవసరమైందో - సుమారు ఏభై లక్షల టన్నులు - అంతే రాయిని ఆన్గ్‌కార్ వాట్ నిర్మాణానికి ఉపయోగించారని చెపుతారు.

పరిరక్షించాలి
భారత పురాతత్వ శాఖ వారు పాతికేళ్ల క్రితం ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి కొంత కృషి చేసినప్పటికీ, పరిస్థితిలో పెద్దగా మార్పు లేదనే చెప్పాలి. ఆన్గ్‌కార్ వాట్ ప్రాంగణాన్ని, అక్కడికి వెళ్లే దారిని, ఆ పరిసరాలను చూస్తే చాలా బాధ కలుగుతుంది. దేశ, విదేశీ యాత్రికుల ఆసక్తిమేరకు వారి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ప్రభుత్వం దాన్ని ఒక పర్యాటక స్థలంగా మార్చడమైతే చేసింది కాని, అంతకు మించి శ్రద్ధ కనపరుస్తున్న దాఖలాలు లేవు. వాస్తవానికి ఈ దేవాలయన్ని బాగు చేసి అన్ని హంగులూ సమకూర్చగ లిగితే, తిరుపతి కంటే ఎక్కువ సంఖ్యలో యాత్రికులు ఇక్కడికి వస్తారనడంలో సందేహం లేదు. భారత ప్రభుత్వం, తిరుపతి తిరుమల దేవస్థానాలు కలిసి, ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయాన్ని పరిరక్షించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో! హిందూ మతోద్ధరణకు కంకణం కట్టుకున్నామని చెప్పే భారతదేశ మతపెద్దలు ఎంతమంది ఇక్కడకు వచ్చారో తెలియదు కాని, వారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూమతాభిమానులలో ఉత్తేజాన్ని కలిగించి, వారి దగ్గరనుంచి వచ్చే విరాళాలతోనైనా, ఆన్గ్‌కార్ వాట్‌లోని విష్ణుమూర్తి విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలి.
http://beautifulplacestovisit.com/wp-content/uploads/2010/04/Angkor_Wat_Cambodia1_Sunrise.jpg
సూర్యోదయం 
ఆన్గ్‌కార్ వాట్‌ను సందర్శించాలనుకునే వారు, ముందుగా, 'అప్సర అథారిటీ' కార్యాలయం నుంచి, ఒక్కో వ్యక్తికి రోజుకు 20 డాలర్ల చొప్పున చెల్లించి, ఫోటో ఐడెంటిటీతో సహా ఎంట్రీపాస్ కొనుక్కోవాలి. ఒకేసారి మూడురోజులకు, వారం రోజులకు కూడా కన్సెషన్ ధరలో కొనవచ్చు. దేవాలయాల సముదాయం మొత్తం చూడాలంటే, సుమారు ఐదుకిలోమీటర్ల దూరం ఎత్తు-పల్లాల బాటలో నడవాలి. చీకటిపడితే చేతిలో బాటరీ లైట్ తప్పనిసరిగా ఉండాలి. అక్కడ విద్యుత్ సరఫరా లేదు. మేం వెళ్లిన మొదటిరోజున వర్షం పడుతుంటే గొడుగుల సహాయంతో తిరిగాం. రెండో రోజున ఉదయం నాలుగున్నరకే అక్కడికి చేరుకున్నాం. ఆన్గ్‌కార్ వాట్ దేవాలయం గోపురాల మధ్య నుంచి, ఎదురుగా ఉన్న నీటిలో నీడ పడుతూ కనిపించే సూర్యోదయాన్ని వీక్షించడానికి మాతో పాటు వేలాదిమంది దేశ, విదేశీ పర్యాటకులున్నారక్కడ. తెల్లవారే వరకు పూర్తి చీకటే. అడుగులో అడుగు వేసుకుంటూ, బ్యాటరీ కాంతిలో నెమ్మదిగా సూర్యోదయం కనిపించే స్థలానికి చేరుకున్నాం. అక్కడ సూర్యోదయం చూడటం నిజంగా అద్భుతమైన దృశ్యం!
http://www.devata.org/wp-content/uploads/2010/01/1967-03-Jackie-03.jpg
Raising toasts at the ceremonious dinner, Prince Sihanouk and his wife Princess Monique stand at Jackie's left. Cambodian Prime Minister Son Sann is on her other side.

కెనడీకి విందు
వియత్నాం యుద్ధం జోరుగా కొనసాగుతున్న రోజుల్లో, అలనాటి కాంబోడియా అధినేత ప్రిన్స్ నోరోడం సిహనౌక్, అమెరికా అధ్యక్షుడు కెన్నెడీ సతీమణి జాక్విలిన్ కెన్నెడీ జీవితాభిలాషైన ఆన్గ్‌కార్ వాట్ సందర్శన కోసం, ఆమెకు ప్రత్యేకంగా కాంబోడియాలో విందు ఏర్పాటు చేశాడు!
http://files.myopera.com/ANGKORwelcome/albums/5896572/angkor_wat_rear.jpg
దేవుళ్ల నివాసం
 భారతదేశానికి చెందిన ఒరిస్సా శిల్పకళా సాంప్రదాయాలు, చోళుల కాలానికి చెందిన తమిళనాడు దేవాలయాల సాంప్రదాయాలు ఇందులో అక్కడక్కడా కనిపిస్తాయి. దేవుళ్ల నివాసస్థలమైన మేరు పర్వతాన్ని పోలిన విధంగా దీని డిజైన్ వుంటుందని చెప్పా కదా. మేరు పర్వతానికి ఉన్న విధంగానే, వాటి శిఖరాల స్థానంలో నాలుగు దిక్కులా చతురస్రాకారంలో నాలుగుగోపురాలు, మధ్యలో మరో గోపురం ఉంటాయి. ఈ కట్టడానికి ఇసుకరాళ్లు, లాటరైజ్ ఖనిజం ఉపయోగించారు. ప్రహరీగోడ పొడవు 1024 మీటర్లు, వెడల్పు 802 మీటర్లు, ఎత్తు 4.5 మీటర్లు. 30 మీటర్ల పొడవు-వెడల్పు ఉన్న పచ్చిక బయలు గుడి చుట్టూతా వుంటుంది. దేవాలయానికి వెళ్లడానికి తూర్పు-పశ్చిమ దిక్కులలో మట్టివంతెన లాంటివి ఉంటాయి. మధ్య మధ్య కట్టెలతో తయారు చేసిన వంతెనలుంటాయి.

- వనం జ్వాలా నరసింహారావు
jwala99@gmail.com

Saturday, August 11, 2012

'' బ్రూనై '' .... గాంధీ కలగన్న దేశం

'గాంధి కలలుగన్న దేశం ఇదే. ఇక్కడ ఎంత రాత్రిపూటయినా సరే ఆడపిల్ల ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళగలదు. ఈ దేశంలో గత 20 ఏళ్ళలో ఒక్క హత్యా నమోదు కాలేదంటే ఆలోచించండి ఎంత ప్రశాంతమైన దేశమో'... బ్రూనై దారుస్సలాంలో తొమ్మిదేళ్ళుగా ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్న వాసుదేవ్ అడారి చెప్పిన  విశేషాలివి.

బోర్నియో ద్వీపకల్పంలో వాయవ్యాన ఉన్న ఓ చిన్న అందమైన దేశం బ్రూనై దారుస్సలాం. 2010 జూలై లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా కేవలం నాలుగు లక్షలు. భారతదేశపు ఏ ఒక్క కాలనీలో మొహల్లాలోనో కనిపించే జనసాంద్రత ఇది. అలాంటిది దేశం మొత్తంమీద అంత తక్కువమంది ఉన్నారంటే అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ముఖ్యంగా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ నాలుగు లక్షల ప్రజల కోసం దాదాపు లక్షన్నర మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో సేవలందిస్తున్నారు.

అధికారిక మతం ఇస్లాం, భాష మలయ్. మలేషియా, ఇండొనేషియా, సింగపూర్‌లలో కూడా అధికార భాష అదే. నిజానికి మలయ్ అన్న పదం ఓ జాతి ప్రజల పేరుగా వాడుకలో ఉంది. దేశ జనాభాలో అరవై ఏడు శాతం ప్రజలు మలయ్‌లుగా పిలువబడుతూ మలయ్ భాషని మాట్లాడేవారిగా ఉన్నారు. రెండు మూడు స్థానాల్లో ఇంగ్లీష్, చైనీస్ భాషలు ఉన్నాయి. దాదాపు అందరూ కాస్తో కూస్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి విదేశీయులకి, టూరిస్టులకి భాష సమస్య కాదు. దేశాన్ని నాలుగు జిల్లాలుగా విభజించారు. 1906లో బ్రిటిష్ ప్రొటెక్టోరేట్‌గా ఉన్న ఈ బ్రూనై దారుస్సలాం 1984 జనవరిలో పూర్తి స్వాతంత్య్రం సంపాదించుకుంది. గల్ఫ్ దేశాల వలె పూర్తి స్థాయి రాజరికం ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ఈ దేశానికి ఆర్థిక వనరులు చమురు, సహజ వాయువే.

బ్రూనై అనగానే అందరికీ బ్రూనై సుల్తానే గుర్తుకు వస్తాడు. నిజమే ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఒకడైన హసనల్ బోల్కియా ఈ దేశపు రాజే. 1967 నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న 29వ రాజు. దాదాపు అరవై బిలియన్ డాలర్ల ఆస్తితో 1990 దశకంలో ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దేశపు చమురు, సహజవాయువు నిక్షేపాల విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు. సాధారణంగా నీళ్ళో, చమురో మాత్రమే ఉండే దేశాలు మనకు తెలుసు. కానీ ఈ బ్రూనై దారుస్సలాం ప్రత్యేకతల్లో ఒకటి అవి రెండూ పుష్కలంగా లభ్యం కావటం.

ఇస్లాం-రామరాజ్యం

క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు మహారాజు శ్రీవిజయన్ ఈ దేశాన్ని పరిపాలించాడు. దేశంలో అందరూ సంస్కృతం మాత్రమే మాట్లాడాలని శాసనం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ఇస్లాం ప్రాబల్యం పెరిగి అదే అధికారిక మతంగా మారింది. అయితే భాషాపరంగా మాత్రం సంస్కృతమే ఇక్కడ అధికారిక భాషగా కొనసాగుతోంది. చరిత్ర ఆవిష్కరించే చిత్రాల్లో ఇదొకటి.

ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం సదుపాయాలతో పాటు అందరికీ ఇల్లు, కారు సమకూర్చుకోవడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ఋణాలు ఇస్తారు. ఇవన్నీ సాధ్యం కావడానికి ప్రధాన కారణం వారి తక్కువ జనాభానే. ఇక్కడ ప్రతీ వ్యక్తికి ఓ కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ. అక్కడక్కడ విదేశీ శ్రామికుల కోసం మినీ బస్సులు కనబడతాయి. టాక్సీలు, ఆటోల్లాంటివి లేకపోవడం ఒక్కోసారి ఇబ్బందికరమేగాని ఏం చేస్తాం? టీవీ ఛానళ్ళు రోజుకి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందులో నేరాలు-ఘోరాలు లాంటి కార్యక్రమాలు అసలు ఉండవు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఒక హత్య కూడా జరగలేదు. దానికి కారణం హత్యలు, ఆత్మహత్యలు, రేప్‌ల్లాంటి వార్తలు మచ్చుకైనా వినపడవు. కనపడవు. చిన్న చిన్న దొంగతనాలు, అవీ విదేశీ కార్మికులు చేసిన వాటి గురించే వింటూంటాం. ఇక్కడ మనుషులు అతి నెమ్మదిగా మాట్లాడతారు. భావావేశాలకు, ఉద్రేకాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించే వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్పిస్తూంటూంది.

రామరాజ్యం గురించి నేనెక్కడా చదవలేదు, వినడమే తప్ప. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. రాత్రి... అర్ధరాత్రి ఏ సమయంలోనైనా ఏ స్త్రీ అయినా రోడ్డుమీద ఒంటరిగా ఒక్కర్తే నడవగలిగే దేశం, ప్రదేశం ఇంకెక్కడైనా ఉందో లేదో తెలియదు కాని, ఇక్కడ మాత్రం ఉంది. అందుకే ఇది ఇస్లాంలో రామరాజ్యం అనుకుంటాను.

రాజు... రాజరికం... విలాసత్వం

బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా గురించి, ఆయన విలాసవంతమైన జీవన విధానం గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు- ప్రతీ సెకనుకి ముగ్గురు పిల్లలు పుడుతుంటారు ఈ భూమ్మీద!
అలాగే ప్రతి సెకనుకీ ఓ పది సెల్‌ఫోన్లు అమ్ముతుంటారు ప్రపంచవ్యాప్తంగా!
ప్రతి సెకనుకి ఈ ప్రపంచం 37 మిలియన్ల డాలర్లని ఖర్చుపెడుతుంటుంది కేవలం రక్షణ కోసం.
కానీ మన ఈ హసనల్ బోల్కియా ఆదాయం ప్రతీ సెకనుకి 90 యూరోల రూపంలో పెరుగుతూ ఉంటుంది...
అంటే వారానికి ఆయన ఆదాయం 54 మిలియన్ల యూరోలన్నమాట. ఇంకా చెప్పమంటారా నెలకి... సంవత్సరానికి.. వద్దులెండి... 'నో ఎన్వీ ప్లీజ్' అని ఆయన అధికారిక వెబ్‌సైట్ రాసింది... కాబట్టి ఆ విషయాన్ని వదిలేద్దాం. అయితే ఆయన నివాస గృహం గురించి రాయకుండా ఈ వ్యాసం ముగిస్తే నాకే అసంతృప్తిగా ఉంటుంది.

అతిపెద్ద రాజప్రాసాదం

'ఇస్తానా నూరుల్ ఇమాన్' ఆయన నివాసం పేరు. ఇస్తానా అంటే ఇక్కడి భాషలో రాజభవనం అని అర్థం. ఇలాంటివి ఇక్కడే ఓ నాలుగున్నా ఈ పేరుగల భవనం ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా పేర్కొనబడింది. బ్రూనై నది ఒడ్డున పూర్తి ఇస్లామిక్ సంస్కృతిలో నిర్మితమైన ఈ రాజభవనంలో 1788 గదులు (అంటే రోమ్‌లోని వాటికన్ కంటే 388 ఎక్కువ గదులు), 650 సూట్లు, ప్రతీ అంతస్థుకీ ఎస్కలేటర్స్. ఒకేసారి 500 మంది కూర్చోవడానికి వీలుగా డైనింగ్ హాల్, సుమారు 1500 మంది ఒకేసారి ప్రార్థన చెయ్యడానికి అనువైన ఓ మసీదు రాజభవనం లోపలే నిర్మించడం కొన్ని ప్రత్యేకతలు. ఇక హిజ్ మెజెస్టీ కోసమని ఓ హెలిపాడ్, 300 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్, క్లినిక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వగైరాలెన్నో ఉన్నాయి. దీని నిర్మాణానికి కావలసిన సామాగ్రిని 30 దేశాల నుంచి తెప్పించారు. ఈ రాజప్రాసాదం చూడ్డానికి ప్రతీ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మూడు రోజులు ప్రజలందరినీ (విదేశీయుల్ని కూడా) అనుమతిస్తారు. ఆ రోజు మగవాళ్ళందరూ రాజుగారితో, ఆడవాళ్ళందరూ రాణీగారితో కరచాలనం చేసే సంప్రదాయం ఉంది ఇక్కడ.

రాజు తలచుకుంటే...

మహారాజు హసనల్ బోల్కియా తనకంటూ ఓ ప్రత్యేకమైన విమానాన్నే ఏర్పరచుకున్నారని రాసేసి వదిలేస్తే పెద్ద విశేషమేముంది? వంద మిలియన్ డాలర్లు ఖరీదు చేసే విమానాన్ని కొని మరో వంద మిలియన్ల డాలర్ల ఖర్చుతో దాన్ని మరింత అందంగా బంగారంతో తాపడం చేయించుకున్న ఘనత ఈ రాజుగారిది. ఈ విమానంతో పాటు ఆరు చిన్న విమానాలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈయన మన రాజీవ్ గాంధీ లాగా ఖుద్దు (పైలట్), వీలయినప్పుడల్లా తన విమానాన్ని తనే నడుపుకుంటూ వెడతాడు.
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
65 ఏళ్ళ బోల్కియా ఈ మధ్య మన దేశాన్ని సందర్శించినప్పుడు కూడా తన విమానాన్ని తానే నడుపుకుంటూ వచ్చి మన వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. తన ఐశ్వర్యానికి తగ్గట్టుగానే తన జీవన విధానాన్ని సాగించే ఈయన, తన కూతురి 18వ పుట్టినరోజుకి ఏకంగా ఓ ఎయిర్‌బస్‌నే కానుకగా ఇచ్చాడు. తన 50వ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా మైఖెల్ జాక్సన్‌ని ఈ దేశానికి పిలిపించి కార్యక్రమాన్ని చేయించడం బోల్కియా రాజరిక వైభోగానికి మరో ఉదాహరణ.
కొసమెరుపు : పేరులో దారు ఉన్నా ఇది పూర్తిగా డ్రై కంట్రీ. టూరిజం అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటని కొంతమంది వాపోతుంటారు.

ఇక్కడా మన రాముడే!
ప్రస్తుతం కాంబోడియా అని పిలువబడుతున్న కాంభోజ రాజ్యం వరకూ మన భారత రామాయణాలు పరిఢవిల్లేవనే విషయం కాస్తో కూస్తో బయట తిరిగే టూరిస్టులకి తెలియంది కాదనుకుంటాను. దీనికి బ్రూనై దారుస్సలాం అతీతం కాదు. ఇక్కడ కూడా రామాయణం పూర్తి స్థాయిలో రాణించడమే కాక రామాయణంలోని ముఖ్యపాత్రల పేర్లన్నీ ప్రతి ఇంట్లోను విన్పిస్తుంటాయి. పురుషులకు రమ్‌లీ అని, భుజాంగ్ అని, స్త్రీలకి సితి అని పేర్లు పెట్టుకుంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం లక్ష్మణుడి పేరు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఓ ప్రత్యేకవర్గంగా ఉండడం. రాజుగారి ఆంతరంగిక రక్షకభటులుగా ఇప్పటికీ ఈ 'లక్ష్మణ' వర్గం పనిచేస్తుంటూంది. మలయ్ భాషలో దాదాపు నలభై శాతం సంస్కృత పదాలే వినపడడం కొంతలో కొంత మనదేశపు వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది.

గట్టిగా మాట్లాడితే..

ప్రశాంతతకి ఇచ్చే విలువ గురించి ఓ సంఘటన మీకు చెప్పి తీరాల్సిందే... ఓ పబ్లిక్ ప్రదేశంలో ఇద్దరు తమిళులు కూర్చుని 'మామూలు'గా మాట్లాడుకుంటున్నారట... ఓ పదిహేను నిమిషాలకి ఓ పోలీస్ వ్యాన్ వాళ్ళు కూర్చున్న దగ్గరకొచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు ఆఫీసర్లు దిగి "ఏంటి సమస్య? మీరిద్దరూ దెబ్బలాడుకుంటున్నారట కదా? పదండి స్టేషన్‌కి'' అన్నారట నెమ్మదిగానే... దానికి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని "అయ్యో! అలాంటిదేమీలేదే... మేం మామూలుగా మాట్లాడుకుంటున్నాం'' అన్నారట... దానికి అక్కడే ఉన్న ఓ చిన్న దుకాణదారుడు బయటకొచ్చి "నేనే పోలీసుల్ని పిల్చా... ఏంటి మీరు కొట్టుకోట్లేదా... కొంచెంసేపాగితే ఒకర్నొకరు చంపేసుకుంటారేమోనని భయమేసి...'' అన్నాడట. అలా ఉంటాయి ఇక్కడ సంస్కారానికి సంబంధించిన విషయాలు.

నీటి నివాసం

వాటర్ విలేజ్ అని పిలవబడే ఎనిమిది కిలోమీటర్ల గ్రామం ఒకటి ఉంది ఇక్కడ. అక్కడ ఇళ్ళన్నీ నీటిపైనే. పూర్తి చెక్కతో చెయ్యబడ్డ ఈ ఇళ్ళు మామూలు వాటికి దేనిలోనూ తీసిపోవు. కొన్ని శతాబ్దాలుగా అక్కడే నీటిపైన నివాసం ఉంటున్నారు 30 వేల ప్రజలు. వాళ్లు వేరే గృహాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ప్రభుత్వమే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. టూరిస్టులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ వాటర్ విలేజ్. దీన్ని మలయ్ భాషలో 'కంపోంగ్ ఐర్' అంటారు. కంపోంగ్ అంటే గ్రామం అని ఐర్ అంటే నీరు అని అర్థం.

- vasudevadari@gmail.com


Monday, July 30, 2012

సిల్క్‌రూట్‌లో ఓ తెలుగు సాహసికుడు

ఎవరన్నారు టీవీ చూస్తే పిల్లలు చెడిపోతారని? ఎవరన్నారు చరిత్ర చదివితే ఎందుకూ కొరగాకుండా పోతారని? చిన్నప్పుడు నేషనల్ జాగ్రఫిక్ ఛానల్‌లో చూసిన సిల్క్‌రూట్ విశేషాల్ని, కొంచెం పెద్దయ్యాక వాళ్ళ నాన్న చెప్పిన చరిత్ర పాఠాల్ని మెదడులో నిత్యం మననం చేసుకుంటూ పెరిగినందువల్లే ఇవ్వాళ నల్లవారి గౌతమ్‌రెడ్డి అనే ఈ యువకుడు అలెగ్జాండర్, చంఘిజ్‌ఖాన్, మార్కొపోలో ప్రయాణించిన మార్గంలో ప్రయాణించి అభినవ చరిత్ర యాత్రికుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియాలో ఇంజనీరింగ్, పారిస్‌లో ఎంబిఎ చేసి అక్కడే ఉద్యోగ చేస్తున్న గౌతమ్‌రెడ్డి తొమ్మిది దేశాల్లో నాలుగు నెలల పాటు సాగించిన పర్యటన విశేషాలు.  

గ్రీస్ - టర్కీ -ఇరాన్ - తుర్క్‌మెనిస్తాన్ - ఉజ్బెకిస్తాన్ - కిర్గిస్తాన్ - చైనా - నేపాల్ - ఇండియా. ఇదీ నా ప్రయాణ మార్గం. దాదాపు ఆరున్నర వేల కిలోమీటర్ల దారి. క్రీ.పూ 200 సంవత్సరాల కాలంలోనే చైనా పట్టును పాశ్చాత్య దేశాలకు ఎగుమతి చేసే మార్గం కావడంతో దానికి 'సిల్క్ రూట్' అనే పేరొచ్చింది. ప్రయాణానికి సిద్ధపడేముందు నేను కొన్ని నియమాలను పెట్టుకున్నాను. మొదటిది, ఎప్పుడూ నేల మీదే ప్రయాణించాలి, వీలైనంత వరకూ ప్రాచీన 'సిల్క్ రూట్' మార్గంలోనే ప్రయాణించాలి. వీలైనంత చవగ్గా దొరికే ప్రయాణ సాధనాలనే ఎంచుకోవాలి. హాస్టళ్లలోనో, స్థానికుల ఇళ్లలోనో ఉండాలి. నచ్చినా, నచ్చకున్నా స్థానికంగా అందరూ తినే ఆహారాన్నే తినాలి. వీలైనన్ని ప్రశ్నలడగాలి. వెళ్లిన ప్రతిచోటా వారి సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలను తెలుసుకోవాలి. బయల్దేరినప్పటికన్నా ఎక్కువ విజ్ఞానం, సంతోషాలతో ఇంటికి చేరుకోవాలి. వీటన్నిటికీ నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి ముందు దక్షిణమెరికా వెళ్లాను. అక్కడ రెండు నెలలుండి, కష్టమైన వాతావరణ పరిసితుల్లో పర్వతారోహణ వంటివి చేసి ఈ గొప్ప ప్రయాణానికి నన్ను నేను ఆయత్తపరచుకున్నాను. తిరిగి వచ్చాక మార్చి 7న గ్రీస్ దేశానికి బయల్దేరాను.

గ్రీక్ రాజధాని ఏథెన్స్ విమానాశ్రయంలో దిగుతూనే చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇక కొన్నాళ్లీ విమానాలకేసి చూసే పని లేదని ఆనందపడ్డాను. ముందుగా ఏథెన్స్‌లో 'ఆల్ఫా టీవీ గ్రీస్'కు జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నా పారిస్ సహాధ్యాయిని కలవడానికి వెళ్ళాను. విచిత్రమేమంటే ఆయన కూడా నాలాగానే చదువైపోగానే సిల్క్ రోడ్‌లో ప్రయాణించాడట! ఆ విషయం తెలిసినప్పుడు నాకు నోట మాట రాలేదు. ఇద్దరం ఉత్సాహంతో ఊగిపోయాం. ఆ యాత్ర అతని దృక్పథాన్ని, అవగాహనను విశాలం చేసిందని చెబుతుంటే నాకు సంతోషంగా అనిపించింది. ఆయనిచ్చిన స్ఫూర్తితో ఏథెన్స్ నగర వీధుల్లో చక్కర్లు మొదలెట్టాను.


ఆక్రోపొలిస్, గ్రీస్

గాలిలో తేలి వస్తున్న బ్రేక్‌ఫాస్ట్ కమ్మటి వాసనలను ఆస్వాదిస్తూ వీధుల్లో చకచకా అడుగులేశాను. ఆక్రోపొలిస్ - ఏం నిర్మాణం! ఇది ప్రపంచానికి కేంద్రబిందువని ఒకనాడు గ్రీకులు నమ్మేవారు. దాన్ని చూస్తే అది నిజమేననిపిస్తుంది. నాకు పదేళ్లున్నప్పుడు టీవీలో చూశాను దాన్ని. ఇరవయ్యేళ్ల తర్వాత ఇప్పుడిలా... ఆనందం పట్టలేకపోయా. స్కూల్లో నాకు చరిత్ర పాఠాలు చెప్పిన టీచర్ గుర్తొచ్చారు. చరిత్రనొక నిషాలా తలకెక్కించిన మా నాన్నను కూడా తల్చుకున్నాను. థ్యాంక్స్ చెబుతూ ఆయనకో ఉత్తరం రాసి పోస్టు చేసేదాకా నా మనసాగలేదు. కమ్మటి గ్రీకు భోజనం లాగించిన తర్వాత భారీ ఒలింపిక్ స్టేడియంలోకి అడుగుపెట్టాను. ఆటలను అలా ఆస్వాదించవచ్చని 2200 ఏళ్ల క్రితం ఆలోచించిన వారిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.

ఇజ్మిర్, టర్కీ

టర్కీలోని ఇజ్మిర్ 2500 ఏళ్ల పురాతన నగరం. నేను వెళ్లిన రోజు పదంతస్తుల భవనాలను కప్పేసేంత పెద్ద జెండాలు బజార్లో ఎగురుతున్నాయి. ఏమిటి విశేషమని వాకబు చేస్తే చరిత్రలో ఆరోజునే ఓటోమాన్ రాజులు ఆక్రమణదారుల మీద విజయం సాధించారని తెలిసింది. అక్కణ్నుంచి 'అగోరా ఆఫ్ స్మిర్నా'కు చేరుకున్నా. ఇది ప్రాచీన రోమన్ కట్టడం. భూకంపాల వల్లా, దుశ్చర్యల వల్లా పూర్తిగా శిథిలమైపోయింది. దగ్గర్లోనే కొండ మీద అలెగ్జాండర్ నిర్మించిన కోటను చూడటానికి వెళ్లాను. అక్కడ పిల్లలు గాలిపటాలెగరేస్తున్నారు. భారతదేశంలోనూ గాలిపటాలెగరేస్తారని నేను చెప్పినపుడు ఆ పిల్లలు ఆశ్చర్యపోయారు. దారిలో ముగ్గురు జర్మన్ యాత్రికులు కలిశారు. వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ రాత్రి భోజనం చేసిన తర్వాత బస్సెక్కాను.

కపడోసియా

కపడోసియా అనే చిన్న పట్టణానికి చేరుకున్నా. దీనికి 3000 ఏళ్ల చరిత్ర ఉంది. అగ్నిపర్వతం పేలిన బూడిద కొండల మధ్య గుహలనే తమ నివాసాలుగా మార్చుకున్నారక్కడి మనుషులు. అలాంటి 'షూ స్ట్రింగ్ కేవ్ హాస్టల్'లో నా బస. అక్కడ వైఫై సదుపాయం కూడా ఉంది! యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించిన బైజాంటైన్ కాలానికి చెందిన గుహలు, క్రిస్టియన్ మత వ్యాప్తికోసం చిత్రించిన పెయింటింగ్‌లను చూశాను. తర్వాత మట్టిపాత్రలను తయారుచేసే మార్కెట్లో కాసేపు తిరిగి రాళ్లలో రకరకాల ఆకారాలుండే 'ఇమాజినేషన్ వేలీ'కి చేరుకున్నా.

ఇక్కడి ఆకృతులను మనం ఎలా కావాలంటే అలా ఊహించుకోవచ్చు. అక్కడి నిశ్శబ్దం నాకు ప్రశాంతతనీ, భయాన్నీ ఒకేసారి కలిగించింది. అక్కడ్నించి తివాచీలల్లే చోటికి వెళ్లాను. ఒక టూ బై టూ పట్టు తివాచీని తయారుచెయ్యడానికి ఒక మనిషి పదకొండు నెలల పాటు శ్రమిస్తాడని తెలుసుకుని ఆశ్చర్యపోయా. వధువు గుణగణాలను పరిశీలించేప్పుడు తివాచీల అల్లకంలో పనితనముందా లేదానని కూడా చూస్తారట. రాత్రి కపడోసియన్ కబాబ్ తిన్నా. ఒక చిన్న కుండలో వండే దాన్ని కుండ పగలకొట్టే తినాలి.


మర్నాడు భూగర్భ నగరాన్ని చూడాలన్నది నా ప్లాన్. పన్నెండంతస్తుల లోతుండే ఆ భూగర్భ నగరంలో శతాబ్దాలుగా మానవ నివాసం సాగుతోంది. ఆహారం దాచడం కోసమంటూ మొదలైన ఈ భూగర్భ ఆవాసాలు క్రమంగా జనావాసాలుగా మారాయి. శత్రువులు రావడానికి వీల్లేకుండా చిన్న ద్వారాలు పెట్టడంతో నాకెందుకో వాటిలోకి ప్రవేశిస్తున్నప్పుడు తెగ భయమనిపించింది. భూమి కిందన అంత పెద్ద నగరాన్ని సందర్శించడం ఒక వినూత్నమైన అనుభవం! తర్వాత అమెరికాలోని గ్రాండ్ కెన్యాన్‌ను తలపించే రాతి నిర్మాణాలను చూడటానికి వెళ్లాను. 'స్టార్ వార్స్' సినిమాకి ప్రేరణ ఈ ప్రాంతం నుంచే వచ్చిందని బస్ డ్రైవర్ చెప్పాడు. ఇక్కణ్నుంచి నా ప్రయాణం నల్ల సముద్రానికి ఉత్తరంగా ఉన్న మరొక టర్కీ నగరం ట్రాబ్‌జాన్‌వైపు సాగింది.


ట్రాబ్‌జాన్

ఇదొక పెద్ద పారిశ్రామిక నగరం. ఎటుచూసినా భారీ నౌకలు, ఆయిల్ రిగ్గులు, క్రేన్లు వంటివే కనిపిస్తాయి. నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సుమేరా మొనాస్టరీ'కి బయల్దేరాను. బైజాంటైన్ శకానికి చెంది రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ అనేక దాడులను తట్టుకొని నిలబడిన గొప్ప చర్చి ఉందక్కడ. వెనక్కొస్తున్నప్పుడు నేను పోలిష్ యాత్రికుల జంటను కలిశాను. వాళ్లయితే కేవలం లిఫ్ట్ అడిగే ప్రయాణాలు చేస్తున్నారు.

వాళ్లు చెప్పిన ట్రిక్కులుపయోగించి ముగ్గురం కలిపి ఒక పెద్ద వ్యాన్‌లో నగరం చేరుకున్నాం. అక్కడి బజార్లో తమ స్కూలు కోసం విరాళాలు సేకరిస్తున్న విద్యార్థులు కనిపించారు. ఇంట్లోని పెద్దవారు వండిన వంటలు, తయారుచేసిన కళాకృతులను విక్రయిస్తున్నారు వారు. వారితో సంభాషణ సరదాగా గడిచింది. భారతదేశం గురించి అనేక ప్రశ్నలు అడిగారు. పదిహేను గంటల బస్సు ప్రయాణం చేశాక దొగుబాయ్‌జిత్ అనే పట్టణానికి చేరుకున్నాను.


దొగుబాయ్‌జిత్

ఇరాన్‌లోకి ఇక్కణ్నుంచే ప్రవేశించాలి. కొండ మీదున్న 'ఇసిక్ పసా సరాయ్' అనే కోటను చూశాను. పదిహేడో శతాబ్దంలో కట్టిన ఆ రాతి కోట శత్రుదుర్భేద్యంగా ఉంది. అక్కణ్నుంచి కనిపిస్తున్న మరో పర్వతం సైనిక స్థావరంగా ఉపయోగపడేదట. నాలోని పర్వతారోహకుడు ఊరుకోలేదు. కష్టమైనా సరే, పైకెక్కి అక్కణ్నుంచి ఇరాన్‌ను చూశాను. ఆ నిర్మానుష్య ప్రదేశంలో కాసేపు తిరిగిన తర్వాత నావంటి మరో పర్వతారోహకుణ్ని చూశాను. అతను సెల్‌ఫోన్‌లో టర్కీ ప్రేమగీతాల్ని వింటున్నాడు. రాత్రి అతను తాను పనిచేసే చోట భోజనానికి ఆహ్వానించాడు. 'మీకు డబ్బులున్నప్పుడు సంతోషంగా ఉన్నారా, ఇలా చేతిలో తక్కువ పైసలతో తిరుగుతూనా' అని అతనడిగిన ప్రశ్నకు చిరునవ్వే నా సమాధానమైంది.

తబ్రిజ్, ఇరాన్

షేరింగ్ టాక్సీలో ఇరాన్‌లోకి ప్రవేశించడం కొత్తగా అనిపించింది. డాలర్‌కు పద్దెనిమిదివేల రియాళ్లు. ఏటీఎమ్‌లేం ఉండవు. ఇక్కడ మహదీ అనే 22ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థికి నేను అతిథినయ్యాను. అతని కుటుంబ ఆతిథ్యం చూసి నాకు కళ్లు తిరిగాయంటే నమ్మండి. 'అతిథి దేవోభవ' అన్న మన సూక్తినే వారు పార్శీలో చెప్పారు. మర్నాడు తబ్రిజ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తివాచీ మార్కెట్‌ను చూశాను. "చైనావాళ్లు అన్ని డిజైన్లనూ కాపీ కొట్టేసి యంత్రాల సాయంతో తయారుచేసిన తివాచీలను ఇరాన్ తివాచీలని అమ్మేస్తున్నారు. దాంతో మా భుక్తి పోతోంది'' అంటూ చెప్పుకొచ్చారు అక్కడి వర్తకులు. ఇరాన్ సంస్కృతీ సంప్రదాయాలు అద్భుతంగా అనిపించాయి నాకు.

టాక్సీ డ్రైవర్లను ఎంత తీసుకుంటారని అడిగితే 'అయ్యో, మీరు మాకు అతిధి, రండిరండి' అంటూ పిలిచేవారు. వాళ్లకు డబ్బవసరం లేదని కాదు, కానీ వారి అతి«థి మర్యాద అలాంటిది. నాలుగైదుసార్లడిగాక, ఎంతోకొంత తీసుకునేవారు. మర్నాడు నేను కాండోవన్ అనే ఊరికెళ్లాను. రాతి నిర్మాణాలతో నిండి అది కపడోసియాలాగే అనిపించింది. పదికిలోమీటర్ల దగ్గర్లోనే నగరం ఉండగా, ఈ రాతి గుహల్లో మనుషులెందుకు నివసిస్తున్నారో నాక ర్థం కాలేదు.


ఎస్‌ఫహాన్, మధ్య ఇరాన్

ఇక్కడ నాకు ఆతిథ్యమిచ్చింది అమీన్. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయినా రహస్యంగా డీజేగా కూడా పనిచేస్తుంటాడు. ఎందుకంటే పార్టీలు, డీజేయింగ్ వంటివి అక్కడ నిషిద్ధం. ఈ నగరం ప్రాచీన కాలం నుంచీ ఎందరో ఆలోచనాపరులు, కవులకు పుట్టినిల్లు. అక్కణ్నుంచి టె హ్రాన్ చేరుకున్నా. కాంక్రీట్ అరణ్యం. జనాల ఉరుకులుపరుగులు. పూర్వపు అమెరికన్ కాన్సులేట్ భవనాన్ని తప్పక చూడాలని అనుకున్నా. కాని నాకు ప్రవేశం లభించలేదు. మర్నాడు కిర్గిస్తాన్ ఎంబసీకి వెళ్లాను. రోజుకు ఇద్దరు వస్తే గొప్ప ఇక్కడ. అందుకే కాన్సులర్ ఎదురొచ్చి మరీ నాకు వీసా జారీ చేసేశాడు. తబ్రిజ్‌తో పోలిస్తే ఇక్కడ జనాలకు స్వేచ్ఛ ఎక్కువ. మహిళలు సూపర్ మోడర్న్‌గా ఉంటారు. ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఇప్పుడక్కడ ఫ్యాషన్. ఎంత ఎక్కువంటే, చేయించుకోనివాళ్లు కూడా ముక్కుకు బ్యాండేజ్ వేసుకుని, చేయించుకున్నట్టు పోజులిస్తూ తిరుగుతుంటారు.

ప్రాచీన పెర్సిపొలిస్

ముందుగా షిరాజ్ చేరుకుని వీసా ఎక్స్‌టెన్షన్ కోసం ప్రయత్నించాను. శతాబ్దాలుగా ఈ నగరం కళలకు, సంస్కృతికీ పుట్టినిల్లు. సిల్క్‌రూట్‌లోని ఒక ముఖ్య వాణిజ్య కేంద్రమే కాకుండా ఈ నగరంలో ఒకనాడు విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు విలసిల్లాయి. ప్రాచీన పర్షియన్ సామ్రాజ్యానికి, జొరాస్ట్రియన్ మతానికి రాజధాని. పెర్సిపొలిస్‌లో అడుగుపెడుతూనే ఏదో తెలియని ఉద్వేగం కలిగింది నాలో. భారీతనం, వైభవం కలగలిసిన ఈ నగరమే గ్రీకు వీరుడు అలెగ్జాండర్‌కు అసలైన ప్రత్యర్థిగా నిలిచింది. అతి కష్టమ్మీద దీనికి ఆక్రమించుకున్న ఆయన సేనలు సంపదనంతా దోచుకుని నగరాన్ని అగ్నికి ఆహుతి చేశారు. పెర్సిపొలిస్ అన్న పేరు కూడా గ్రీకులే పెట్టారని, దానికి అర్థం 'మంటల నగరం' అని చెప్పారు. తన సేనల దౌష్ట్యానికి అలెగ్జాండర్ సైతం బాధ పడ్డాడంటారు.

అష్గబాత్, తుర్క్‌మెనిస్తాన్

షేరింగ్ టాక్సీలోనే ఇరాన్ సరిహద్దు దాటి తుర్క్‌మెనిస్తాన్‌లోకి ప్రవేశించాను. ముప్ఫై కిలోమీటర్ల పాటు మనిషన్నవాడు కనిపిస్తే ఒట్టు. ఇక్కడి చట్టాల ప్రకారం సర్టిఫైడ్ గైడ్ లేనిదే టూరిస్ట్‌లు తిరగడానికి వీల్లేదు. గంట ప్రయాణం తర్వాత అష్గబాత్‌లోకి ప్రవేశించాం. ప్రతి భవనమూ, అపార్ట్‌మెంట్లూ... అన్నీ మార్బుల్‌తో కట్టినవే. ప్రతిదీ తెల్లగా మెరిసిపోతుంటుంది - చెత్తకుండీలతో సహా! గుర్రాలకు, తివాచీలకు అందానికి మంత్రిత్వ శాఖలు వంటివి ఉండటం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడి మార్కెట్లో తిరుగుతుండగా పోలీసులొచ్చి తీవ్రవాదినంటూ నన్ను అరెస్టు చెయ్యబోయారు. వివరంగా చెప్పిన తర్వాతగానీ వదిలిపెట్టలేదు. 'ఇండియన్ పాస్‌పోర్టుతో టూరిస్ట్ వీసానా' అంటూ ఆశ్చర్యపోయారక్కడి అధికారులు.

సమాచారం మీద బోలెడంత నిఘా. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివే కాదు, ఇతర న్యూస్ వెబ్‌సైట్ల మీదా నిషేధమే. ఈమెయిళ్లూ, ఉత్తరాలూ ఏవైనా సరే ప్రభుత్వం తెరిచి చదువుతుంది. ఈ నిర్బంధమెందుకో నాకర్థం కాలేదు. ఈ దేశంలో 80 శాతం కారకోరమ్ ఎడారే. దాన్ని దాటి ప్రాచీన మెర్వ్ నగరంలోకి ప్రవేశించాను. వ్యాపారమే కాకుండా, మతపరమైన సిద్ధాంతాలు సిల్క్ రూట్ వెంబడి అభివృద్ధి చెందడానికి నగరం ఎంతగానో ఉపయోగపడింది చరిత్రలో. మతాలిక్కడ సహజీవనం చేసేవనీ, వందకు పైగా గ్రంథాలయాలుండేవనీ చెబుతోంది చరిత్ర. చెంఘిజ్‌ఖాన్ ఈ నగరాన్ని నేలమట్టం చేశాడు.


ఉజ్బెకిస్తాన్

తుర్క్‌మెనిస్థాన్ వదిలి ఉజ్బెకిస్తాన్‌లోకి ప్రవేశించగానే హమ్మయ్య అంటూ నిట్టూర్చాను. 'ఇండియానా? నమస్తే' అన్నారక్కడి గార్డులు. అనుమతులు సంపాదించడమూ కష్టం కాలేదు. టాక్సీ డ్రైవర్ దగ్గర పది డాలర్లు మోసపోయి బుఖారా నగరానికి చేరుకున్నా.
ఇదొక ప్రాచీన పవిత్ర నగరం. మతం, మేధలకు కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడికి చేరుకోగానే నా మనసంతా అవ్యక్త పురా భావనతో నిండిపోయింది. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా అన్నట్టుంటాయి అక్కడ ప్రతిదీ. మార్పు తక్కువ. ఇక్కడి ఒక మినార్‌ను చెంఘిజ్‌ఖాన్ చూసి ఆశ్చర్యపోయి, దాన్నేమీ చెయ్యవద్దని సైనికులను ఆజ్ఞాపించాడట. మరోవైపు ఇక్కడ జరిగిన నరమేధం ఎంత భయంకరమైనదంటే, ఆ దెబ్బకి చాలా రాజ్యాలు పెద్ద ప్రతిఘటన లేకుండానే ఆయనకి లొంగిపోయాయట.

మార్కోపోలో ఏడాదిపాటు ఈ మహాసామ్రాజ్యంలో గడిపి, భాష నేర్చుకుని, సంస్కృతిని తెలుసుకుని, ప్రాచ్య దేశాల గురించి అవగాహన చేసుకున్నాడు. మర్నాడు హోటల్లో కలిసిన ఎస్తోనియా దేశస్థురాలు కిర్కాతో కలిసి సమీప గ్రామాల్లో తిరిగాను. "మాక్కావలసినవన్నీ మా పొలం నుంచే వస్తాయి. మేం కొనే వస్తువేదంటే నూనె'' అని అక్కడి కుటుంబపెద్ద ఒకరు చెబితే ఆశ్చర్యంగా అనిపించింది. మట్టి పని చేస్తున్న ఆయన కొడుకులు కూడా రైతులే అనుకున్నాన్నేను. కానీ చిన్నవాడు మెడిసిన్ చదువుతున్నాడు, పెద్దవాడు బిజినెస్ మేనేజ్‌మెంట్ చదివి బుఖారాలో పనిచేస్తున్నాడు. వాళ్లెంత సామాన్యంగా ఉన్నారోకదా అని ఆశ్చర్యపోయాను. మొత్తానికి ఐదు రోజులు అక్కడ గడిపి ట్రెయినెక్కి సమర్‌ఖండ్ చేరుకున్నాను.


సమర్‌ఖండ్

ఇది ఒయాసిస్సు సమీపంలో ఉన్న నగరం. ఎడారిలో అంతులేని ప్రయాణం చేసిన నాకు అక్కడికి చేరుకోగానే ప్రాణం లేచొచ్చిందంటే నమ్మండి. చరిత్రలో వ్యాపారులు కూడా ఇలాగే సేదదీరి ఉంటారా అనిపించింది. అడుగుపెట్టగానే ఎత్తైన మసీదులు నీలి రంగులో మెరిసిపోతూ కనిపించాయి. వాటి భారీతనం, వైభవం చూడటానికి రెండు కళ్లూ చాలవు. నిజానికీ నగరం కూడా చెంఘిజ్‌ఖాన్ చేతిలో పూర్తిగా ధ్వంసమైపోయినదే. తర్వాత నెమ్మదిగా పునర్నిర్మించుకున్నారు. మర్నాడు నేను 'మరకందా' గ్రామానికి వెళ్లాను. అలెగ్జాండర్ అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు రోక్సానా. ఆ ఊరి గ్రామపెద్ద కూతురు రాత్రికి రాత్రే ప్రపంచానికి పట్టపురాణి అయిపోయింది! దీన్ని ఇష్టపడని కొందరు తిరుగుబాటు చేశారు. అది ప్రారంభం - అలెగ్జాండర్ తిరుగుబాట్లను ఎదుర్కోవడం.

ఆ చక్రవర్తి దారిలో నేను నడవడం అక్కడితో ఆఖరు. ఎందుకంటే ఆ తర్వాత అతని సైన్యం ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్‌ల మీదుగా మన దేశంలోకి వచ్చాయి. ఉజ్బెకిస్తాన్‌లో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచే అక్కడి వారు నామీద చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ అర్థమైంది. ఎందుకు అనేది కాస్త ఆలస్యంగా తెలిసింది. వాళ్లకు మన హిందీ సినిమాలంటే పిచ్చి. దాదాపు అన్ని హిందీ సినిమాలనూ డబ్ చేసుకుని చూస్తారు. హిందీ తారల పేర్లు, పాటలు... అన్నీ వాళ్లకు తెలుసు. ఆ అభిమానమంతా నామీద కుమ్మరించారన్నమాట. మర్నాడు నేను 13 శతాబ్దానికి చెందిన ఓగుల్ బెక్ అబ్జర్వేటరీని సందర్శించాను. నాలుగు రోజుల తర్వాత తాష్కెంట్‌కు ట్రెయిన్లో బయల్దేరా.


కిర్గిస్తాన్

ఎత్తైన పర్వతాలున్న దేశమిది. ఒక్కోటీ పదిహేనువేల అడుగుల పైగా ఉన్న శిఖరాలు. నాలోని పర్వతారోహకుడికి పండగే పండగ. చాలా కష్టపడి వాటిని అధిరోహించి శిఖరాగ్రానికి చేరినప్పుడు చాలా గొప్పగా అనిపించింది. అక్కడి గొర్రెల కాపరులతో మాట్లాడటం, వారితో ఆ పర్వతాల్లో కలిసి ఉండటం నేనెప్పటికీ మర్చిపోలేని అనుభవం. జీవితంలో చిన్న చిన్న ఆనందాలకుండే ప్రాధాన్యమేమిటో తెలుసుకున్నదక్కడే.

చైనా

కిర్గిస్తాన్‌ను ఆనుకుని ఉండేదే తఖ్లమాన్ ఎడారి. దాదాపు మూడువేల చ.కిమీ విస్తీర్ణంలో ఉన్న ఈ పెద్ద ఎడారిని ట్రక్కు డ్రైవర్ సాయంతో దాటి చైనాలోకి ప్రవేశించాను. నేను వెళ్లిన కాష్గర్ నగరానికి ఆరేడువేల ఏళ్ల చరిత్ర ఉంది. మార్కోపోలో ఈ నగరాన్ని ఎలా వర్ణించాడో అది ఇప్పటికీ అలానే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని పాత నిర్మాణాలను కూల్చేసి ఆధునికంగా కడుతున్నారు. దీని సరిహద్దులోని పర్వతాలను ఎక్కడానికి మూడు రోజులు పట్టింది. వాటి పైనుంచి చూస్తే చైనా, పాకిస్తాన్, తజకిస్తాన్ - మూడు దేశాలూ కనిపిస్తాయి.

మధ్య చైనా

ప్రశాంతమైన బౌద్ధారామాలకు చేరుకున్నాను. కొండచరియల్లో, దట్టమైన అడవుల్లో ఉండే వీటికి ప్రయాణం కష్టం. అయినా నేను ఇష్టంగా దాన్ని జయించాను. ఒక వారం పదిరోజులు అక్కడ బౌద్ధ సన్యాసులతో కలిసి ఉండటం గొప్ప ప్రశాంతతనిచ్చింది. ఇక్కణ్నుంచి షియాన్ అనే నగరానికి చేరుకున్నా. ఇది ప్రాచీన చైనాకు రాజధాని. అప్పట్లో బీజింగ్ అన్న ఊరే లేదు. అసలు సిల్క్ రూట్‌కు ఇదే ప్రధాన ప్రవేశ స్థానం. ఇక్కడకి చేరుకున్నాక నాకు ఏదో నదీ మూలాన్ని కనుక్కున్న భావన కలిగింది. ఈ నగరం ఇవాల్టి పారిస్, రోమ్‌లకు పదింతలుంది. నగరం చుట్టూ కట్టిన గోడను చూస్తే ఆశ్చర్యం అనేది చిన్న మాట అనిపిస్తుంది.

టెర్రకోట సైనికుల బొమ్మలు బయల్పడిందిక్కడే. ఇక్కణ్నుంచి బీజింగ్ వెళ్ళాను. అన్నాళ్ల పాటు ఎడారులు, పర్వతాలు, అడవులు, గ్రామాల్లో తిరిగిన నాకు బీజింగ్ కాలుష్యాన్ని భరించడం చాలా కష్టమయింది. ఒకవైపు కాలుష్యం, మరోవైపు రాజ్యబలం - నాకు ఊపిరాడనివ్వలేదు. ఫర్బిడెన్ సిటీతో పాటు ప్రపంచంలోని అతిపెద్ద నగరం షాంఘైను సందర్శించేసరికే ఇక చాలు అనిపించేసింది. తర్వాత హాంగ్‌కాంగ్, అక్కణ్నుంచి మన దేశానికి చేరుకుని నా ప్రయాణాన్ని ముగించేశాను.


మొత్తానికి ఈ ప్రయాణంలో నాకు అర్థమైన విషయాలు కొన్ని : విశాల విశ్వంలో మనం చిన్న ప్రాణులం, ఏ రకంగా చూసినా అల్పజీవులం.మనం చూసే ప్రదేశాల కన్నా, అక్కడ కలిసే వేర్వేరు వ్యక్తులు, వారి నుంచి వచ్చే భిన్నమైన ఆలోచనలు ముఖ్యమైనవి, వాటిని అవగాహనలోకి తెచ్చుకున్నప్పుడే అసలు ప్రయాణం సార్థకమైనట్టు! ఇంతాచేసి ఇదేదో భారీ ప్రాజెక్టు అనుకోకండి. మన దేశంలో నాలుగూళ్లు తిరిగితే అయ్యేంత ఖర్చే అయింది నాకు. ఈ స్ఫూర్తితో వచ్చే ఏడాది హిమాలయాల ట్రెక్కింగ్ చెయ్యాలనుకుంటున్నా.


- నల్లవారి గౌతమ్‌రెడ్డి
ఫోన్ నెం. 9704439788
seyyahproject.blogspot.com

Friday, May 11, 2012

తులిప్స్ తొలిప్రేమ

"దేఖా ఏక్ క్వాబ్‌తో యే సిల్ సిలె హుయె, దూర్ తక్ నిగాహోమే హై గుల్ ఖిలే హుయె గిలా హై ఆప్ కి నిగాహోసే, ఫూల్ భి హై దరిమియాతో ఫాస్లే హుయె!'' తులిప్ చూడగానే 'సిల్ సిలా' సినిమాలోని పాట, అందులో రకరకాల రంగుల తులిప్స్ భూమిపై పరుచుకున్న దృశ్యమే గుర్తొస్తుంది.
వసంతం మొదట్లోనే వచ్చే పూలు కొన్నయితే, ఏప్రిల్ నెల మధ్య నుంచి మే నెల మధ్య వరకు విరబూసి నయనానందం కలిగించే పూలల్లో తులిప్స్ పూలు ముందుంటాయి. వీటిని పెద్ద పెద్ద తోటల్లో నాటుతారు కాబట్టే మనం'సిల్ సిలా' సినిమాలో చూసినట్టుగా మొత్తం భూమిపై పరుచుకుని పలకరిస్తాయి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiz4KwrnNw3ts7_tfuHEwmBYMU1JlhiIRL4DSPXBfotJ3RQGzCl3PSXNsAN5bBwd2aLuCh4xU76pqzDJuNhjC3VZ5SngRYEmBNCnkBrVfF_y_PZj4q5P24KklfWM-6zL8YPUiAuZE9T2L0/s1600/Red_White_Tulips.jpg
తులిప్స్ మొదట ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ప్రాచుర్యం పొందాయి. ఈ పూలని టర్కీ వారు భగవంతుని పూలుగా భావిస్తారు. టర్కిష్ భాషలో తులిప్స్ అని రాయడంలో అల్లా అని రాయడంలో ఉండే అక్షరాలే ఉంటాయి. అందుకని మానవుల ఆనందం కోసం దేవుడే వాటిని సృష్టించాడని అనుకుంటారు.

టర్కీ చరిత్రలో ఈ తులిప్స్ చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. మూడవ సుల్తాన్ అహ్మద్ రాజ్యంచేసే సమయంలో దాదాపు 1718 నుంచి 1730 వరకు ఉన్న కాలాన్ని 'తులిప్‌యుగం' అంటారు. ఈ కాలాన్ని అందరూ ఆనందంగా ఉన్న యుగంగా చెప్పుకుంటారు. ఎంబ్రాయిడరీ పనుల్లో, నేత పనిలో తివాచీలు, బొమ్మలపైన కూడా తులిప్స్ డిజైన్స్, ఆకారాలు చోటుచేసుకునేవి. ధనవంతుల సందర్శన కోసం తులిప్స్ తోటలు తయారు చేసేవారు.
http://farm5.static.flickr.com/4013/4515191813_3dfa943241.jpg
తులిప్స్ పూలు టర్కీ నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా యూరప్‌లోని హాలెండ్‌కి చేరాయి. అయితే హాలెండ్ దేశం ఎన్నో అందమైన రకాల తులిప్ గడ్డలను ఇతర దేశాలకు పంపిణీ చేయడంతో ఎక్కువమంది తులిప్స్ హాలెండ్ నుంచే వచ్చాయనుకుంటారు. యూరప్‌కి చేరకముందే ఎన్నో రకాల హైబ్రిడ్, అందమైన తులిప్స్‌ను టర్కీలోనే సిద్ధం చేశారు. ఇప్పుడు హాలెండ్ దేశస్థులు వాటిపై చాలా ప్రయోగాలు చేస్తూ కొత్తవి సృష్టిస్తున్నా తులిప్స్ గొప్పతనం టర్కీకే చెందుతుంది.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpvZxv634AcH91fjVz_xiEh7uxZjFVvrI4U1OlKdNjt-_Bq7sagof6jr0W6vJ1nrGpsK9m_hP8WoOx-6HsdgPwu9ecYc9ldCw7gGn5m7mj4uJyT5Q-LGt6cbFvde2-IQQpIU8QP3gqfWg/s1600/tulip3.jpg
తులిప్స్‌లో లెక్కలేనన్ని జాతులున్నాయి. హైబ్రిడ్ తులిప్స్‌ని పెంచేవారు పెద్ద తోటలనే ఎంచుకుంటారు. వీటిని ఇళ్లల్లో కుండీల్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు. శిశిరంలో తులిప్ గడ్డలు పాతితే అవి వసంతకాలంలో మొలకేసి పూలు పూస్తాయి. పర్షియన్ కవులు ఈ పూలను 'టర్బన్' అనేవారట.http://expresstourinua.com/wp-content/uploads/2012/04/tulips6.jpg
తులిప్స్ గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. తులిప్స్ పూలు చాలాకాలం పాటు విరియకుండానే మొగ్గగా ఉండేవట. ఒకరోజు ఒక తల్లి తన పాపని ఆడుకోవడానికి తోటకు తీసుకుని వెళ్లింది. తులిప్ మొగ్గని చూడగానే పాప నవ్వింది. పాప నవ్వగానే తులిప్ మొగ్గ వికసించింది. అప్పటి వరకు ఎవరూ చేయలేని పని ఆ పాప చేసింది. అప్పటినుంచే ఇతరులను సంతోష పరచలాలనుకున్నపుడు తులిప్స్ పూలని తీసుకెళ్లే సంప్రదాయం వచ్చింది.http://www.drakealgar.com/images/tulip.jpg
తులిప్స్ పూలని సుగంధ ద్రవ్యాల్లో విరివిగా వాడతారు. ఈ పూల సుగంధంతో తయారు చేసిన ఫర్‌ఫ్యూమ్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.http://images.tulipholidays.com/960a984f-3375-418f-8741-d4543bc6f55e.jpg
టర్కీలో ప్రతి ఏడాది వేసవిలో తులిప్స్ ఫెస్టివల్ జరుగుతుంది. హాలెండ్‌లో జరిగే తులిప్ ఫెస్టివల్ కోసం ఇతర దేశాల నుంచి కూడా జనం తరలివస్తారు. తులిప్స్ పూలనే టర్కీ పర్యాటక లోగోగా వాడుకున్నారు. 
టర్కిష్ ఎయిర్‌లైన్స్ వారు ప్రతి విమానంపై తులిప్ బొమ్మని పెయింట్ చేస్తారు.http://cache.virtualtourist.com/6/2732880-WHITE_TULIP_FROM_ISTANBUL_Istanbul.jpg
లిల్లీపూల గ్రూప్‌కి చెందిన ఈ పూలు ఎన్నో రంగుల్లో పూస్తాయి. రెండు రంగులు కలిసిన రకాలూ ఉన్నాయి. ప్రస్తుతం వంద రకాల జాతుల నుంచి మూడువేలకుపైగా రకాల తులిప్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నారు. పెన్సిల్వేనియా లాంగ్ ఉడ్ గార్డెన్స్‌లో రకరకాల రంగుల తులిప్స్‌ను చూస్తే కొత్తలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కదలిరావడానికి మనస్కరించదు. తులిప్స్ పూలు కేవలం అందంగా ఉండడమే కాదు, శాంతికి చిహ్నాలు కూడా. మన దేశంలో వీటిని చూడాలనుకుంటే కాశ్మీర్‌లోని శ్రీనగర్ తులిప్స్‌తోటలకు వెళ్లొచ్చు.

ఒకరోజు ఒక తల్లి తన పాపని ఆడుకోవడానికి తోటకు తీసుకుని వెళ్లింది. తులిప్ మొగ్గని చూడగానే పాప నవ్వింది. పాప నవ్వగానే తులిప్ మొగ్గ వికసించింది. అప్పటి వరకు ఎవరూ చేయలేని పని ఆ పాప చేసింది. అప్పటినుంచే ఇతరులను సంతోష పరచలాలనుకున్నపుడు తులిప్స్ పూలని తీసుకెళ్లే సంప్రదాయం వచ్చింది.

- కనకదుర్గ, అమెరికా నుంచి

Thursday, May 3, 2012

రాధాకృష్ణూలు రాసక్రీడలాడిన... మజులి

మహాభారతంలో పేర్కొన్న ప్రాగ్జోతిష్యపురమే... నేటి అస్సాం రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాల పర్యాటకరంగంలో పేరుప్రఖ్యాతులుగాంచిన ఈ రాష్ట్రంలో ఉన్న విశేష పర్యాటక కేంద్రమే మజులి ద్వీపం. ఈ ద్వీపంలో... వందల ఏళ్ళుగా రాజవంశాలు, ఇతర పాలకులు వాడిన ఆయుధాలు, ధరించిన దుస్తులు నేటికీ మనం దర్శించుకోవచ్చు. మజులి ద్వీపవాసులు ఇప్పటికీ అదే తరహా దుస్తులను వాడుతుండడం హర్షించదగ్గ విషయం. హస్తకళలకు ఎంతో పేరుగాంచిన ఈ ప్రాంతం... పర్యాటక సోయగాల విషయంలో కూడా అంతే పేరుప్రఖ్యాతులు పొందింది.

అబ్బురపరిచే ‘రాస్‌లీలా’...
Un9 


అలనాడు రాధాకృష్ణులు రాసక్రీడలాడిన ప్రదేశంగా చెప్పబడుతున్న ఈ ద్వీపంలో... ద్వీపవాసులు ఆ ఆనవాయితీని ఇప్పటికీ పాటిస్తుండడం విశేషం. ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఎంతో అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాన్ని ‘రాస్‌లీలా’ ఉత్సవం అంటారు. కన్నులపండువగా జరిగే ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడు, గోపికల రాసలీలలను కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. మజులి ద్వీపంలో జరిగే ఓ రకమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. యువతీయువకులు రాధామాధవుల వేషధారణలో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటారు. ముఖ్యంగా గోపికల వేషధారణలో సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు ఒయలుపోతూ ప్రదర్శించే నృత్యాలు ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఈ ఉత్సవం ద్వాపరయుగాన్ని తలపిస్తుంది.


ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి ద్వీపం...


ద్వీపం అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే నదుల మధ్య కూడా కొన్ని ద్వీపాలు ఉంటాయి. అలాంటి అరుదైన ద్వీపమే ఈ మజులి ద్వీపం. ప్రపంచంలో ఇలా నదుల మధ్య ఉండే అరుదైన మంచినీటి ద్వీపాల్లో ఇదే పెద్ద ద్వీపం కావడం విశేషం. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులి ద్వీపం సౌందర్యాన్ని మనసారా వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి.

కొత్త జంటల మజిలీ...   ఈ ‘మజులి’...
Ra 

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలిచి ఉన్నాయి. మనిషి కాలుష్య కర్కషత్వం ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఏ రుతువులో చూసినా... తాజాదనం తొణకి సలాడే ఈ అద్భత ద్వీపంలో మానవ సంచారం గత ఐదు వందల ఏళ్ళ నుండి ఉన్నప్పటికీ... నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది. 
http://f0.pepst.com/c/01E776/215799/ssc3/home/027/photo.subha/majuli_island.jpg_480_480_0_64000_0_1_0.jpg
అందుకే కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్‌ కపుల్‌ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతా వరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలను కునే జంటలకు ‘మజులి’ ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.http://www.assaminfo.com/images/majuli.jpg

CANADA TOUR


Tuesday, March 6, 2012

అందమైన నవలోకం జర్మనీ


  http://www.crowncom2009.org/files/images/lodging_travel/visit_germany_coulage.jpg
జర్మనీ ఒకలా చూస్తే పాతగా ఉంటుంది. పూర్వవైభవం ఇంకా సజీవంగా... ఇంకో వైపు మరీ కొత్తగా కనిపి స్తుంది. సూపర్‌ సిటీస్‌, షాపింగ్‌ మాల్స్‌... ఎలా చూసినా మాత్రం జర్మనీ చాలా అందంగా ఉంటుంది. మంచు కొండ లు, పచ్చని ప్రకృతి మధ్య అందంగా అమరిన పట్టణాలూ, పల్లెలూ... విశాలమైన వైన్‌యార్డ్‌లు, అందమైన ల్యాండ్‌ స్కేప్‌లూ... ఎప్పటికైనా చూడాలి జర్మనీని అనేలా ఉంటుంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmNBZtX4tlunpaPqsBqExAbRxs20LS4G8Y3B2nDPp6BR3suNBbeQiZyetz427agMoWXz34eMPF_sdxfc2-UxO4QN9djsBMYt5brgnqVJncJS_i_LfM0SxmYTNy_onvz-h3LCvA7WIhwK9x/s640/Germany-Castle.jpg
మనరాష్ట్రం నుంచి జర్మనీకి దాదాపు ఎనిమిది గంటల విమాన యానం. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్డ్‌ విమానాశ్రయం. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం.
http://www.metrolic.com/wp-content/uploads/2011/01/2The_Rhine_Valley_above_the_town_of_Bacharach-Germany.jpg
 జర్మనీలో మొదటగా చూడదగ్గ ప్రదేశం ‘హైడల్‌ బర్గ్‌’. ‘నెక్కర్‌’ నది హైడల్‌ బర్గ్‌ నగరం మధ్యలో ప్రవహిస్తోంది. నగరానికి ఒకవైపు చివరగా పచ్చని చెట్లతో నిండిన ఎతైన కొండ ఉంది. అంటే ఈ నగరం అంతా కొండపక్కగా మొదలై, నదికి ఆవలివైపుకి విస్తరించిన నగరంలోకి వెళ్ళడానికి బ్రిడ్జి... చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారం నగరాన్ని నిర్మించినట్లుగా ఉంటుంది.
http://www.wired-destinations.com/images/guides/germany/New%20Pics/Cologne_Cathedral_And_Hohenzollern_Bridge,_Cologne,_Germany.jpg
జర్మనీలో అతి సంపన్న నగరం ‘మ్యూనిక్‌ సిటీ’. దీనికి దగ్గరలోనే ఉన్న ‘నీయిష్‌ వాన్స్‌టెయిన్‌ ప్యాలెస్‌’ ఎతె్తైన కొండ మీద వుంది. కింద నుంచి చూస్తే ఠీవిగా నిలబడినట్లు ఉంటుంది. కొండ మీదకు నడిచి వెళ్ళచ్చు, బస్సులు, గుర్రాలు కూడా వున్నాయి. ప్యాలెస్‌ ముఖద్వారం వర్ణించనలవి కానిది. రాజుల విలాసవంతమైన జీవితానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ‘లడ్విగ్‌’ అనే రాజుకు ఆ ప్రదేశం నచ్చడంతో అక్కడే నివాసం ఉండడానికి ప్యాలెస్‌ కట్టాడు. అయితే ఆ రాజు నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా కొద్ది కాలం మాత్రమే అందులో నివసించాడు. అకాలమరణం రాజు కోరికను అర్ధంతరంగా తుంచివేసింది. 
http://www.european-vacation-planner.com/image-files/information-on-european-cities-munich.jpg
ప్రభుత్వం దానిని మ్యూజియంగా మార్చి అందులో లడ్విగ్‌ వాడిన వస్తువులను, జీవిత విశేషాలను తెలిపే చిహ్నాలను ప్రదర్శనకు ఉంచింది. సెక్యూరిటీ పకడ్బందీగా ఉంటుంది. జర్మనీ దేశస్థులు మంచి మర్యాదస్తులు. విదేశీయులను అమితంగా గౌరవిస్తారు. జీవితాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తారు. వారానికి ఐదు రోజులు పని చేసి రెండు రోజులు హాలిడే తీసుకుంటారు. బాగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వం ఉచితంగా చదువు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్యంలో ఆర్ధిక సహాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళకు దాచుకోవడమన్న ధ్యాస ఉండదు. అందుకే అవినీతి కూడా ఉండదు.
Frankfurt

Monday, March 5, 2012

ట్రెక్కింగ్‌ @‌ నేపాల్‌

 http://www.papatoto.com/images/discovery/567983774359_discoveries.jpg
ప్రపంచంలోనే ఎతైన పర్వతం ఎవరెస్ట్‌ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్‌ - నేపాల్‌ సరిహద్దులన్నీ హిమా లయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అనడంలో ఆశ్చర్య మేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింస్పాట్‌లలో కొన్ని ...

Annapurna
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjeJpFcR2GPMjByhCsgcFZ1mq3698AWQVZ6L4e1-hX9LahbjkkUtqVpi0SbTzB7riMIxFK1z9RZEPBqrq3VTOst53-NYHGTjk1xBEAyZFPX-1NLSGAIrsB4w4o1ObhAZH7XeUd4J0Fd5w/s1600/image_trekking.jpg
ఎవరెస్ట్‌ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం.
http://www.greenkiwi.co.nz/footprints/graphics/rr/rr20a.jpg
aerial view of a Nepalese village
http://www.mynetbizz.com/pages/nepal/jomsom-trek-nepal.jpg http://i.telegraph.co.uk/multimedia/archive/01729/nepal-mountains_1729954c.jpghttp://platform.ak.fbcdn.net/www/app_full_proxy.php?app=161934890497276&v=1&size=o&cksum=7e5be62813c28c6d498a50739cb0a21d&src=http%3A%2F%2Fmedia.tourcms.com%2Fa%2F758%2F18%2F1.jpg
 ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్‌, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు. 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3sfPTR_IuPWn3tysVYytITWZkSFS1PsRFzewU3ORxxv9OerdmdENyoRNsNHHqTF64SmpSM5FZwJ5KnSmmh4F80WiACLSQCPRH52VBlBQyMHSprRC8MZz2pDVl0HDpWa7RttcLkIDgk7vR/s1600/annapurna-base-camp-trek.jpg https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4XiyqQHuIw3BJZIWnZT0U3Ke2NkZ35N3l45_m9YPICsiGxgbHSF-rIo6r-r7HxTCHrpDfayvj9wqLGoTFBIatm1mOTx-4BynjULrQ4f85LA9T0biVceuS_WdvIflS_BiLOpJHj11xkUo/s1600/annapurna-trek.jpg
ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్‌ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్‌ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్‌ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉంటుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మంచి ట్రెక్కింగ్‌ ప్రదేశంగా చేశాయి. http://www.himalayanmountaintreks.com/wp-content/uploads/2011/07/icefalls4.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUlZAMN9Jkg1TqHhpKYJAeE_0ED3xKCzw3wuGVaQN1K5KuPULZGfsBEkBIOtyxiE2_kk3Bk2Ei6DW5FkIt09XmrRuex8nlrVszLRMDvm9rJwJcfQl-Xg7cKDPrcIsDtJmAGTtKstKs_Q8/s320/trek.jpghttp://treknepal.files.wordpress.com/2008/06/dhaulagiri.jpghttp://cdn8.wn.com/pd/98/65/ec56bbbafd5d186fae9706e8b899_grande.jpghttp://cdn8.wn.com/pd/98/65/ec56bbbafd5d186fae9706e8b899_grande.jpghttp://farm2.static.flickr.com/1213/1147932444_5b4bd4c741.jpghttp://www.nepalmountaintrek.com/images/tilicho-lake.jpg
Tilicho lake Trekking is one of the newest trekking routes in Annapurna ...
 

Nilgiri above Jomosom, Annapurnas, Nepal

మీరు అద్బుతమైన పర్వతాల అందాలు చూడగలరు. అందులో ధులగిరి, అన్నపూర్ణ, మనస్లు, లమ్జంగ్‌ హిమాల్‌ మంచాపుచ్చారే, టుకుచే శిఖరం, టిలిచో శిఖరం, నీలగిరి ముఖ్యమైనవి. అన్నపూర్ణ, ధులగిరిల మధ్యగా వెళుతున్న కాళి గండకి ప్రపంచంలోనే లోతైనది. హిందు వుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షంపడే ప్రాంతాలు, నేపాల్‌లోని వర్షం పడనివ్వని ప్రాంతాలు ఇలా అన్నీ పూర్తిగా విభిన్నంగా ఉండే విషయాలు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవంగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్‌ మెచ్యూరిటీ (యూయస్‌ఏ) వారు చేసిన సర్వే ప్రకారం, ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్‌ ప్రాంతంగా గుర్తించబడినది. 
http://himalman.files.wordpress.com/2009/10/on-the-left-on-durbar-square-is-the-octagonal-krishna-temple-which-pratapa-malla-built-in-memory-of-two-of-his-favorite-queens.jpg
పోఖరా ది సిటీ అఫ్‌ లేక్స్‌ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుం ది. సహజ సౌందర్యంతో, చిత్రవిచిత్రం గా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

Langtang 

ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకోవచ్చు. 
http://www.himalayanclub.org/hc/wp-content/uploads/hj-58-art-13-b-300x205.jpg
లంగ్‌టంగ్‌ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్‌ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్‌ సరిహద్దు పై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రవాల మొక్కలకు, హిమాలయాల రెడ్‌ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతువులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిది గా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్‌ పల్లెలతో ట్రెక్కింగ్‌ కు చాలా చాలా అనువుగా ఉంటుంది. 
 http://www.trekkingtourinnepal.com/images/gosainkunda-trek-nepal.jpghttp://www.nepalmountaintrek.com/images/gosaikunda-trek.jpghttp://www.twip.org/photo/2010/photo-gosaikunda-lake-25017.jpg
గోసాయికుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.