విహారాలు

India

Gamyam

Tuesday, January 11, 2011

2011లో... విహరించండిలా..!

కొత్త ఆశలను, కొంగొత్త ఆశయాలను మోసుకొని నవ వసం తం వచ్చేసింది.నూతన సంవత్సర వేడుకల సందడి నుండి మొత్తానికి బయటకొచ్చి మళ్లీ బిజీ లైఫ్‌ షెడ్యూళ్లతో ప్రజలంతా బిజీ అయ్యారు. అయితే ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగాలతో... ఆశయాలను, ఆశలను నెరవేర్చుకునే బిజీలో సమయాన్నంతా గడిపేయకుండా... పని ఒత్తిడి తగ్గించి సరికొత్త విహార ఆనందాన్ని అందించేందుకు దేశవిదేశాలకు సంబంధించిన అనేక ట్రావెలింగ్‌ సంస్థలు సరికొత్త టూర్‌ ప్యాకేజీలతో ముందు కొస్తున్నాయి.సెలవులను ఉపయోగించుకుంటూ... విహార యాత్రలు చేస్తూ... కొంత ప్రశాంతత పొందడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అవి పని ఒత్తిడిని తగ్గించడమే కాకుండా తిరిగి ఉత్తేజంతో వృత్తి ఉద్యోగాలను హాయిగా కొనసాగించడానికీ ఉపకరిస్తాయి. ఈ నేపథ్యంలో 2011 లో కొంగొత్త ప్యాకేజీలను అందిస్తున్న టూరిజం సంస్థలు, విహార ప్రదేశాల వివరాలు ఈ '' విహారాలు ''  లో .....
dambulla-cave-temple 
ఈ సంవత్సరం మాల్దీవులు, భూటాన్‌, శ్రీలంక తదితర పొరుగు దేశాలు మీ విహార ఆతిథ్యానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఎక్కువశాతం ఉన్న మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్తోమతకు తగిన అనేక ప్యాకేజీలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. 2010 చివర్లో మాల్దీవులకు ప్రత్యేక ప్యాకేజీని రూపొందించిన ‘మేక్‌ మై ట్రిప్‌’ సంస్థ ఈసారి శ్రీలంకకు కూడా ఆ ప్యాకేజీని విస్తరించింది. రెండు ద్వీపదేశాలలో సాగే ఈ ఏడు రాత్రుల ప్యాకేజీ కేవలం 50 వేల రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది (ట్రావెల్‌, షెల్టర్‌ చార్జీలు కలుపుకొని). తాజ్‌ గ్రూప్‌ 74 వేల రూపాయలకు ఢిల్లీ కపుల్‌ టూర్‌ ప్యాకేజ్‌నీ అందిస్తోంది. అలాగే 62 వేలకు కోల్‌కతా మీదుగా థింపు (భూటాన్‌ రాజధాని)కి కపుల్‌ ప్యాకేజీని అందిస్తుండగా... ఇదే థింపు ప్యాకేజీని మేక్‌ మై ట్రిప్‌ కేవలం 13,895 రూపాయలకు అందిస్తుండడం విశేషం.
టాంజానియా...
ప్రపంచ వర్యాటకులను విశేషంగా ఆక ర్షించిన సాకర్‌ ప్రపంచ కప్‌... 2010 సంవత్సరాన్ని దక్షిణాఫ్రికాకు పర్యాటక రాబడిని బాగానే పెంచింది. అయితే ఈ సంవత్సరం ఆ ఛాన్స్‌ టాంజానియా సొంతం చేసుకోనుంది. కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, యాత్ర, ఆక్వాటెర్రా ఎడ్వెంచర్స్‌ వంటి పలు సంస్థలు... 2010 లో టాంజానియాకు కొన్ని ప్యాకేజీలను అందించాయి. వాటికి విపరీతమైన రెస్పాన్స్‌ రావడంతో ఈ సంవ త్సరం ఆ దేశానికి మరిన్ని మెరుగైన ప్యాకేజీలను రూపొందించే దిశలో ప్రయత్నిస్తున్నాయి. సెరెంగెటి, జంజీబార్‌, కిలిమంజారో వంటి ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రాలను కలుపుతూ ఈ ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి.‘వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌’ అనే ట్రావెల్‌ కంపెనీ 2011 ఆగస్ట్‌లో అరుదైన జంతు వలస వీక్షణాన్ని ప్యాకేజీగా అందించనుంది.
యూరప్‌...
Maldives1 

స్విట్జర్లాండ్‌ ఎప్పటినుండో యూరప్‌ పర్యాటక రాజధానిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. ఈ సంవత్సరం ఈ జాబితాలో క్రొయేషియా కూడా చేరనుంది.అందమైన సముద్ర తీరప్రాంతాలు, బీచ్‌లు...ఇలా ఏ-గ్రేడ్‌ అందాలతో క్రొయేషియా ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. క్రొయేషియా అందాల నగరం సొమోబోర్‌ ఇప్పుడు తన ప్రత్యేకతను చాటుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఇక్కడ జరిగే జానీ ఫెస్టివల్‌...

దగ్గరలోని డుబొవాక్‌ నగరంలో జరిగే మెడీవియల్‌ నొబిలిటీ ఫెయిర్‌ వంటి ఫెస్టివల్స్‌ ఈ ప్రాంతాలకు మరింత విహార శోభను చేకూర్చనున్నాయి. ఈ వేసవిలో ‘ఎబెర్‌క్రోంబీ అండ్‌ కెంట్‌’ ట్రావెల్‌ కంపెనీ క్రొయేషియా, స్లొవేనియాలకు 13 రోజుల టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. అలాగే ‘వావ్‌’ (వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌) ఈ ప్రాంతాలనే కలుపుతూ కొన్ని టూర్‌ ప్యాకేజీలను అందిస్తున్నాయి. క్రొయేషియానే కాకుండా స్పెయిన్‌, పోర్చుగల్‌, గ్రీస్‌ లకు కూడా అనేక ప్యాకేజీలు అందుబాటు ధరల్లో వేసవి టూర్లను అందించనున్నాయి.
  ఫిలిప్పీన్స్ ...
Kilimanjaro3 

ఈ ఏడాది మార్చి నుండి ఫిలిపె్పైన్స్‌ విహారం భారత్‌కు మరింత చేరువ కానున్నది. ప్రముఖ సంస్థలు అందిస్తున్న టూర్‌ ప్యాకేజీలు ఫిలిపె్పైన్స్‌ను దక్షిణాసియాకే టూరిస్ట్‌ ఎట్రాక్షన్‌ గా నిలబెట్టనున్నాయి. ఇవే కాకుండా మలేషియా, దుబాయ్‌లు కూడా తమ విహార వారసత్వాన్ని నిలుపు కోనున్నాయి. ఈ సంవత్సరం కొత్త టూరిజం ప్యాకేజీల గురించి... మేక్‌ మై ట్రిప్‌ సీఓఓ కేయూర్‌ జోషీ మాట్లాడుతూ...‘‘టిబు, మనిలా వంటి ప్రాంతాలు ఈసారి దక్షిణాసియా దేశాల్లో టూరిజం ఎట్రాక్షన్‌గా నిలువనున్నాయి. అలాగే మలేషియా, దుబాయ్‌, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు కూడా తమ వినూత్న ప్యాకేజీలతో తమ వారసత్వాన్ని నిలబెట్టుకోనున్నాయి’’ అని చెబుతున్నారు.
వావ్‌...
రోజుకూ పెరుగుతున్న పర్యాటకుల సంఖ్యతో మహిళ పర్యాటకుల ప్రత్యేక ట్రావెల్‌ గ్రూప్‌ వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటోంది. 2005లో పదిమంది మహిళలు ఒక గ్రూప్‌గా మొత్తం పది ట్రిప్‌లను ప్రారంభించిన ఆ సంస్థ ఎండీ సుమిత్రా సేనాపతి ఈ రోజు 50 మంది సభ్యులు ఒక గ్రూపుగా మొత్తం 30 టూర్లను నిర్వహించే స్థాయి సంస్థను చేర్చింది. 2011 ఈ నెంబర్‌ను 40 కి పెంచే దిశగా ప్రయత్నిస్తోంది. ఇందులో ట్రైన్‌ టూర్‌ ప్యాకేజీ విశేష ఆకర్షణగా నిలువ నుంది. చైనాలోన బీజింగ్‌ నుండి లాసా వరకు సాగే ఈ రైలు ప్రయాణం ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్‌ జర్నీ కావడం విశేషం.
Bhutan0 

నిజానికి మహిళ లకు ప్రత్యేకమైన ఇలాం టి టూర్లను కొన్ని కంపెనీలు కూడా ప్రారంభించాయి. అందులో యాత్ర టూర్‌ కంపెనీ కూడా ఉంది. ‘‘2010లో 16 మంది గ్రూప్‌తో కేరళ విహారాన్ని ఏర్పాటుచేశాం.దానికి విశేష స్పందన లభించింది’’ అని తెలుపుతున్నారు యాత్ర వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన సబీనా చోప్రా. సుమిత్రా సేనాపతి కూడా ఈసారి కూర్గ్‌, మైసూర్‌, నాసిక్‌, జలంధర్‌ వంటి పర్యాటక ప్రదేశాలకు కొత్త ప్యాకేజీ లు అందిస్తున్నట్టు తెలియ జేస్తున్నారు.
ఎక్స్‌పరిమెంట్‌ హాలీడేస్‌...
కొత్త యాత్రికులను ఆక ర్షించే విధంగా ఈ ఏడాది ప్రముఖ టూర్‌ కంపెనీలు ఏర్పాటు చేసిన అనేక టూర్‌ ప్యాకేజీలకు అప్పుడే విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 30 శాతం కొత్త యాత్రి కులను ఆకర్షించినట్టు ఆయా సంస్థలు తెలియజేస్తు న్నాయి. ‘‘ఫిట్‌ (ఫారెన్‌ ఇండిపెండెంట్‌ ట్రావెల్‌) టూర్లు యువ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. యువత తమదైన ప్రత్యేక విహారానం దంకోసం ఇలాంటి టూర్‌ ప్యాకేజీలను ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంతేకాదు, వారు ఎక్స్‌పరిమెంటల్‌ టూర్ల పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు’’ అని తెలియ జేస్తున్నారు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ టూర్‌ కంపెనీ రిలేషన్‌షిప్‌ అండ్‌ సప్లయర్‌ మేనేజ్‌మెంట్‌ హెడ్‌ కరన్‌ ఆనంద్‌.
Samobor2 

అనుకున్నట్టుగా విహారానుభూతిని పొందడానికి భారతీయ యువ పర్యాటకులు ఎక్కువగా ఆస్ట్రేలియా, ఫ్రాన్స్‌ దేశాలకు వెళ్ళడానికి మక్కువ చూపుతున్నారట. ప్రైవేట్‌ ట్రావెల్‌ కంపెనీ ఎబెర్‌క్రోంబ్‌ అండ్‌ కెంట్‌ వైప్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ కల్సి కూడా సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నాడు. ‘‘నేటి యువత కేవలం సైట్‌ సీయింగ్‌ కోసమే తమ విహారాన్ని పరిమితం చేసుకోవడం లేదు. ఎక్స్‌పరిమెంట్‌ టూర్లనే వారు ఎక్కువగా ఇష్టపడుతున్నారు’’ అని తెలియజేస్తున్నారు ఆనంద్‌.
సెల్ప్‌-డ్రైవ్‌ టూర్లు...
నేడు చాలామంది పర్యాకులు సెల్ఫ్‌ - డ్రైవ్‌ టూర్లపైన ఎక్కువ మక్కువ చూపిస్తు న్నారు.ప్రత్యేకవాహనంలో సొంతగా పర్యాటక కేం ద్రాలను చుట్టేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటి సెల్ఫ్‌-డ్రైవ్‌ టూర్ల విషయంలో న్యూజీలాండ్‌, మలేషి యా వంటి కొన్ని దేశాల్లో విహరించాడానికి మొగ్గుచూపు తున్నారు. దుకుంటే...ఆ దేశాల్లో ఇండియన్‌ డ్రైవింగ్‌ లైసె న్స్‌ను అనుమతిస్తారు. అందువల్ల ఇప్పుడు ఆ దేశాలు సెల్ఫ్‌ - డ్రైవింగ్‌ వెకేషన్లను మరింత ఆకర్షిణీయంగా తీర్చిదిద్దుతున్నాయట.
భారత్‌లో...
Maldives 

ఇక మనదేశంలోని పర్యాటక కేంద్రాల విషయానికి వస్తే...ఎప్పటిలాగే లెహ్‌, కేరళ వంటి ప్రాంతాలు ట్రావెల్‌ మార్కెట్‌ను ఈ సంవత్సరం కూడా పెంచనున్నాయి. సాంప్రదాయ విహారప్రదేశాలైన గోవా, రాజస్థాన్‌ కూడా అదే మార్గంలో పయనించనున్నాయి. ‘‘వరదల నుంచి కోలుకున్న లెహ్‌ కు ఇప్పుడు చాలా డిమాండ్‌ ఏర్పడింది’’ అని అంటున్నారు యాత్రా కో-ఫౌండర్‌ సబీనా చోప్రా. ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ... ‘‘2010లో మేం చేపట్టిన 30 టూర్లలో 6 టూర్లు లడఖ్‌కే కేటాయించడం జరిగింద’’ని చెబుతున్నారు వుమెన్‌ ఆన్‌ వాండర్‌లస్ట్‌ అధినేత సుమిత్రా సేనాపతి. ఇక ‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ గా పిలువబడే దక్షిణాది ప్రకృతి సోయగం కేరళ ఈ సంవత్సరం కూడా తన ప్రత్యేకతను చాటుకోనుంది. రాఫ్టింగ్‌ టూరిజంకు పేరుగాంచిన కేరళ మాన్‌సూన్‌, ఎడ్వెంచర్‌ పర్యాటకులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ 
ముందం జలో ఉంటుంది.
థీమ్‌ ట్రావెలింగ్‌...
స్పా, క్రుయిజ్‌, సఫారీ, గోల్ఫ్‌, వైన్‌ టూర్‌ వంటివి ఇప్పుడు అధికంగా వినప డుతున్న పదాలు. సైట్‌ సీయింగ్‌కే పరిమితం కాకుండా పర్యాటకులు కొత్తద నాన్ని కోరుకుంటున్నారు. అందుకే పర్యాటక సంస్థలు పై అంశాలను దృష్టిలో పెట్టుకొని మరీ థీమ్‌ ట్రావెలింగ్‌ ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. పెళ్ళిళ్ళు, ఫ్యామిలీ రీయూనియన్‌ వంటి వాటితో ఫ్యామిలీ టూర్‌ ప్యాకేజీలకు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ తరహా ప్యాకేజీలు ఈ సంవత్సరం మరింత వృద్ధిని నమోదు చేసుకోవాలని ప్రముఖ ట్రావెల్‌ గ్రూప్స్‌ ఉవ్విళ్లూ రుతున్నాయి.
సోషల్‌ మీడియా దన్ను...
websites 

నానాటికీ పెరిగిపోతున్న సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్లు పర్యాటకుల కోసం ఎంతో విలువైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతున్నాయి. ఫేస్‌బుక్‌ వంటి ప్రముఖ సైట్లలో పర్యాటకులు తమ విహారానుభూతులను ఫొటోలతో సహా నిక్షిప్తం చేస్తుండడంతో విహార కేంద్రాల గురించి పూర్తి సమాచారం కోసం తెలియక తికమక పడే పర్యాటకులకు అవసరమైన సమాచారమంతా మౌస్‌ క్లిక్‌తో లభ్యమవుతోంది. ఇలా ఈ సైట్లు పరోక్షంగా టూరిజం అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ట్రిప్‌ అడె్వైజర్‌, టూర్‌ ఆపరేటర్‌ వంటి వెబ్‌సైట్లు విహా ర కేంద్రాల పూర్తి సమాచారాన్ని అందజేస్తున్నాయి.

అంతేకాకుండా అన్ని టూర్‌ కంపెనీలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సౌకర్యం కల్పింస్తుండడం తో పర్యాటకులు టూర్‌ ప్యాకేజీలు ఎంచుకోవడం మరింత సులభతరం అయ్యిందనే చెప్పాలి. మొత్తం రాబడిలో 13 శాతం రాబడి ఈ సోషల్‌ నెట్‌వర్క్‌ సైట్ల మూలంగానే అందుతుందంటే... పర్యాటకుల సేవలో అవి ఎంత కృషి చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సంవత్సరం వేసవి టూర్‌ ప్యాకేజీలు గతం కంటే మరింత హోరెత్తించనున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment