
ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లే కాదు పలు విశేషాలు చారిత్రాత్మక స్థలాలకు నిలయం. ఒకప్పుడు దండకారణ్యంలో అంతర్భాగమైన ఆదిలాబాద్ జిల్లా చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంది. రాకాసి బల్లులు నడయాడిన నేల ఇది. సామ్రాజ్యాలు ఏర్పాటు చేయడానికి ముందు ఇక్కడి ఘనరాజ్యాలు, నగర రాజ్యాలు ఉండేవి. నేటి కుబీర్, బెైంసా, నేరడిగొండ, మండలం వడూర్ ఘన రాజ్యాలుగా ఉండేవి, వేటికవే స్వతంత్ర దేశాలుగా ఆనాడు వెలసిల్లాయి. మైసాపూరం, కూబీర్ పురం మద్య తరుచు యుద్ధాలు జరిగేవని పురాణాలు చెబుతాయి. కళింగ దేశం రాజు ఖారవేలుడిని తీసుకు వచ్చి విజయం సాధించారు. మౌర్యులు, శుంగులు, కలియులు, పశ్చిమ చాణుక్యులు, రాష్టక్రూటులు, కళ్యాణి చాళుక్యులు, దేవగిరి జాదవ రాజులు కాకతీయ గొండు రాజులు, బహమనీ సుల్తానులు, మహ్మద్ నగర్, నిజాం సాహిద్, గోల్కొండ నవాబులు, మరాఠాలు, హైద్రాబాద్ అసఫ్జాహీ వంశీకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ జిల్లా నేటికీ ప్రకృతి రమణీయతతో అలరారుతోంది...

కుంటాల జలపాతం... : ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్దమైన అం దమైన జలపాతాల్లో కుంటాల ఒకటి. రాష్ట్రంలోనే ఎతె్తైన జలపాతాల్లో కుంటాల జల పాతం మొదటిది. పూర్వం శకుంతల దుష్యంతుల విహార కేంద్రంగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. దీన్ని ముందుగా శకుం తల జలపాతంగా పిలిచే వారు క్రమేణా కుంతల జలపాతంగా ప్రస్తుతం కుంటాల జలపాతంగా పిలు స్తున్నారు. కారడవుల మధ్య సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

పోచ్చెర జలపాతం... : ఈ జలపాతం చిన్నదే అయినప్పటికి ఎంతో ఆకర్షణీయంగా కనిపి స్తుంది. జాతీయ రహదా రి పక్క నుంచి బోథ్కు వెళ్లే మార్గంలో కిలో మీటర్ దూరంలో ఈ జలపాతం ఉంది. పొచ్చర అనే గ్రామ సమీపంలో చిన్నకొండ వాగు రాళ్ల పెై నుంచి దూకే ఈ దృశ్యం చూడ చక్కగా కనిపిస్తుంది. ఏ కాలంలోనెైన పోచ్చర జలపాతానికి చేరుకోవచ్చు. పర్యటకులు ఏ వేళలోనెైన అక్కడికి వెళ్లి జలపాతం అందాలను తిలకించవచ్చు. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేక పోగా ప్రస్తుతం అధికారులు సందర్శకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశారు.
నిర్మల్ కొయ్య బొమ్మలు... :

ఈ బొమ్మలను పొనికి కరత్రో తయారు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో అడవులు అంతరిస్తున్నందున ఈ పొనికి కర్ర దొర కడం కష్టంగా మారింది. కళాకారులు అటవీ శాఖ అధికారులకు ఇక్కడి ప్రజా ప్రతినిధులకు పొనికి కర్ర ను పెంచాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందిం చడం లేదు. దీంతో బొమ్మల తయారికి ఇబ్బంది అవుతుండడంతో పొట్ట గడవడం కష్టంగా మారిందని కుటుంబాలను పోషించించుకోవడం గగనం అవుతోందని కళాకారులు వాపోతున్నారు.
జ్ఞాన సరస్వతి దేవి ఆలయం... : భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం ముదోల్ మండలం లోని బాసరలో కొలువెై ఉంది. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసరలో మాత్రమే ఉంది. గోదా వరి తీరానా కిలో మీటర్ దూరంలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి వేద వ్యాస మహర్షి చేరూపొందించబడింది. గోదావరి నది తీరాన సంచరి స్తూ సరస్వతీ దేవిని ప్రార్థించగా దేవి ప్రసన్నురాలెై తన ప్రతిమ ను ప్రతిష్టించి పూజించమని ఆజ్ఞాపించినట్లు కథనం. ఆ తర్వాత ప్రతిదినం గౌతమి నదిలో స్నానం ఆచరించి సరస్వ తి దేవిని ధ్యానించి మూడు ముష్టుల ఇసుకను మూడు స్థలాల్లో ఉంచాడు. క్రమేణా అవి మూడు మూర్తులు గా మారి మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహా కాళీ రూపాలుగా వెలిశాయని మహర్షి వ్యాసుడు ఆ దేవి ని ప్రతిష్టించినందు న, ఆ క్షేత్రంలో నివసించినందున ఈ క్షేత్రం వాసరగా, క్రమేణా బాసరగా పిలువబడు తోంది.
ఈ బాసర గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ దేవాలయానికి సమీపానే పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందున ఈ పర్వతానికి కుమారచల పర్వతం అని పేరు వచ్చింది. ఇక్కడ ప్ర ధాన దేవాలయానికి తూర్పు భాగంలో ఔదుంబర వృ క్ష ఛాయలోని దత్త మందిరంలో సుందరమగు శ్రీ దత్తాత్రేయుని విగ్రహం, దత్త పాదుకలు ఉన్నాయి. శ్రీ మహాకాళి దేవాలయం పశ్చిమభాగాన కలదు. ఆగ్నేయాన అత్యంత మహిమాన్వితమైన అష్టతీర్థ పుష్కరి ణి ఉంది. వ్యాస మందిరం దక్షణ దిశలో కనిపిస్తుం ది. బాసర గ్రామానికి వెళ్లే దారిలో వేదవతి (ధనపు గుండు) అనే పెద్ద శిల కనిపిస్తుంది. దానిని శిలతో కొ ట్టినట్లయితే విచిత్ర ధ్వని వినిపిస్తుంది. గోదావరి సమీ పాన శివాలయం (సూర్యేశ్వర)ఆలయం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వాలు అతిధి గృహలను నిర్మించింది.
నాగోబా దేవాలయం... : జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దెైవం అయిన నాగోబా దేవతకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి కా కుండా పొరుగు రాష్ట్రాలెైన చత్తీస్గడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది గిరిజనులు తమ ఇష్ట్ట దెైవాన్ని దర్శించుకునేందుకు హా జరవుతారు. ప్రతియేటా పుష్యమాసంలో అమావాస్య రోజున మేస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వ హించడంతో జాతర ప్రారంభమవుతుంది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి 22 తె గలకు చెందిన మేస్రం వంశీయులు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పూర్వం మే స్రం వంశానికి నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో సర్పం రూపంలో వచ్చి ఆమెకు జన్మించాడని చరిత్ర చెబుతుంది. ఆ కలను మేస్రం వంశీయులు నమ్మడంతో సర్పం రూపంలో ఉన్న నాగేంద్రు నికి తల్లి నాగాయి మోతిరాణికి తమ్ముడి కూతురు గౌరికి పెళ్లి జరిగిందని చెబుతుంటారు. పుష్య మాసానికి ముందు వచ్చే పౌర్ణమి నుంచి మేస్రం వంశీయులు కాలినడకన గోదావరి నది జలాలను తీసుకు వచ్చి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ ప్రతి యేటా ప్రభుత్వం దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
గిరిజన పోరాట యోధుడు కొమరంభీం...

ఆ సందర్భంలో ఒక తిరుగుబాటు లో పాల్గొని నిర్బంధం నుంచి తప్పించుకొని చాందా మీదుగా కాకన్ఘట్ చేరి అక్కడి నుంచి చిన్నయనల వద్దకు వచ్చాడు. వారు పడిన అవస్థలు దోపి డిల గురించి విన్న భీం చలించి పోయి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ సంద ర్భంలో వారికి నమ్మకమైన మనిషి లోటును తీర్చేందుకు ముందుకు వచ్చా డు. అడవి మనది, పోడు మనది, పంట మనది, అని భీం ప్రకటించాడు. ఆసిఫాబాద్ అడవుల్లో నెైజాం సైన్యానికి, భీం సైన్యానికి మధ్య దాదాపు 7 నెలల యుద్దం జరిగింది. చివరి సారిగా నెైజాం వాళ్లు 300లకు పెైగా సైన్యం భారీ మందుగుండు సామాగ్రి, వెైద్య బృందం తో తహసిల్దార్ న్యాయకత్వంలో దీపావళి మా సపు పున్నమి రోజున జోడేఘాట్ ఎక్కారు. 5 గంటల హోరాహోరి పోరు జరిగింది.
ఆ సమయంలో గుండి గూ డెం నివాసి మడావి పొద్దు పటేల్, నెైజాం సైన్యానికి భీంను చూపించ గా సైన్యం అతనిని కాల్చి చంపింది. భీం మరణిం చిన తర్వాత 12 గ్రామాల ప్రజలు చెల్లా చెదురయ్యారు. నెైజాం సామం తరాజుకు వ్యతిరేకంగా భీం న్యా యకత్వంలో గోండ్లు జరిపిన సాయుధ తిరుగుబాటు 1940నాటికి అణిచి వేయబడింది. భీం న్యాయకత్వం లో గిరిజనులు పోలీసులకు ఎదురొడ్డి నిలి చిన సంఘటన నిజాం ప్రభువును కదిలిం చింది. వారి సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు వారి జీవన విధానం పెై పరిశోధన చేసి నివేదిక సమర్పించాలని ఇంగ్లాండ్కు చెందిన సామాజిక శాస్త్ర వేత్త ప్రోఫెసర్ హేమన్డార్ఫ్ ఆయన సతీమణిని నిజాం ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనుల్లో ఒక్కడెై గిరిజనుల జీవన విధానాలు వారికి కావాల్సిన పథకాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేధిక సమర్పించారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ది ఆనాటి కొమరంభీం త్యాగ ఫలమే. భీం వర్థంతి సభను దీపావళి పున్నమి రోజున జోడేఘాట్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అక్కడ ప్రజా దర్బార్ను ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
No comments:
Post a Comment