విహారాలు

India

Gamyam

Monday, November 1, 2010

అటవీ అందం... పులుకు ఆలవాలం... పెంచ్‌ నేషనల్‌ పార్క్‌

Pench-National-Park1
దేశంలో ఉన్న పులు సంరక్షణా కేంద్రాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచింది... మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ. ఈ జాతీయ పార్క్‌ను ఇందిరా ప్రియదర్శిని పెంచ్‌ నేషనల్‌ పార్క్‌గా పిలుస్తారు. మధ్య భారతంలోని సాత్పురా పర్వత శ్రేణికి దక్షిణ దిశలోని వాలు ప్రాంతంలో పెంచ్‌ పార్క్‌ ఉంది. ఈ జాతీయ వనంలో అనేక కాల్వలు, నాలాలు ప్రవహిస్తుడడంతో ఎప్పుడూ పచ్చదనంతో అలరాతుంది. ఈ పార్క్‌లో అతిఎతె్తైన ప్రాంతం కాలపహార్‌. ఇది సముద్ర మట్టానికి 650 అడుగుల ఎత్తులో ఉంది. పెంచ్‌ నది ఈ పార్క్‌ గుండా ప్రవహిస్తుంది. పులులతో పాటుగా అనేక జంతువులకు ఈ పార్క్‌ ఆలవాలంగా ఉంది. పార్క్‌లో ఐదు చోట్ల నిరంతరం ప్రవహించే జలపాతాలు కనువిందు చేస్తాయి. పెంచ్‌ పార్క్‌ను పులుల సంరక్షణా కేంద్రంగా 1977లో ప్రకటించారు.

Pench-National-Park
ఈ పార్క్‌ వైశాల్యం 449.39 చదరపు కి.మీ. 1983లో ఈ పార్క్‌ను జాతీయం చేశారు. దేశంలో 19వ పులుల సంరక్షణా కేంద్రం పెంచ్‌. పెంచ్‌ నదిపై జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1977-1988 సంవత్సరాల మధ్య నిర్మించారు. పెంచ్‌ పార్క్‌లో 1200 రకాల వృక్షాలు ఉన్నాయి. ఇందులో కొన్ని ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. దేశంలో అత్యధికంగా జంతువులు నివసిస్తున్న జాతీయ సంరక్షణా కేంద్రం పెంచ్‌. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్‌లో 90.3 జంతువులు నివశిస్తున్నాయి. ఈ పార్క్‌లో జీపులో తిరిగే అవకాశంతో పాటుగా, ఏనుగు సవారీ, పెంచ్‌ రిజర్వాయర్‌లో బోటింగ్‌, పెంచ్‌ నదిలో రివర్‌ రాఫ్టింగ్‌ వంటి సదుపాయాలు ఉండటం విశేషం. ఫిబ్రవరి నుండి జూన్‌ వరకు ఈ పార్క్‌లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. వర్షకాలంలో (జులై1 నుండి సెప్టెంబర్‌30) ఈ పార్క్‌ను మూసివేస్తారు. అక్టోబర్‌ నుండి ఇక్కడి తిరిగి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ఎలా చేరుకోవాలి...
ఈ ప్రాంతానికి దగ్గరి విమానాశ్రయం నాగపూర్‌. ఇక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా 92 కిమీలు ప్రయాణిస్తే... పెంచ్‌ పార్క్‌కు చేరుకోవచ్చు. అలాగే రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు సియోనీ (60 కిమీ), నాగపూర్‌ (92 కిమీ), జబల్‌ పూర్‌ (195 కిమీ) రైల్వే స్టేషన్‌ల నుండి చేరుకోవచ్చు.

No comments:

Post a Comment