విహారాలు

India

Gamyam

Saturday, September 25, 2010

ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయం * దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం

ఇది ఆలయం కాదు విశ్వవిద్యాలయం

తమిళనాడు ఆలయాలలో తమిళ భాష వినిపించకుండా పోయిన రోజుల్లో... ముఖ్యమంత్రి కరుణానిధి చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఆలయాల్లో తమిళ ప్రార్ధలను పునరుద్ధరించారని, అలా తంజావూరు కేంద్రంగా దక్షణాదిని పాలించిన రాజరాజచోళుని అభిమతాన్ని కరుణానిధి నెరవేర్చారు.
బృహదీశ్వరాలయం సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా .. తమిళ సంప్రదాయానికి, కళా, సాహిత్యాలకు చోళరాజుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తంజావూరులోని తమిళ విశ్వవిద్యాలయం ఈ సదస్సును నిర్వహించింది.  క్రీ.శ.985లో అధికాంలోకి వచ్చిన రాజరాజచోళుడు అనతికాలంలోనే చక్రవర్తులకు చక్రవర్తిగా ఎదిగాడు.

ఆయన పాలనలో తమిళ భూభాగం ఎన్నోవిధాలా అభివృద్ధి చెందిందనీ, నిజానికి ఆయన ఓ సింహమనీ అన్నారు. పరిపాలనాదక్షుడైన రాజ రాజచోళుని కాలంలో రాజ్యం అన్నివిధాలా అభివృద్ది చెందిందన్నారు. ఆ కాలంలోనే ఇక్కడ జైనమతం కూడా వృద్ధి చెందిందనీ, సమాజం సమతౌల్యంగా ఉండేదని అన్నారు. 1003లో ప్రారంభమైన ఆలయ నిర్మాణం 1010లో పూర్తయిందన్నారు.

ఇలా గత వేయి సంవత్సరాలుగా సమున్నతంగా నిలిచివున్న ఈ ఆలయ నిర్మాణం, శిల్పకళా వైవి«ధ్యం ఇప్పటికీ అపురూపమేనన్నారు. ఆలయ నిర్మాణ సారధి వీరచోళన్ కుంజరమాలన్ రాజరాజ పురంద చోళన్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ఆలయమే ఓ విశ్వవిద్యాలయమనీ, ఇక్కడ నృత్య, సంగీత, సాహిత్య, చిత్రలేఖనం, నాటకం వంటి అన్ని కళారంగాలు విలసిల్లాయన్నారు. అంతకు ముందు బృహదీశ్వ రాలయానికి సంబంధించిన పెయింటింగ్స్‌తో రూపొందించిన ఓ పుస్తకాన్ని  ఆవిష్కరిచారు.

అలరిస్తున్న కళారూపాలు...
బృహదీశ్వరాలయం సహస్రాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించనున్న వివిధ కళరూపాలు సందర్భకులను అలరిస్తున్నాయి. 26వ తేదీన ముగుస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం దేశ, విదేశాలకు చెందిన మొత్తం వేయి మంది కళాకారులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నర్తకీమణి డాక్టర్ పద్మాసుబ్రమణ్యం సంగీతం సమకూర్చారు.

భరతనాట్య శాస్త్రాచార్యుడు భరతముని తెలిపిన 108 కరణ శిల్పాల్లో ఈ ఆలయంలో 81 శిల్పాలున్నాయి. బిగ్‌టెంపుల్ వేయి వసంతాల వేడుకలో భాగంగా తంజావూరునగరం అంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ఆలయానికి మరమ్మతులు చేయిడమే కాక, రూ. 25 కోట్ల వ్యయంతో పట్టణంలో కూడా సౌకర్యాలను మెరుగు పరిచింది.

పందిళ్లు, మామిడాకు తోరణాలు, పూల హారాలు, విద్యుత్ దీపాలంకరణలతో తంజావూరు వెలుగులు విరజిమ్ముతోందని పలువురు సందర్శకులు అభిప్రాయపడ్డారు.
విదేశీ పర్యాటకులను అబ్బుర పరుస్తున్న తంజావూరు బృహదీశ్వరాలయం
'మా కళ్లను మేమే నమ్మలేకున్నాం, ఇటుక, కలప లేకుండా ఇంత పెద్ద ఆలయమా? ఈ క్షేత్రంలోని ప్రతి శిల్పంలోనూ జీవం ఉట్టిపడుతోంది. యంత్రాలు, ఆర్కిటెక్చర్లు, ప్లాన్లు, రోడ్లు అందుబాటులో లేని రోజుల్లో రాళ్లకు ప్రాణం పోశారేమోననిపిస్తోంది. నిజం గా మహాద్భుతం...' అంటూ విదేశీ పర్యాటకులు పరవశించిపోయారు. తమ జీవితంలో ఈ అనుభూతి మరువలేనిదంటూ కొనియాడారు. తంజావూరు పట్టణంలో రాజరాజ చోళ చక్రవర్తి వెయ్యేళ్ల క్రితం నిర్మించి, పూజలు చేసిన బృహదీశ్వరాలయ సహస్రాబ్ది ముగిం పు ఉత్సవాల్లో పాల్గొనేందుకు వందలాది మంది విదేశీ పర్యాటకులు ప్రస్తుతం తంజావూరు వచ్చారు.

అక్కడ ప్రపంచ అద్భుతాలలో ఒకటైన బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడి కళాకృతులను, ఆల య ప్రాశస్త్యాన్ని, పుస్తకాలు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్న వారు ప్రత్యక్షంగా చూసి పులకించారు. ఆలయం ఎత్తు, వెడల్పు, పొడవు చూస్తుంటే, పూర్తిగా ఒండ్రుమట్టితో నిండిన ఆ ప్రాంతానికి ఇన్ని బండరాళ్లు ఎక్కడి నుండి వచ్చాయి. ఏ వాహనా ల్లో ఎక్కించి ఇక్కడికి తరలించారు. ఎం త మంది, ఎన్ని రోజులు శ్రమించారు.
ఈ బండరాళ్లను శిల్పాలుగా మలచేందుకు ఎటువంటి పనిముట్లు ఉపయోగించారు? ఇనుముతో తయారైన ఉలి తో శిల్పం చెక్కితే ఆ ఇనుమును పదు ను చేయగల హీట్ ట్రీట్‌మెంట్ వారికి తెలుసుండాలి. వేడిచేసిన ఇనుమును నీటిలోనో, నూనెలోనో ముంచి ఉండా లి. కణకణమనే నిప్పుల్లో కాలిన ఇను ము నూనెలో ముంచె కళ వెయ్యేళ్ల క్రిత మే వాడుకలో ఉందా? ఆలయ నిర్మాణంలో పాల్గొన్న కార్మికులు, కళాకారు లు ఎంతమంది, వారికి భోజనం, బియ్యం, కూరగాయలు ఎలా సేకరించారు, వంట పాత్రలెన్ని, కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగైన స్థలాన్ని ఏర్పాటు చేశారా, మనుష్యులకు సా యంగా, ఏనుగులు, పశువులు, గు ర్రాలు, గాడిదలు ఉన్నట్లయితే వాటికి మేత, పోషణ చూసుకున్న వారెందరు.

వారంతా పురుషులేనా, ఆలయ నిర్మాణంలో మహిళలు కూడా పాలుపంచుకున్నారా? ఊహకందని ఇలాంటి అనుమానాలు రావడంతో ఆ విదేశీయులు ముక్కున వేలేసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే, గుడిలో కొలువుదీరిన రాతి ప్రతిమలు, ఒక రాతితో చెక్కిన 36 అడుగుల ఎత్తు స్థూపం, వేయి టన్నుల బరువుతో ఉన్న కొండరాళ్లను వందలాది మైళ్ల నుండి ఇక్కడికి ఎలా తరలించగలిగారు.

ఆలయ నిర్మాణం పనులు పూర్తయ్యాక దాని నిర్వాహక మెవరికి అప్పగించారు? ఇలాంటి వివరాలతో శిలాఫలకాలుంటాయేమోనని ఆలయం, ఆ పరిసరప్రాంతాలు మొత్తం వెదికారు. భారత పురావస్తుశాఖ నిపుణులే చెప్పలేని సమాధానం. వివరించజాలని శక్తికి, దైవానికి, తనవల్ల చేతనైన గుర్తుగా నిర్మించాడు ఆ చోళచక్రవర్తి. ఆ మరచిపోలేని గుర్తే బృహదీశ్వరాలయం.
ఈ ఆలయాన్ని అక్కడ శిల్ప సౌందర్యాన్ని, కొలువైవున్న వింతలను దర్శించుకున్న విదేశీయుల బృందాలు ధన్యులమయ్యామని ముక్త కంఠఃతో వ్యాఖ్యానించారు.
దక్షిణ భారత శిల్ప సౌందర్యం బృహదీశ్వరాలయం
భారతదేశంలో దేవాలయం అన్నది మతానికి, ఆరాధనకు జీవగర్రగా ఉంటూ వచ్చింది. విగ్రహాన్ని నెలకొల్పిన ఆలయంలో భక్తులకు ప్రదక్షిణ, పూజచేయడానికి ఏర్పాట్లుండేవి. ఆలయం అనేది మనదేశంలో వివిధ దశల్లో రకరకాలుగా రూపొందుతూ వచ్చింది. ఆయా దేశ, కాల పరిస్థితులను బట్టి దేవాలయం మార్పులకు లోనవుతూ వచ్చింది. అయితే ఆలయాలను నిర్మించిన స్థపతులూ, శిల్పులూ ఒకే రకమైన శిక్షణ పొందినవారు. ఆయా దేవాలయాలలోని దేవుళ్లు, పూజాపద్ధతులు తెలిసిన పూజారులు, మతాధికారులు మొదలైన వారి ఆదేశాలనుసారం ఈ శిల్పులు ఆలయ నిర్మాణాలు చేశారు.ప్రధాన దేవతా విగ్రహాల రూపుౌౌరేఖలలో ఆలయాల శిల్పరీతులలో అలంకరణలలో మార్పులు చేశారు.వీటన్నిటి ఫలితంగానే మన శాస్త్రాలలో పేర్కొన్న వాస్తు శిల్ప, ఆగమ గ్రంథాలు, సూత్రాలు రూపొందాయి. ఈ కారణంగానే మన దేశంలోని వాస్తు శిల్పం అంటూ ఒక సమగ్రమైన, మౌలికమైన భారతీయ శిల్పంగా గోచరిస్తుంది. అలాంటి శిల్ప, వాస్తు సౌందర్యాల మేళవింపే బృహదీశ్వరాలయం...

tempulతమిళనాడులో కావేరీ నదికి దక్షిణాన ఉన్న తంజావూరులో ఉంది బృహదీ శ్వరాలయం. తంజావూరుకు ఈ పేరు ‘తంజన్‌-ఆన్‌’ అనే రాక్షసుని వల న వచ్చిందని చెబుతారు. ఈ రాక్షసుడు శ్రీఆనందవల్లి అమ్మ, శ్రీనీలమేఘ పెరుమాళ్‌ ల చేత చంపబడ్డాడని, ఆ రాక్షసుని కోరిక మేరకు ఈ పట్టణానికి తంజావూరు అనే పేరు వచ్చిందనేది ఒక పురాణగాథ. చారిత్రకంగా ఈ నగరం చోళ రాజులకు బలమైన కేంద్రం. తరువాత నాయక రాజులు, ఆ తరువాత విజయ నగర రాజులు పరిపాలించారు. అటుపిమ్మట 1674వ సంవత్సరంలో ఈ నగరాన్ని ‘వెంకాజీ’ ఆక్రమించుకున్నాడు. ఈ వెంకాజీ శివాజీ మహారాజు కు తమ్ముడు. 1740లో బ్రిటీష్‌వారు మొదట ఆక్రమణకు ఇక్కడికి వచ్చినా విఫలం చెందారు. తరువాత 1799లో విజయం సాధించారు. ఇదీ స్థూలంగా ఈ నగర చరిత్ర.

అచ్చెరువొందే శిల్పకళానైపుణ్యం...
ఆనాడు చోళుల సామ్రాజ్యం తమిళ, కేర ళ దేశాలకే కాక దక్షిణ మైసూరు, కోస్తాంధ్ర, అండమాన్‌, లక్షద్వీప్‌, మాల్దీవులు మొదలైన ద్వీపాలకు విస్తరించి ఉంది. అప్పటికే రాష్ట్ర కూటులు తమ ప్రాభవాన్ని కోల్పోగా పశ్చిమ చాళుక్యులు విజృంభించారు. చాళుక్యులు వచ్చే నాటికే అక్కడక్కడా రాతితో ఆలయ నిర్మాణాలు, వాటిపై అందమైన శిల్పాలు శాస్తబ్రద్ధంగా పరిణతి చెందాయి. విశాలమైన ఈ ఆలయానికి చేరడానికి మూడు ద్వారాలున్నాయి. మొదటి ద్వారం అనగా ప్రవేశద్వారం ‘కేరళాంతకన్‌’, రెండో ద్వారం ‘రాజరాజ న్‌ తిరువసల్‌’, మూడో ద్వారం ‘తిరువానుక్కన్‌ తిరువసల్‌’.

Shiva-Lingamఈ ఆలయం సర్వ కళా శోభితమై సంస్కృత తమిళ శాసనాలున్న చారిత్రాత్మక సుప్రసిద్ధ దేవాల యంగా అలరారుతున్నది. క్రీశ 1003-14 ప్రాంతంలో మొదటి రాజరాజ చోళుడు బృహదీశ్వరాల యాన్ని నిర్మించాడు. ఈ పవిత్ర ఆలయంలోకి అడుగిడగానే 13 అడుగుల ఎతె్తైన శివలింగం దర్శనమిస్తుంది.ఐదుపడగల నాగేంద్రుని నీడన స్వామి దర్శ నమిస్తాడు. ఈ దేవాలయం మొత్తం నిర్మాణంలో ఇదొక అద్భుతమైన నిర్మా ణం. దక్షిణ విమాన నిర్మాణ కౌశలానికి, తమిళ శిల్పుల ళా నైపు ణ్యానికి పరాకాష్టగా దీనిని పేర్కొనవచ్చు. ఈ బృహదీశ్వరాలయా న్ని నిర్మించిన రాజరాజచోళుడి పేరున ‘రాజరాజేశ్వరాలయం’ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం వాస్తు, శిల్ప, చిత్రలేఖన కళ లన్నిటి సంగమం అని చెప్పవచ్చు.

ైభారీ నంది, ఎతె్తైన శివలింగం...
ఈ ఆలయానికి ఎదురుగా బ్రహ్మాండమైన నంది శిల్పం ఉంది. రాజ రాజచోళుని తరువాత వచ్చిన రాజులు ఈ నంది విగ్రహం చుట్టూ చక్కని మండపాన్ని నిర్మించారు. అనంతపురం జిల్లాలోని లేపాక్షి నంది విగ్రహం కంటే ఈ విగ్రహం పెద్దది. మండపం లోపలి కప్పుకి అందమైన రంగులతో డిజైన్లు చిత్రించారు. ఆ చిత్రాలు ఇప్పటికీ తమ ప్రాభవాన్ని కోల్పోకుండా అందంగా అలరిస్తున్నాయి. ఈ మండపం చాలా ఎత్తులో ఉంటుంది. బృహదీశ్వర ఆలయం విమానపు అధిష్టానం రెండు తలాలతో, మందమైన రెండు గోడల సాంధర ఆలయంగా ఉంటుంది. ఆలయం తూర్పునకు అభి ముఖంగా ఉండగా, ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో ద్వారాలున్నాయి. గర్భగు డిలో చాలా పెద్ద పీఠం, దానిమీద పెద్ద లింగం ఉంది. ఇంత పెద్ద లింగం బహు శ దక్షిణ భారతదేశంలోనే లేదేమో! రెండు గోడల మధ్య రెండతస్తులతో ప్రదక్షి ణ మార్గం కూడా ఉంది.ఇలా నాలుగు వైపులా ద్వారాలున్న ఈ ఆలయం సర్వతోభద్రంగా ఉన్న ఆలయంగా వర్ణిస్తారు.

అబ్బురపరిచే వర్ణచిత్రాలు...
Big-Nandi అలాగే ఆలయద్వారానికి అటూ ఇటూ ఉన్న నిలువు గూళ్లను దేవకోష్టాలుగా తీర్చి వాటిలో దేవతామూర్తుల విగ్రహాలనుం చారు. ఇక కింది తలుపు లోపలి గోడలో దక్షిణాన శివుడు, పడమట వైపు నటరాజు, ఉత్తరాన దేవీ విగ్రహాలున్నాయి. ఆలయ ప్రదక్షిణ మార్గపు లోపలి గోడల మీద, కుడ్య స్తంభా లమీద, ఆలయ చూరు మీద, బయటి గోడలో తట్టుమీద అందమైన వర్ణచిత్రాలున్నాయి. ఈ వర్ణ చిత్రాలలో శివుడు త్రిపురాసురుడనే రాక్షసుడిని సంహరించిన కథ చిత్రాలు ఉన్నాయి. ఇంకా శివ భక్తుడై న సుందరమూర్తి కథ, చిదంబరం నటరా జు మూర్తిని రాజు పూజిస్తున్న దృశ్యం, గాయకులు, నాట్యకత్తెలు, వివిధ పక్షులు వంటి చిత్రాలను అందంగా చిత్రించారు.

ప్రాకారంలో నందికి ఉత్తరంగా బృహదీశ్వరీ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయ విమానం మీద విశాల శిఖరం, ఎదురుగా మండపాలు ఉన్నాయి. ఆ పక్కనే సభామండపంలో దక్షిణాముఖుడైన నటరాజస్వామి ఉన్నాడు. ఆగ్నేయాన గణేశుడు, వాయువ్యాన సుబ్రహ్మణ్య ఆలయాలు తూర్పు ముఖంగా ఉన్నాయి.ఇవన్నీ కూడా కాలక్రమంలో వివిధరాజులు కట్టించినవి.

Bruhadeeshwaraalayamబృహదీశ్వర ఆలయ ప్రాంగణంలో నాయక రాజులు కట్టించిన సుబ్రహ్మణ్య ఆలయం ఒక మణిపూసవంటింది.బృహదీశ్వర ఆలయ ప్రాకారం లోపల ఈ ఆలయాన్ని విమాన అర్ధ, ముఖ మండపాలతో కట్టారు. నునుపైన గట్టి రాతితో కట్టిన ఈ ఆలయపు అధిష్ఠానం మీద, కుడ్య స్తం భాల మీద చాలా సూక్ష్మమైన, అందమైన శిల్పాలున్నాయి. ఈ శిల్పాలు అందమైన అలం కరణ లతో కనులు పండువుగా ఉన్నాయి. గర్భగృహంలో సుబ్రహ్మణ్య స్వామిని సూచిస్తున్నట్లు ఆల య గ్రీవ శిఖరాలు షణ్ముఖంగా ఉంటాయి. బహుతలములైన ఈ ఆలయపు విమాన తలం మూ లలు కూడా షట్భుజంగా ఉన్నాయి. ఈ పద్ధతి తరువాతి దక్షిణాత్య స్థపతులకు మార్గదర్శకాల య్యాయి.

సమ్మోహనభరితం... కోట ప్యాలెస్‌
తంజావూరులో చూడదగ్గ మరో అద్భుత కట్టడం పెద్ద కోట ప్యాలెస్‌. 14వ శతాబ్దంలో పరిపాలించిన నాయక, మరాఠా రాజులు ఈ ప్యాలెస్‌ను గొప్పగా తీర్చిదిద్దారు. దాదాపు 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్యాలెస్‌లో సమ్మో హనపరిచే అందమైన కట్టడాలు, విశాలమైన కారిడార్లు, గదులు, ఎతె్తైన టవ ర్లు, ఆకర్షణీయమైన వర్ణచిత్రాలతో గది గోడలు, పరరాజుల దాడులలో రక్షణ కు ఉపయోగించే రహస్య భూమార్గాలు ఉన్నాయి.

విజ్ఞాన గని... సరస్వతీ మహల్‌
పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వాటిలో ముఖ్యమైనది సరస్వతీ మహ ల్‌ గ్రంథాలయం. ఈ గ్రంథాలయంలో పురాతన తాళపత్ర గ్రంథాలు, ఆనాటి వర్ణచిత్రాలు, చోళ, నాయక, మరాఠా రాజులు వాడిన ఆయుధాలు, వాటికి సంబంధించిన వివరాలున్నాయి. సంస్కృత గ్రంథాలు, వేలాది రాతప్రతులు, భారత యూరోపియన్‌ భాషలకు సంబంధించిన గ్రంథాలు, అముద్రిత గ్రంథాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గ్రంథాలయం ఓ పెద్ద విజ్ఞాన భాండాగారం. చరిత్ర అధ్యయన కారుల కు, విజ్ఞానపిపాసులకు ఈ గ్రంథాలయం ఓ వరం.

త్యాగరాజస్వామికి ఘన నివాళి...
తంజావూరుకి 11 కి.మీ. దూరంలో ఉన్న ‘తిరువయూరు’ అనే గ్రామం కావేరీ నది ఒడ్డున ఉంది. ఈ గ్రామంలోనే ప్రఖ్యాత వాగ్గేయకారుడు త్యాగరాజ స్వామి వారి సమాధి మందిరం ఉం ది. అనర్గలమైన సంగీత రత్నాలను అందించిన ఆయన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ‘త్యాగ రాజస్వామివారి ఆరాధన ఉత్సవాలు’ ఘనంగా జరుపుతారు. ఆరోజు ఇక్కడికి దేశం నలుమూ లల నుంచి సంగీత విద్వాంసులు వచ్చి స్వామివారికి నీరాజనాలు పలుకుతారు. ఆయన రచించి న గీతాలను ఆలపిస్తూ ఈ కార్యక్రమం సాగుతుంది.

బృహదీశ్వరాలయానికి చేరుకోవాలంటే...
ఈ ప్రసిద్ధ ఆలయానికి చేరాలంటే... చెనై్న వరకు రైలు లేదా విమాన ప్రయాణం ద్వారా చేరుకొ ని అక్కడి నుండి బస్సు ద్వారా తంజావూర్‌ చేరుకోవచ్చు.

తొలి వెయ్యి నోటుపై బృహదీశ్వరాలయం...
note1954లో మొట్టమొదటిసారిగా రూ.1000 నోటు చలామణిలోకి వచ్చింది. ఆనాడు భారత ప్రభుత్వం ఆ నోటుమీద బృహదీశ్వరాయం బొమ్మను ముద్రించింది. తరువాత 1975లో భారత ప్రభుత్వం వెయ్యి రూపాయల నోటును నిషేధించింది. ఈనాడు మళ్లీ ఈ ఆలయం సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా అందరికీ ఆ నోటు గుర్తుకు వచ్చింది.
1954లో తొలిసారిగా బృహదీశ్వరాలయం ఫొటోతో విడుదలైన వెయ్యి రూపాయల నోటు

తపాలా ‘ముద్ర’...

Stamp-forరాజరాజచోళునిచే 1010వ సంవత్సరంలో తంజా వూరులో నిర్మించిన బృహదీశ్వరాలయానికి వెయ్యి సంవత్సరాలు నిండిన సందర్భంగా, సహస్రాబ్ది ఉత్స వాలకు తపాలాశాఖ 26-9-2010 న బృహదీశ్వరాలయం బొమ్మలతో ఒక ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసింది. మన దేశంలో ఉన్న అతిపెద్ద గర్భగుడి, విమాన గోపురం ఉన్న దేవాలయం ఇదే. భూమినుండి స్తుపి వరకు 66మీ ఎత్తులో అద్భుత శ్పికళా సంపదతో అలరారే ఈ దేవాలయం ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
ఇటీవల తపాలా శాఖ విడుదల చేసిన బృహదీశ్వరాలయం పోస్టల్‌ స్టాంప్‌
- దామర్ల విజయలక్ష్మి

No comments:

Post a Comment