విహారాలు

India

Gamyam

Saturday, September 18, 2010

వన్యప్రాణుల ఆవాసం... పోచారం అభయారణ్యం

చెంగు చెంగున గంతులు వేసే లేళ్ళు... పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు... అడవికి మంత్రిగా వ్యవహరించే నక్కలు... గాంభీర్యానికి, హుందాతనానికి, పౌరుషానికి పెట్టింది పేరైన చిరుతపులులు... ఎలుగు బంట్లు, మనుబోతులు, కంజులు, తోడేళ్ళు, కొండ గొర్రెలు, అడవి పిల్లులు, ముద్దొచ్చే కుందేళ్ళు తదితర జంతువులతో ఒకనాటి నిజాం షికార్‌ ఘర్‌ గా ప్రసిద్ధిగాంచిన నేటి పోచారం అభయారణ్యం నిగనిగలాడే పచ్చని చెట్లతో అలలారుతుంది. మెదక్‌ జిల్లాలోనే కాకుండా రాష్టవ్య్రాప్త విహారకేంద్రంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న పోచారం అభయారణ్యం విశేషాలు ...


pranulu
వనం అంటే అడవి అని అందరికీ తెలిసిందే... అడవిలో నివసించే జంతువులను వన్యమృగాలు అంటారు. సింహం, పులి, చిరుత, లేడి, జింక, దుప్పి మొదలైనవి వన్యప్రాణులు. ఇవి అటవీ సంపద లో ఒక భాగం. పచ్చదనంతో విశేషంగా ఆకట్టుకుంటున్న పోచారం అభయారణాన్ని కాపాడుకోకుంటే... ఆ వన్య మృగాలు కనుమరుగైపోయే ప్రమాదం ఉందంటున్నారు పర్యావణ మేధావులు. పోచారం అభ యారణ్యంలో వందల కొలది ఉన్న అడవి జంతువులను రక్షించుకోవడం మన బాధ్యత అంటున్నారు వారు. అడవులు మానవ జాతి మనుగడ కోసం సృష్టి ప్రసాదించిన సంపద.

మానవ మనుగడ పర్యావర ణంపై ఎంతో వుంది. పర్యావరణాన్ని కాపాడాలంటే అడవులు, వన్యప్రాణులు తప్పనిసరిగా బతికించుకో వాలి. వేటగాళ్ళు, అడవి దొంగల వల్ల నాశనమవుతున్నాయి. వారు వన్య ప్రాణులను అనేక కారణాలుగా వధిస్తూనే ఉన్నారు. రాజరిక వ్యవస్థ నుండి నిన్నటి మొన్నటి వరకు కొందరు వేటగాళ్ళు ఇతరుల మెప్పు పోందడానికి క్రూర మృగాలను వేటాడి చంపేవారు. 1916-27 ప్రాంతంలో నిజాం ప్రభువు తీరిక సమ యంలో జంతువులను వేటాడేందుకు ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లా, మెదక్‌ జిల్లా సరిహద్దులో ఉన్న పోచా రం ప్రాజెక్టు చూట్టూరా వున్న అటవీ ప్రాంతాన్ని షికార్‌ ఘర్‌ పేరుతో అభివృద్ధి పరిచారు.

Bear
ఈ అభయార ణ్యం హైదరాబాద్‌ నుండి 110 కిలోమీటర్లు, మెదక్‌ పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో వుంది. నిజాం పరిపాలన అంతరించి స్వాతంత్య్రం సిద్దించాక 1952 లో పోచారం అభయారణ్యం ఏర్పడిన తర్వాత కూ డా నవాబులు, ఉన్నతాధికారులు సైతం 1990 వరకు పోచారం అభయారణ్యంలో వేటాడటం కోసం అత్యాధునిక ఆయుధాలతో పోచారం అతిథి గృహంలో నివాసం వుంటూ వేటాడేవారు. ఈనాడు వన్యప్రా ణులకు కష్టకాలం దాపురించింది. అడవులు అంతరించిపోతున్నాయి.

మానవులు తన స్వార్థానికి అడవులను నరికి వన్యప్రాణులకు నిలువు నీడ లేకుండా చేస్తున్నారు. దానికి తోడు కారిచిచ్చు వల్ల అడవులు తగల బడిపోయి వన్యప్రాణులు సజీవదహనమవుతున్నా యి. దొరికిన వన్యప్రాణులను చంపడం క్రమంగా పెరిగిపోయింది. దీంతో అడవి జంతువుల సంఖ్య తరిగిపోయి పూర్తిగా అంతరించే ్రపమాదం ఏర్ప డింది. దీంతో మెదక్‌ జిల్లా అటవీ శాఖ వన్య ప్రాణి విభాగం పరిధిలో మెదక్‌లో డివిజన్‌ కార్యాలయా న్ని ఏర్పాటు చేశారు. పోచారం అభయారణ్యం 13 వేల హెక్టార్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో నిజా మాబాద్‌ 74 స్క్వేర్‌ కిలోమీటర్లలో ఉంది.

RedBilledGullFlock
మెదక్‌ జిల్లాలో 56 స్క్వేర్‌ కిలోమీటర్లలో 5,600 హెక్టార్లలో ఉంది. ఈ అభయారణ్యం పరిధిలో మెదక్‌ జిల్లాలోని మెదక్‌, రామాయంపేట మండలాలు, నిజామాబాద్‌ జిల్లాలో లింగంపేట, తాడ్వాయి, బిక్కనూర్‌, ఎల్లారెడ్డి మండలాలు ఉన్నాయి. పోచారం అభయారణ్యంలో వేటాడడం తగ్గడానికి ప్రభుత్వం కన్నా మావోయిస్టు నక్సలైట్ల దళాలు అడవుల్లో సంచరించడం వల్లనే ఈ అభయారణ్యం వృద్ధిచెందిందనేది నగ్నసత్యం. కాగా అడవులు అంతరించిపోవడంతో పాటు మానవుల స్వార్ధానికి అడవులు నరికి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారు. దానికి తోడు కారుచిచ్చు వల్ల అడవులు తగలబడిపోయి వేలాది వన్యప్రాణులు సజీవ దహనం అవుతున్నాయి.


snakeఅడవులలో నివసించే జంతు వులలో సింహం, పులి, చిరుత మొదలైనవి కౄర జంతువులు. ఇవి తక్కిన జంతువులను చంపితిని బతుకుతాయని వన్యప్రాణి సంరక్షణ అటవీ శాఖ రేంజర్‌ సర్వేశ్వర్‌ తెలిపారు.పోచారం అభయారణ్యంలో ఒకప్పుడు వేటగాళ్ళకు నిలయంగా ఉండేందని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. వేటాడడం నిషేధించడమే కాకుండా వన్యప్రాణులను చంపి నా, వేటాడినా కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.

పోచారం జింక ల ప్రత్యుత్పత్తి డిబిసి 1 లో 125.33 హెక్టార్లు, డిబిసి 2లో 39.30 హెక్టార్లు ఉన్నట్టు తెలిపారు. వీటిలో జింకల ప్రత్యుత్పత్తి చేస్తు న్నట్టు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలిపారు. ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని తెలిపారు. మన రాష్ట్రంలో నానాటికీ అటవీ సంపద అంతరించిపోతు న్నది. పచ్చదనానికి, అటవీ జంతువులకు ఆలవాలంగా నిలుస్తున్న ఈ పోచారం లాంటి అభయారణ్యాలను కాపాడుకోకపోతే అటవీ జంతువులు మనకు కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది.
- సి.హెచ్‌.అశోక్‌‌


pocharam

No comments:

Post a Comment