విహారాలు

India

Gamyam

Monday, August 23, 2010

దక్షిణ కాశీ... అలంపూర్‌ క్షేత్రం

బాదామి చాళుక్యులు... కన్నడ, ఆంధ్రప్రదేశ్‌లలో అనేక నిర్మాణాలు చేపట్టారు.బీజాపూర్‌ జిల్లా మొదలైన కన్నడ ప్రాంతాలలోనేకాక ఆంధ్రప్రదేశ్‌లోని అలంపురం, సంగమేశ్వరం మొదలైన చోట్ల దేవాలయాలు నిర్మించారు. అలాంటి వాటిలో ఒకటైన పవిత్ర క్షేత్రమే మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఉన్న అలంపూర్‌ క్షేత్రం. ఉత్తర వాహిణీ తుంగభద్రతీరంలో నెలవై... దక్షిణ కాశి గా పేరుగాంచిన ఈ క్షేత్ర విశేషాలు...


temple 
ప్రస్తుతం అలంపూర్‌గా పిలవబడుతున్న ఈ గ్రామం పూర్వ కాలంలో హలంపుర, హతంపుర, అలంపురం అని స్థల పురాణాలలో హేమలాపురమని ఈ గ్రామం వ్యవహరించబడిం దని శాసనాలను బట్టి తెలుస్తోంది. ఉర్దు రికార్డులలో అల్పూర్‌, అలంపూర్‌ అనే పేర్లతో వ్రాయబడి ఉన్నది. భారత ప్రభుత్వం అర్ష శాఖ వారు సేకరించిన డాక్టర్‌ ె.ఏ నీలకంఠశాస్ర్తి ప్రకటించిన గురజాల బ్రహ్మి శాసనంలో అలంపూర్‌ ప్రస్తావన ఉంది. నడుకస్రి అనే వాడు తన ఆయుష్షు పెరగడం కోసం భగవంతుడైన అలంపుర స్వామిి (బాలబ్రహ్మేశ్వర) కొంత భూమిని దారాదత్తం చేశాడు. గ్రామ దేవత అయిన ఎల్లమ్మ పేరుతో ఎల్లమ్మపురంగా ఉండి రానురాను అలంపురం, అలంపూర్‌గా మారడం జరిగింది.

స్థల పురాణంలో హేమలాపురం, ఎల్లమ్మపురంగా ఉండేది. అలంపూ ర్‌ దేవాలయంలో తోటను ఆనుకొని ఉన్న గుంతలో తవ్వకాలు జరిపినప్పుడు శతవాహనంలో నాణ్యాలు, పూసలు, దక్షిణవర్త శంఖం, అందమైన గాజులు, నలుపు, ఎరుపు రంగు పూత వేయ బడిన చిన్న మట్టి పాత్రలు, నలుచెదరం 21 అంగుళాల పొడవు వెడ ల్పు ఉన్న ఇటుకలు బయటపడడం వల్ల ఈ ప్రదేశంలో శ్రీ జోగుళాంబ అమ్మవారి ఆలయం నిర్మించారు.

శ్రీశైల క్షేత్ర పశ్చిమ ద్వారమే ఈ అలంపుర క్షేత్రం...
బాదామి చాళుక్యులు అలంపూర్‌లో నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు. ‘‘పరమే శ్వర’’ అనే బిరుదుతో పాలించిన రెండవ పులేశి కాలంలో ఈ ఆలయ నిర్మాణం మొదలైంది. అలాగే బ్రహ్మేశ్వరుని గుడి ఆవరణలోని మ్యూజియంలో విజయాదిత్యుడు వేయించిన శాసనం ఉంది. స్వర్గ బ్రహ్మాలయ ద్వార పాలకుని మీద వినయాదిత్యుని కాలం నాటి శాసనం ద్వారా చరిత్రకు తెలియని ఒక లోకాధిత్యుడు కనిపించడం జరుగుతుంది. ఆర్క బ్రహ్మా లయంలోని మంటప స్తంభంపై ఒకటవ విక్రమాదిత్యుని భార్య శాసనం ఉంది.అలంపూర్‌ ప్రాంతాన్ని క్రీశ 566 నుంచి 757 సంవత్సరం వరకు బాదామి చాళుక్యులు పరిపాలించారు. నవబ్రహ్మ ఆలయాల నిర్మాణాల్లో ఎర్ర ఇసుక రాళ్లను వాడడం జరిగింది.

temp 
ఈ రాతిని కర్నూల్‌ జిల్లా శాతనకోట గ్రామం నుంచి తెప్పించారు. శ్రీ కృష్ణదేవరాయలు క్రీశ. 1521 సంవత్సరంలో రాయచూర్‌ను సాధించి బాలబ్రహ్మేశ్వర స్వామికి, శ్రీ నరసింహస్వామికి దాన ధర్మాలు చేశారు. దక్షిణపదంలోని ప్రాచీన శైవ క్షేత్రాల్లో శ్రీశైలం పురాణ ప్రసిద్దమైంది. ఆ మహా క్షేత్రానికి నాలుగు దిక్కులు, నాలుగు ద్వారాలు ఉన్నాయి. అవి తూర్పున త్రిపురాంతకం, దక్షిణాన సిద్దవతం, పశ్చిమాన అలంపురం, ఉత్తరాణ ఉమమహేశ్వరం. పశ్చిమద్వారంగా ఉన్న ఈ క్షేత్రం భాస్కర క్షేత్రమని, పరుశరామ క్షేత్రమని దక్షిణ కాశీ అని పిలువడం జరుగుతుంది.

కాశీ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని కాశీలో గంగానది, విశ్వేశ్వరుడు, విశాలాక్షి, 64 ఘట్టాలున్నాయి. దగ్గరలో త్రివేణి సంగమం కూడా ఉంది. అలంపూర్‌లో తుంగభద్ర, బ్రహ్మేశ్వరుడు, జోగుళాంబ, పాపనా శిని, మణికర్ణికలు 64 ఘట్టాలు ఉన్నాయి. దగ్గరలో కృష్ణ, తుంగభద్ర నదులు కూడా కలవు. పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్టించినందువల్ల ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడని పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రంలో విశేషంగా బ్రహ్మమూర్తులు ఉన్నారు. ఇక్కడి లింగం ‘‘జ్యోతిర్‌జ్వాలమయం’’. దీన్ని పూజించిన వారు అంతు లేని పుణ్యం పొందుతారు.

సంతాన ప్రదాయిని... ఎల్లమ్మ
cota-temp 
ఈ ప్రాంతంలో జమదగ్ని ఆశ్రమం ఉండేది. ఆయన భార్య రేణుకదేవి ప్రతిరోజు నదికి వెళ్లి ఇసుకతో కుండను తయారు చేసుకుని వాటితో నీరు తీసుకొని వచ్చేది. ఒకరోజు మహ రాజు వెయ్యి మంది భార్యలతో అక్కడికి వచ్చి జలక్రీడలు ఆడు తుండగా చూసిన రేణుక తన మనసులో రాజు వైభవాన్ని, అత ని భార్యల గురించి అనుకోవడం వలన మనోవికారం కలుగు తుంది. అందువల్ల ఆ రోజు ఇసుక కుండ తయారు కాదు. దాంతో రేణుక ఆలస్యం చేసి నీరు తీసుకురానందువల్ల జమదగ్ని కోపగించి ఆమెను చంపమని కొడుకులను ఆజ్ఞాపిస్తాడు.

తల్లిని చంపడానికి పెద్ద కుమారులు ఎవ రూ ముందుకు రారు. కానీ పరుశురాముడు మాత్రం తల్లి తలను నరికి తండ్రికి సంతోషాన్ని కలిగిస్తాడు. అప్పుడు జమదగ్ని సంతృప్తి చెంది ఏం వరం కావాల ని అడుగగా పరుశురాముడు తల్లిని బ్రతికించమని ప్రార్థిస్తాడు. రేణుక తల చాండల వాటికలో పడడం వల్ల బ్రతికించడం కష్టమని, ఈ తల ఎల్లమ్మ పేరు తో గ్రామదేవతల పూజలు అందుకుంటుందని జమదగ్ని చెప్పడం జరిగింది. మానవపాడు మండ లం ఉండవెల్లి గ్రామంలో గుడి కట్టించి గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ పూజించు కోవడం జరుగుతోంది. ఆమె శరీరం బ్రహ్మేశ్వర ఆలయంలో సంతానం లేని స్ర్తీలచే పూజలందుకుని సంతానం ఇచ్చే దేవతగా ఉంటుందని జమదగ్ని అనుగ్రహించాడు. ఇప్పటికీ భూదేవి పేరుతో స్ర్తీలతో పూజలందుకుంటుంది.

శక్తిపీఠం... జోగులాంబ ఆలయం...
నవ బ్రహ్మ ఆలయాల్లో బాలబ్రహ్మే శ్వరుడు ప్రధాన దైవం. ఈ దేవాల యం క్రీశ 702 సంవత్సరంలో నిర్మించడం జరిగిందని స్థల పురాణాలను బట్టి తెలుస్తోంది. రెండవ ద్వారమే ఆలయ ప్రధాన ద్వారంగా ఉంది. దీనికి రెండువైపులా బ్రహ్మ అర్ధనారీశ్వర మూర్తులున్నారు. స్వామికి అఖండ దీపరాధానం, నిత్యపూజ, నైవేద్యాలు, శ్రావణ కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు, శివరా త్రి సమయంలో రథోత్సవం జరుగుతుంది. 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠంగా పిలువబడుతున్న జోగుళాంబ అమ్మవారి ఆలయం, అలంపూర్‌, శ్రీశైలం, ద్రాక్షారామం, పిఠాపురంలు నాలుగు మనరాష్ట్రంలోనే ఉండడం గమనార్హం.

అమ్మవారి దేవాలయం క్రీ.శ 7వ శతాబ్దంలో నిర్మించారు. 9వ శతాబ్దంలో ఆదిశంకరుడు, శ్రీ చక్రి ప్రతిష్ట చేసింది మొదలు నేటికీ భక్తుల పూజలు అందుకోవడం జరుగుతోంది. క్రీశ 14వ శతాబ్దంలో ముస్లింలు దండయాత్ర చేసి అమ్మవారి దేవాలయం ధ్వంసం చేశారు. స్థాని కులు అమ్మవారి విగ్రహాన్ని, బాలబ్రహ్మేశ్వర ఆలయంలో చిన్న గుడిలో పెట్టి పూజించేవారు. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయల కుమారుడు దేవరాయలు తండ్రి ఆజ్ఞాను సారం సైన్యంతో వచ్చి బహమనీ సైన్యాలను తరిమికొట్టి అలంపూర్‌ క్షేత్రాలను రక్షించాడు.

temples 
ఈ సంఘటన 1390 లో జరిగిందని చరిత్ర చెబుతోంది. 600 సంవత్సరాల తరువాత జగదాంబ ఇష్టానుసారం పాత ఆలయం ఉన్నచోట అదే వాస్తు ప్రకారం కొత్త దేవాలయాన్ని నిర్మించిన దేవదాయ, ధర్మాదాయ శాఖ పాత విగ్రహాన్ని ప్రతిష్టించారు. నవబ్రహ్మ ఆలయాల్లో కుమార బ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, తారకబ్రహ్మ, పద్మబ్రహ్మ అనే నవ బ్రహ్మ ఆలయాలు ఈ ప్రాంతంలో నిర్మించారు.

జోగుళాంబ ఆలయానికి 2002 ఏప్రిల్‌ 8న కంచి శంకరాచార్య శ్రీ జయేంద్ర సరస్వతీ, విజయేంద్ర సరస్వతీ స్వా ములు శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణం 2004లో ముగిసింది. 2005 ఫిబ్రవరి 13న శృంగేరి శివగంగాపీఠాధిపతి శ్రీ సచ్చిదానంద భారతి చేతుల మీదుగా అమ్మవారి పునఃప్రతిష్ట నిర్వ హించబడింది.దేవాలయ నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ, ధర్మాదాయ శాఖ స్థాపతుల పర్యవేక్షణలో జరిగింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈ దేవాలయం నిర్మాణానికి, ప్రతిష్ట కార్యక్రమానికి రూ. 2 కోట్లు వెచ్చించారు. కృష్ణా, తుంగభద్ర సంగమ క్షేత్రం అలంపూర్‌కు సమీపంలో ఉంది. శ్రీశైలం ఆనకట్ట, నీటి నిల్వ ఆలంపూర్‌ వరకు ఉంటుంది. కనుక కృష్ణా, తుంగభద్ర నదుల నీరు దాదాపు 5 నెలలపాటు నిలిచి ఉంటుంది. కృష్ణా, తుంగభద్ర రెండు నదులకు పుష్కరాలు వచ్చినప్పుడు అలంపూర్‌లో భక్తుల కోలాహలం తో కిటకిటలాడుతుంది.

ఇలా వెళ్ళాలి...
సికింద్రాబాద్‌ నుంచి కర్నూల్‌ రైలు మార్గంలో ఈ ప్రాంతం కలదు. కర్నూల్‌ నుంచి బస్సు సౌకర్యం కలదు. రాష్ట్రం నలుమూల నుండే కాకుండా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల కు చెందిన రవాణా సంస్థలు కూడా కర్నూలు, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు బస్సు లు నడుపుతున్నాయి. కర్నూలు నుండి ఇక్కడికి గం ట గంటకు బస్సులుంటాయి. విమాన ప్రయా ణీ కులకు దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్‌.

- రమేష్‌, అలంపూర్‌

No comments:

Post a Comment