విహారాలు

India

Gamyam

Thursday, August 5, 2010

కాకతీయుల కళా వైభవానికి ప్రతీక ... ఓరుగల్లు

kakatiya 
చుట్టూ పచ్చిక బయళ్లు... ఆపై జలజల పారే సెలయేళ్లు... దానికి మించి చారిత్రక ప్రాశస్థ్యం గల కళా సంపదకు ఆలవాలమైన వరంగల్‌ (ఓరుగల్లు) ప్రాంతం... ఎన్నో శిల్పకళాఖండాలు, పురావస్తు కట్టడాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలను తన ఒడిలో నిక్షిప్తం చేసుకుని ప్రపంచ పర్యాటకులకు కనువిందు చేస్తూ విరాజిల్లుతోంది. కాకతీయుల కాలం శిల్పకళా పోషణకు పెట్టింది పేరుగా ఉండేది. ప్రజల్లో దైవ భక్తిని పెంపొందించడం కోసం శైవ దేవాలయాలను విరివిగా నెలకొల్పారు.తటాకాలు, చెరువులు, కుంటలు నిర్మించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించారు. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఓరుగల్లు... కాకతీయుల కాలం నాటి అపూర్వమైన వారసత్వ సంపద, సుసంపన్నమైన సాంస్కృతిక వైభవంతో అలరారుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఈ జిల్లా కాకతీయుల సామ్రాజ్య వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.

రెండు శతాబ్దాల పాటు మహోజ్వలంగా వెలుగొందిన కాక తీయాంధ్ర సామ్రాజ్య రాజధాని నగరంగా చారి త్రక ఔన్నత్యానికి ఓరుగల్లు గీటురాయి. ఈ జిల్లా అనేక విశి ష్టతలకు నిలయం. మార్కోపోలో నుండి మహాత్మాగాంధీ వరకు ఎందరో మహనీయులు ఈ నగరాన్ని సందర్శించారు. ఈ ఐతిహా సిక నగరం తెలంగాణా ప్రాంగణానికి మకుటాయమానం. వరంగల్లు జిల్లా కు ఉత్త రాన కరీంనగర్‌, దక్షిణాన నల్గొండ, తూర్పున ఖమ్మం, పశ్చిమాన మెదక్‌ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఓరుగల్లు సముద్రమట్టానికి 90 అడుగుల ఎత్తులో ఉంది.

17 డిగ్రీల 19’ నుండి 19 డిగ్రీల 36’ ఉత్తర అక్షాం శాలకు, 78 డిగ్రీల 49’ నుండి 80 డిగ్రీల 43’ తూర్పు రేఖాంశాలకు మధ్య నెలకొని ఉంది. 2846 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ జిల్లా పారిశ్రామికంగా, వ్యవసా యికంగా అభివృద్ధి సాధించేందుకు అవసరమైన వనరులు, అటవీ సంపద, ఖనిజ సంప ద పుష్కలంగా ఉన్నాయి. ఆనాటి కాకతీయ రాజులు తవ్వించిన అందమైన సరస్సులు ఇప్పటి కీ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి. రామప్ప, లక్నవరం, పాకాల, గణపురం చెరువులు ఈ నాటికి జిల్లా వాసులకు సాగు, త్రాగు నీరును అందిస్తున్నాయి. ఈ జిల్లా పర్వత శ్రేణులు, దట్టమైన అరణ్యాలు, వాగులు, వంకలతో అలరారుతోంది.

కాకతీయుల కాలం నాటి సామాజిక జీవితం...
jatara కాకతీయుల కాలం ఒక స్వర్ణ యుగం. ఆనాటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవన స్థితిగతులు వారి ప్రాచీన కట్టడాలు, శిల్పకళా ఖం డాలు ఈ నాటికీ పర్యాటకులను ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. ఒక పక్క కత్తులు కదనరంగంలో కదం తొక్కితే మరో పక్క కవుల రచ నలు సాహితీ రంగంలో స్వేచ్ఛా విహారం చేశాయి. ఇంకో పక్క కళాకారులు, శిల్పులు తమ ప్రతిభా పాటవాలతో అచ్చెరువొందే చిత్ర విచిత్రాలెన్నో సృష్టిం చారు. సమత, మమ తలతో కూడిన సమైక్య జీవన సౌందర్యం ఇక్కడ పరిఢవిల్లింది. అంగ ళ్ళలో రతనాలను రాశులుగా పోసి అమ్మిన ఆ కాలంలో ప్రజలందరూ సుఖ సంతో షాలతో సహజీవనం సాగించారని చరిత్ర చెబుతోంది.

ఓరుగల్లు చారిత్రక ప్రాశస్త్యం...
తెలుగు తేజానికి, జాతి చైతన్యానికి ప్రతీకగా విలసిల్లిన వరంగల్లు జిల్లా... సుమారు వెయ్యేళ్ళ సుదీర్ఘ చరిత్రను తనలో నిక్షిప్తం చేసుకుంది. అనేక చారి త్రక కట్టడాలు, అపురూపమైన శిల్ప సంపదతో... పురావస్తు పరిశోధకులు, ప్రకృతి సౌందర్యోపాసకులు, కవులు, చరిత్ర కారులకు ఉత్సుకత రేకెత్తించే విహార భూమిగా పేరెన్నిక గన్నది.

temple-warఅడుగడుగునా ఆనాటి కాకతీయుల స్వర్ణయుగాన్ని ఈ జిల్లా స్ఫురణకు తెస్తుంది. మొదటి బేతరాజు, పశ్చిమ చాళుక్యుల సామంతుడుగా... క్రీ.శ. 1000 నుండి 1030 వరకు, అనం తరం ఆయన కుమారుడు ప్రోలరాజు 1108 నుండి 1116 వరకు, క్రీ.శ. 1158 నుండి 1195 వరకు రుద్రదేవుడు, క్రీ.శ. 1195 నుండి 1198 వరకు ఆయన సోదరుడు మహదేవుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన రాణి రుద్రమదేవి, ఆమె దౌిహత పుత్రుడు ప్రతాప రుద్రుడు ఓరుగల్లులో శిల్ప కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలను పరిపుష్టం చేశారు.

తరగని శిల్పకళా సంపద...
కాకతీయ శిల్పం ఒక అద్భుత సృష్టికి సాక్షాత్కారం. ఇంతటి విశిష్టమైన కళా ఖండాలు భారతదేశంలో మరెక్కడా కానరావు. ఈ శిల్ప సంపదలో, నిర్మాణ వైఖరిలో ఏకత్వం ప్రముఖంగా కనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలలో వేటిని చూసినా ఇది కాకతీయులదే అని సులభంగా చెప్పగలిగే ప్రత్యేకత వీటిలో ప్రదర్శితమవుతుంది. అందుకే 11-13 శతాబ్దాల మధ్య కాలంలో ఒక ఉద్యమంగా వికసించిన ఈ కళ కాకతీయ శిల్పంగా గుర్తింపు పొంది వరంగల్లు జిల్లా అనేక సుప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతాలకు నిలయంగా మారింది. ఇక్కడి కట్టడాలు, సుందర ప్రదేశాలు, చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. ప్రాచీన కళాఖండాలు అబ్బురపరుస్తాయి.

శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం... వరంగల్‌ కోట...
తెలుగు వైభవాన్ని దశదిశలా రెపరెపలాడించిన కాకతీయుల రాజధాని నగరం ఓరుగల్లు. అప్పటి వైభవోపేత సామ్రాజ్యపు ఆనవాళ్లుగా మిగిలిన నేటి శిథిలాలలో దక్షిణ భారతదేశంలోనే అపురూపమైన వాస్తు శిల్పకళ దర్శనమిస్తోంది. ఇక్కడి అందమైన సరస్సులు, నిన్నటి చారిత్రక ప్రాభవా నికి నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వరంగల్‌, హన్మకొండ, కాజీపేట అనే మూడు పట్టణాల సంగమమే నేటి వరంగల్‌. కళలు, శిల్ప కళ, ప్రకృతి సోయగాల ఆరాధకులకు అద్భుతమైన కనువిందు ఓరుగల్లు.

చూడాల్సిన ప్రదేశాలు...
వరంగల్‌ జిల్లాలో అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. వరంగల్‌ కోట, ఖుష్‌మహల్‌, వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళీ దేవాలయం, కాజీపేట దర్గా, ఫాతిమా చర్చ్‌, మెట్టుగుట్ట రామలిం గేశ్వర స్వామి దేవాలయం, జూపార్క్‌ తదితర ప్రదేశాలున్నాయి. 13వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతి దేవుడు, ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి నిర్మించిన ఈ శత్రు దుర్భేధ్యమైన కోట... అందంగా తీర్చిదిద్దిన కమాన్‌లతో విరాజిల్లుతోంది.

temple-front19 కిలోమీ టర్ల పరిధిలో ఉన్న ఈ కోటలో 45 బురుజులు, స్తంభాలున్నాయి. చుట్టూ మూడు కోటల మధ్య విస్తరించిన ఈ కోట మధ్యభాగంలో భూదేవి ఆలయం, స్వయం భూదేవి ఆలయం ఉన్నాయి.హైదరాబాద్‌ నగరానికి చార్‌మినార్‌ వలె వరంగల్‌ పట్టణానికీ, కాకతీయ సామ్రాజ్యానికీ ప్రతీకగా కోట సింహద్వాంం ఏకశిల నెలకొని ఉంది.

ఈ కోటను పురావస్తుశాఖ నూతన ఒరవడులతో పునర్నిర్మించింది. కాకతీయుల కాలంలో నిర్మించిన శిల్ప సంపద శిథిలా వస్థకు చేరుకోగా దాన్ని కాపాడడంలో భాగంగా కొటలోని సింహ ద్వారాన్ని పునరుద్ధరించి నాటి శిల్పాలను నూతన పద్ధతిలో అమర్చారు. వరంగల్‌, హన్మకొండ పట్టణాలను కలుపుతూ 19 కిలోమిటర్ల మేర ఈ కోట విస్తరించి ఉంది. శత్రుదుర్భేద్యమైన ఏడు ప్రాకారా లు కలిగిన మట్టికోట, రాతికో టలతో కూడిన వరంగల్‌ ఖిల్లా శిల్పకళల కాణాచిగా అలరారుతోంది. ఇక్కడ ఎటు చూసినా 20 కిలోమీటర్ల వరకు పరిసరా లు కనిపిస్తాయి. దీనిపై సైనికులు అప్రమ త్తంగా ఉండి శత్రువుల రాకను పసిగ ట్టేవారట. ప్రపంచ తెలుగు మహా సభలు మొదలుకొని, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరిగే పలు ఉత్సవాలకు కాకతీయ కళా తోరణాన్ని లోగోగా వాడడం విశేషం.

ఖుష్‌మహల్‌...
temple గత వైభవానికి సాక్షిగా సితాబ్‌ఖాన్‌ నిర్మించిన అపురూప కళాఖండం ఖుష్‌ మహల్‌. ఇది వరంగల్‌ కోటకు దగ్గరలో ఉంది. పరిసర ప్రాంతాల నుండి వెలికి తీసిన విగ్రహాలు, ఆనాడు యుద్ధంలో వాడిన పరికరాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ప్రకృతి అందాల్లో దిట్ట మెట్టుగుట్ట...
కైలాసాన శివుడు కొలువుదీరి ఉన్న సమయంలో మునుల కోరిక మేరకు సిద్ధేశ్వ రునిగా వెలిసెదనని అభయమిస్తూ... మడి కొండలోని గుట్టపై శివుడు వెలి శాడని చరిత్ర చెబుతోంది. మెట్టు గుట్టపై శివుడు వెలిసినందునే ఈ గుట్టను మెట్టుగుట్ట అని, మెట్టు రామప్ప అని, దక్షిణ కాశీ అని పిలు స్తున్నారు. సుమారు 55 ఎకరాల విస్తీర్ణం, రెండు ఎతె్తైన శిఖరాలు, 50 అడుగుల ఎత్తులో ఉండి చూపరులను ఇట్టే ఆకట్టు కుంటున్నాయి. మెట్టుపై పాలగుండం, జీగి గుండం, వామ గుండం, బ్రహ్మ గుండం, కన్ను గుండం, ఇలా నవగుండాలు నేటికీ దర్శన మిస్తాయి. ఒకదానిపై ఒకటి పేర్చినట్లు
ఉండే గుండ్రని పెద్ద బండరాళ్ళు మెట్టుగుట్టపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. భీముడు, హిడింబి ప్రేమించుకొని విహరిం చారని అందుకే దీన్ని హిడింబాశ్రమం అని పిలుస్తున్నా రని ప్రతీతి.

భద్రకాళి దేవస్థానం...
వరంగల్‌ పట్టణ నడిబొడ్డున ఉన్న భద్రకాళీ చెరువు కట్టను ఆనుకొని శ్రీ భద్రకాళి- భద్రేశ్వ రుల దేవాలయం ఉంది. భద్రకాళీ తటాకం నగర ప్రజల దాహార్తిని తీరుస్తుండగా... శ్రీ భద్రకాళీ
మాత భక్తుల పాలిట ఇలవేల్పుగా కోరిన వారికి కొంగు బంగార మై కోటి వరాలిచ్చే వరప్రదాయినీగా భాసిల్లుతోంది. ఈ చారిత్రక ఆలయాన్ని దర్శించడానికి వివిధ ప్రాంతాల నుండి నిత్యం వందలాది మంది భక్తులు వస్తారు. ఎతె్తైన కొండపై నిలిచిన అమ్మవారు, సుందరమైన ప్రకృతి రమణీయత, మరోవైపు తటాకంతో కలిసి ఉండి ఈ దేవాలయం ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడుతుంది.

ఈ దేవతను పూర్వం ఆంజనేయుడు పూజించాడనీ, భద్రములు ఇవ్వడం వల్ల భద్రకాళి అనే పేరు వచ్చిందని చెబుతారు. కాల ప్రభావంలో ఈ దివ్యక్షేత్రం కొంతకాలం మరుగున పడింది. చాళుక్య చక్రవర్తి కాలంలో భద్రకాళి ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలు న్నాయి. కాకతీయుల కాలంలో ఈ క్షేత్రా న్ని అభివృద్ధి చేసి ఆరాధించారు. 1950 లో నూతన దేవాలయాన్ని నిర్మించారు. గర్భాలయం, ముఖ మండపం ఇందులో ఉన్నాయి.

warngal-hallonsసుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఆంజనేయుడు, శివ పార్వతులు ఉన్నారు. శివలింగాన్ని తర్వాత ప్రతిష్టించారు. భద్రకాళీ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా భక్తులతో కిటకిట లాడుతూ అభివృద్ధి చెందుతోంది. విజయవాడలో ఇంద్రకీలాద్రి కొండపై కొలువైన అమ్మవారిలాగానే ఇక్కడ భద్రకాళీ అమ్మవారు భక్తుల పూజలను అందు కుంటోంది. పేరుకు భద్రకాళి అయినా శాంతరూపంలోనే భక్తులకు దర్శనమిచ్చి అభయాన్ని, రక్షణ ను ఇస్తోంది. ఈ అమ్మవారి వద్ద ఏ కోరిక కోరినా ఫలిస్తోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కాకతీయుల కాలం నాటి శిల్పకళావైభవమే కాకుండా వరంగల్‌ నగరం కూడా దానికి తగిన రీతిలో పర్యాటక రంగంలో అభివృద్ధి సాధిస్తోంది. గత రెండు దశాబ్ధాల కాలంలో వరంగల్‌, హన్మకొండ, కాజీపేట ఎంతో అభివృద్ధిని సాధించాయి. తెలంగాణ జిల్లాలకే విద్యాకేంద్రంగా వెలుగొందుతోంది వరంగల్‌ నగరం. కాకతీయ విశ్వవిద్యాలయం, కాకతీయ మెడికల్‌ కాలేజి, భారతదేశంలోనే ఎంతో గుర్తింపు సాధించిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ (ఎన్‌.ఐ.టి)లు ఎందరో ప్రతిభావం తులను అందిస్తున్నాయి. చారిత్రక ప్రాశస్త్యంతో పాటు, ఆధునికరంగాల్లో కూడా ముందుకు దూసుకుపోతున్న వరంగల్‌ మున్ముందు దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

tempఆనాటి కాకతీయ రాజులు తవ్వించిన అందమైన సరస్సులు ఇప్పటికీ జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నాయి.రామప్ప, లక్నవరం, పాకాల, గణపురం చెరువులు ఈ నాటికి జిల్లా వాసులకు సాగు, త్రాగు నీరును అందిస్తున్నాయి.గిరిజనుల ఆరాధ్యదైవం సమ్మక్క-సారక్క ఉత్సవాలు జిల్లాలో అత్యంత వైభవంగా జరుగుతాయి. జిల్లాలోని మేడారంలో జరిగే ఈ వేడుకలకు తెలంగాణ జిల్లాల నుండే కాకుండా రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ వేడుకలు ఓరుగల్లుకు మరింత శోభను చేకూర్చుతున్నాయి.

ఇలా వెళ్లాలి...
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి 135 కి.మీ. దూరంలో ఉన్న ఓరుగల్లు జిల్లా (వరంగల్‌)లో చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశాలు, మనస్సును దోచే ప్రకృతి అందాలు అబ్బురపరిచే శిల్ప కళా సంపదను చూడాలంటే రైలు, రోడ్డు మార్గం గుండా వెళ్లవచ్చు. హైదరాబాద్‌ నుండి కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ నగరాలకి చేరుకోవడానికి గంటగంటకి బస్సు సౌకర్యం ఉంది. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్‌, బెంగుళూరు, చెనై్న నగరాల నుండి కాజీపేట్‌, వరంగల్‌ల మీదుగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎక్‌ప్రెస్‌ రైళ్ళు, ప్యాసింజర్‌ రైళ్ళు అందుబాటులో ఉంటాయి. దూరప్రాంతం నుండి వచ్చే పర్యాటకులకు దగ్గరి విమానాశ్రయం హైదరాబాద్‌.

వేయిస్తంభాల గుడి... శిల్ప కళకు ఒడి...
statues కాకతీయుల కాలంలో నిర్మించిన వేయి స్తంభాల దేవాలయం, నేటికీ శిల్ప కళా సంపదతో శోభిల్లుతోంది.పర్యాటకులను ఆహ్లాదపరుస్తూ అలరి స్తోంది. హన్మకొండ పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం నేటికీ దేశ విదేశా లకు చెందిన పర్యాటకులకు కనువిందు చేస్తోంది. కాకతీయుల శిల్ప, సాంస్కృతిక సంపదకు తార్కాణంగా నిలుస్తూ నిత్యం వందలాది మంది భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. వీటికి తోడు ఈ దేవాల యం... సినిమా చిత్రీకరణకు సెంటిమెంట్‌గా మారడంతో ఈ మధ్య కాలం లో షూటింగ్‌లతో కళకళలాడుతోంది. కాకతీయుల వాస్తు నిర్మాణ శైలి, కళా విశిష్టతకు నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ దేవాలయాన్ని నిర్మించి తొమ్మిది శతాబ్దాలయినా నేటికీ సజీవ కళతో ముచ్చట గొలుపుతూ అలరిస్తోంది. క్రీ.శ.1158 నుండి 1195 వరకు కాకతీయ సింహాసనాన్ని అధిష్ఠించిన రుద్రదేవుడు దీన్ని నిర్మించాడు. స్వతంత్ర రాజ్యస్థాపనకు చిహ్నంగా తనతో రుద్రేశ్వరుడిని, వాసుదేవుడిని, సూర్యదేవుడిని హన్మకొండలో ప్రతిష్టించి ఈ త్రికూటాలయాన్ని వేయి స్థంభాల మండపంతో సుందరంగా నిర్మించాడు. దీనికి తూర్పు దిశలో శివాలయ ద్వారానికి ఎదురుగా సూర్య దేవుని విగ్రహం, దక్షిణ ముఖంగా వాసుదేవుని విగ్రహం ఉంటాయి. రుద్రేశ్వ రాలయ ముఖ ద్వారంపై మనోహరమైన తోరణ శిల్పమున్నది.

canel-boatవీటితో పాటు నర్తించే శిల్పాలు, రంగ మండప స్తంభాలు, లోపలి కప్పు, ఆలయ రాతి గోడ, మందు భాగంలో నంది, త్రికూటాలయాల మధ్యనున్న నల్లరాతి చెక్కడాలు, వలయాకార దర్పణంలా కనబడుతాయి. దానిపై పడిన సూర్య కాంతి గర్భగుడిలో వెలుగును నింపుతుంది. రుద్రేశ్వర స్వామి (వేయి స్థంభాల) దేవాలయం నిత్య పూజాదులతో శోభిల్లుతోంది.

నిత్యార్చనలు, అభిషేకాలు, ఏడాది కాలంలో సంప్రదాయ పర్వదినాలైన కార్తీక పౌర్ణమి, మహా శివరాత్రి, శనిత్రయోదశి, వినాయక నవరాత్రి ఉత్సవాలు, శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు.హైదరాబాద్‌ నగరానికి చార్‌మినార్‌ వలె వరంగల్‌ పట్టణానికీ, కాకతీయ సామ్రాజ్యానికీ ప్రతీకగా కోట సింహద్వాంం ఏకశిల నెలకొని ఉంది. ఈ కోటను పురావస్తుశాఖ నూతన ఒరవడులతో పునర్నిర్మించింది. కాకతీయుల కాలంలో నిర్మించిన శిల్ప సంపద శిథిలా వస్థకు చేరుకోగా దాన్ని కాపాడడంలో భాగంగా కొటలోని సింహ ద్వారాన్ని పునరుద్ధరించి నాటి శిల్పాలను నూతన పద్ధతిలో అమర్చారు.
- మాదిరాజు రాజేశ్వర్‌రావు,వరంగల్‌

No comments:

Post a Comment