ప్రపంచంలోని జంతుజాలం అంతా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నదా... అనే సందేహం... నాగర్హోల్ నేషనల్ పార్క్ను సందర్శించిన ప్రతి ఒక్కరికీ కలుగకమానదు. ఎందుకంటే... దేశంలో మరే ఇతర పార్క్ల్లో లేని విధంగా ఇక్కడ ఎన్నో అరుదైన జంతు, పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. అంతేకాకుండా వృక్షసంపదలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ పార్క్. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్గా గుర్తింపు పొందిన ఈ పార్క్కు ఏటా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దేశీయ పర్యాటకులే కాకుండా... విదేశీ పర్యాటకులను సైతం ఈ పార్క్ అమితంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకుల సందర్శన నిమిత్తం అటవీశాఖ ప్రత్యేక సఫారీలు కూడా ఏర్పాటు చేసింది. పలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి జీవజాలంపై ఎన్నో పరిశోధనలు చేపట్టాయి. అలాంటి అరుదైన జాతీయవనాన్ని మనమూ దర్శిద్దాం...
రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ గా పేరొందిన నాగరోహోల్ నేషనల్ పార్క్ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్. కర్నాటకలోని మైసూర్ నగరానికి 94 కిమీల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం కొడగు జిల్లా నుండి మైసూర్ జిల్లా వరకు వ్యాపించి ఉంది. బందీపూర్ నేషనల్ పార్క్కి వాయువ్యంగా ఉన్న నాగరోహోల్ నేషనల్ పార్క్కి బందీపూర్ నేషనల్ పార్క్కి మధ్యనున్న కబినీ రిజర్వాయర్ ఈ రెండు పార్కులనీ విడదీస్తుంది. మాజీ మైసూర్ పాలకులు దీనిని ప్రత్యేకమైన హంటింగ్ రిజర్వ్ (పరిరక్షించబడిన వేట ప్రాంతం) గా ఉపయోగించేవారు. దట్టమైన చెట్లతో కప్పబడిన ఈ అటవీ ప్రాంతంలో చిన్న వాగులూ, లోయలూ, జలపాతాలూ దర్శనమిస్తాయి. కర్నాటక రాష్ట్రంలోని వన్యప్రాణులను సంరక్షిస్తోన్న ఈ పార్క్ 643 చకిమీ మేర వ్యాపించి ఉన్నది. బందీపూర్ నేషనల్ పార్క్ 870 చకిమీ, మదుమలై నేషనల్ పార్క్ 320 చకిమీ. వాయనాడ్ వైల్డ్లైఫ్ శాంక్చురీ 344 చకిమీ తో కలిపి మొత్తం 2183 చకిమీ మేర వ్యాపించి ఉన్న ఈ స్థలం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ స్థలం.
‘నాగ’ అంటే ‘పాము’, ‘హొలె’ అంటే ‘వాగు’ అన్న రెండు పదాల నుండి నాగరోహోల్ అన్న పదం పుట్టింది. 1955లో స్థాపించబడిన ఈ పార్క్ దేశంలో అత్యుత్తమంగా నిర్వహించబడుతోన్న పార్కులలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడి వాతావరణం ఉష్ణంగా ఉండి, వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాఘ్ర-క్రూరమృగాలు సరైన నిష్పత్తి ఉన్న ఈ పార్క్లో బందిపూర్ కంటే పులి, అడవిదున్న, ఏనుగుల జనాభా అధికంగా ఉంటుంది. నీలగిరి బయోస్ఫియర్ (జీవావరణము) రిజర్వ్లో ఈ పార్క్ ఒక భాగం. పడమటి కనుమలు, నీలగిరి సబ్ క్లస్టర్ (6,000 చకిమీ), నాగరోహోల్ నేషనల్ పార్క్ - ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదం పొందడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ పరిగణనలో ఉన్నాయి.
విశాల వనం...
ఈ అడవి వెస్టర్న్ ఘాట్స్ పర్వత పాదం నుండి కొండ వైపు... అలాగే దక్షిణం వైపు కేరళ వరకు వ్యాపించి ఉన్నది. ఈ అడవి వృక్షసంపద గురించి చెప్పాలంటే దక్షిణ భాగాన తేమతో కూడిన డెసిడ్యూస్ (కాలానుగునంగా ఆకులు రాల్చు) అడవి (టెక్టోనా గ్రాండిస్, డల్బెర్జియా లాటిఫోరియా), తూర్పు భాగాన, పొడిగా ఉండే ఉష్ణారణ్యం (రైటియా టింక్టోరియా, అకేషియా), ఉపపర్వత లోయలో బురదతో కూడిన అడవి (యూజనియా) ఉన్నాయి. ఎర్రకలప, టేకు, గంధం, సిల్వర్ ఓక్ ఈ ప్రాంతంలో ముఖ్యమైన వృక్షసంపద. బందీపూర్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న దక్షిణ భాగాలు సాధారణంగా వాయువ్య భాగాల కంటే పొడిగా ఉంటాయి.జంతు, వృక్షజాలం...
నాగర్హోల్లో ఏనుగుల జనాభా ఎక్కువ. పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు అధికంగా కనిపిస్తాయి. అడవిదున్న, సాంబార్ జింక, చీతల్ (మచ్చలున్న జింక), కామన్ మున్జాక్ జింక, నాలుగు కొమ్ముల జింక, మౌజ్ జింక, వైల్డ్ బోర్ (అడవి పంది) లాంటి గిట్టలున్న జంతువుల మీద పెద్ద క్రూరమృగాలు ఆహారం కోసం ఆధారపడతాయి. గ్రే లంగూర్స్, లయన్ టేల్డ్ మకాక్స్, బోన్నెట్ మకాక్స్ ఈ పార్క్లోని ఆదిమ జాతులుగా చెప్పవచ్చు. పార్క్ బయట, చుట్టూ వ్యాపించి ఉన్న కొండలలో నీలగిరి టార్స్, నీలగిరి లంగూర్స్ కనపడతాయి. దక్షిణ భాగాన ఉండే ఉష్ణం, తేమతో కూడిన మిశ్రమమైన డెసిడ్యూస్ అడవుల నుండి, తూర్పు భాగాన ఉండే బురద కూడిన కొండ లోయ అడవుల వరకు చాలా భిన్నంగా ఉంటాయి.
పొడిగా ఉండే డెసిడ్యూస్ అడవిలో టేర్మినాలియా టర్మెన్టోసా, టెక్టోనా గ్రాండిస్, లాజస్ట్రోమియా లాన్సివొలాటా, టేరోకార్పస్ మార్సపియం, గ్రూవియా తిలేఫోలియా, దళ్బెర్జియా లాతిఫోరియా మరియు ఎంజీసుస్ లాతిఫోరియా మొదలగు వృక్ష జాతులతో కూడిన వృక్షసంపద ఉన్నది. ఇతర వృక్ష జాతులలో లాజస్ట్రోమియా మైక్రోకార్పా, అదీనా కొర్డిఫోలియా, బొంబాక్స్ మలబార్సియం, స్క్లీషేరా ట్రైజూగా, ఫైకస్ జాతికి చెందినా వృక్షాలు కనిపిస్తాయి. పొదలు, మొక్కలు, పొదలలో పెరుగుతూ కనపడే జాతులు - కైడియా కాలిసినా, ఎంబికా అఫీషినాలిస్ మరియు గ్మేలీనార్బోరియా. సోలానం, డేస్మోడియం, హెలిక్టర్స్ అతిగా వృద్ది చెందు లాంటానా కామరా, యూపటోరియం లాంటి పొదలు అధికంగా కనిపిస్తాయి. బురదతో కూడిన అడవి భాగంలో యూజనియా అధికంగా కనిపిస్తే, తేమతో కూడిన డెసిడ్యూస్ అడవుల్లో సాధారణంగా కనపడే ఎనోజీసస్ లాటిఫోరియా, కాసియా ఫిస్ట్యూలా, బూటియా మోనోస్పెర్మా, డెన్డ్రోకాలమస్ స్ట్రిక్టస్, రైటియా టింక్టోరియా, అకేషియా , లాంటి వృక్ష జాతులు పొడిగా ఉండే డెసిడ్యూస్ అడవుల్లో కూడా కనపడతాయి. ఎర్రకలప, టేకు వృక్షాలే కాక, వాణిజ్యపరంగా ముఖ్యమైన వృక్ష జాతులు, గంధం, సిల్వర్ ఓక్ కూడా కనపడతాయి.
అతి ముఖ్యమైన జాతులైన పులి, ఇండియన్ బైసన్ లేదా గౌర్ (అడవి దున్న), ఏషియన్ ఏనుగులు చాలా పెద్ద మోతాదులో పార్క్ లోపల కనిపిస్తాయి. వైల్డ్ లైఫ్ కాన్సర్వేషన్ సొసైటీకి చెందిన ఉల్హాస్ కారంత్ నాగరోహోల్ అడవుల్లో చేసిన అధ్యయనం ప్రకారం... ఆసక్తికరంగా, వేటాడే జాతులకి చెందిన జంతువులు పులి, చిరుత అడవికుక్కలు సమతుల్యమైన సాంద్రత కలిగి ఉన్నాయని తేలింది. ఈ పార్క్లో తోడేళ్ళు, బూడిద రంగు ముంగిస, ఎలుగుబంట్లు, చారల సివంగి, మచ్చల జింక లేదా చీతల్, సామ్బర్ జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల జింక , అడివి పందులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇతర క్షీరదాలైన కామన్ ఫాం సివెట (పునుగు పిల్లి జాతి), బ్రౌన్ మాన్గూస్, స్ట్రైప్డ్ నెక్డ్ మాంగూస్ (ముంగిస జాతి), బ్లాక్ నేప్డ్ హేర్ (చెవుల పిల్లి లేదా కుందేలు జాతి), ఇండీన్ పాంగోలిస్ (పొలుసులతో కూడిన చీమలు తిను జంతువు), రెడ్ జైంట్ ఫ్లాఇంగ్ స్క్విరల్ (ఉడుత జాతి), ఇండియన్ పోర్సుపైన్ (ముళ్ళ పంది జాతి), ఇండియన్ జెయింట్ ఫ్లైయింగ్ స్క్వారెల్ (ఉడుత జాతి) వంటి వివిధ జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.
పక్షి విహంగానికి అనువైన కేంద్రం...
ముఖ్యమైన విహంగ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్క్లో 270 జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి. వీటలో శీఘ్రంగా అంతరించిపోతున్న జాతులకి చెందిన ఓరియంటల్ వైట్ బాక్డ్ వల్చర్ (రాబందు జాతి), వల్నరబుల్ లెస్సర్ అడ్జూటంట్ (బెగ్గురు కొంగ జాతి), గ్రేటర్ స్పాటెడ్ ఈగల్ (గద్ద జాతి), నీలగిరి వుడ్ పిజియన్ (పావురం జాతి) వంటి పక్షులు ఉన్నాయి. దాదాపుగా ఆపదకి గురయ్యే జాతుల్లో డార్టర్స్ (కొంగ జాతి), ఓరియంటల్ వైట్ ఐబిస్ (కొంగ జాతి), గ్రేటర్ గ్రే హెడెడ్ ఫిష్ ఈగల్ (గద్ద జాతి), రెడ్ హెడెడ్ వల్చర (రాబందు జాతి) వంటి పక్షులు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. స్థల విశిష్టమైన జాతుల్లో బ్లూ వింగ్డ్ పారాకీట్ (చిలుక జాతి), మలబార్ గ్రే హార్న్ బిల్ (వడ్రంగి పిట్ట జాతి), వైట్ బెల్లీడ్ ట్రీపై (కాకిజాతి) వంటి ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇక్కడ కనపడే కొన్ని పక్షుల్లో వైట్ చీక్డ్ బార్బెట్, ఇండియన్ స్కైమైటార్ బాబ్లర్ ఉన్నాయి. పొడి ప్రదేశాలలో సాధారణం గా కనపడే పేయింటెడ్ బుష్ క్వైల్ (కొలంకి పిట్ట), సర్కీర్ మల్ఖొవా, ఆషి ప్రైనియా (పిచ్చుక జాతి), ఇండియన్ రాబిన్ (పాలపిట్ట జాతి), ఇండియన్ పీఫౌల్ (నెమలి జాతి) యెల్లో లెగ్డ్ గ్రీన్ పిజియన్ (పావురం జాతి) లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.రకరాకాల పాములు...
సాధారణంగా కనపడే సరీసృపాలలో వైన్ స్నేక్, కామన్ వుల్ఫ్ స్నేక్, రాట్ స్నేక్, బాంబూ పిట్ వైపర్, రసెల్స్ వైపర్ (సెంజెర జాతి), కామన్ క్రైట్ (కట్లపాము జాతి), ఇండియన్ రాక్ పైథాన్ (కొండ చిలువ జాతి), ఈందియన్ మానిటర్ లిజార్డ్, కామన్ టోడ్... ఇక్కడ కనపించే పాము జాతులు. బెంగళూరుకి చెందిన ‘అశోకా ట్రస్ట్ ఫర్ రిసెర్చ్ ఇన్ ఇకాలజి అండ్ ది ఎన్వైరన్మెంట్’ కి చెందిన పరిశోధకులు ఈ ప్రాంతంలోని కీటకాల జనాభాకు సంబంధించిన బయొడైవర్సిటీ (జీవ భిన్నత్వం) పై విస్తృతమైన అధ్యయనాలు చేశారు. ఈ పార్క్లో కీటక జీవ భిన్నత్వంలో 96 జాతులకు చెందిన డంగ్ బీటిల్స్ ( పేడపురుగులు) 60 జాతులకు చెందిన చీమలు కూడా ఉన్నాయి. అసాధారణ జాతులుగా గుర్తించిన చీమలో హార్పెగ్నథొస్ సాల్టేటర్ అనబడే, ఎగిరే చీమలను గుర్తించారు. ఇవి ఒక మీటరు యెత్తున ఎగరగలవు. టెట్రాపోనేరా రూఫోనిగ్ర జాతికి చెందిన చీమలు అడవికి ఆరోగ్యసూచకంగా ఉపయొగపడవచ్చు, ఎందుకంటే... ఇవి చెదపురుగులని తిని బ్రతుకుతాయి. చచ్చిన చెట్లు ఉండే ప్రాంతాలలో ఇవి పుష్కలంగా కనిపిస్తా యి. ఏనుగు పేడ మీద మాత్రమే బ్రతికే హీలియోకొప్రిస్ డొమి నస్, ఇండియాలోని అతిపెద్ద పేడపురుగు (ఆం థొఫేగస్ డామా) కామన్ డంగ్ బీటిల్, చాలా అరుదుగా కని పించే ఆంథొఫేగస్ పాక్టోలస్ కూడా ఇక్కడి పేడ పురుగుల జాతు ల్లో ఉన్నాయి.హాయి... హాయిగా సఫారీ యాత్ర...
బెంగళూరుకి సుమారు 220 కి.మీ. దూరంలో ఉన్న ముర్కల్ అతిధి గృహాలలో పర్యాటకులకు అటవీశాఖ విడిది ఏర్పాటు చేసింది. పార్క్లోని కార్యాలయం దగ్గర కూడా వసతి ఉన్నది. అటవీశాఖకు చెందిన వాహనాలలో రోజుకి రెండుసార్లు, అంటే వేకువఝామున, సాయం సమయంలో సఫారి యాత్ర ఏర్పాటుచేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం తరచూ విద్యా శిబిరాలు నిర్వహిస్తారు. ఇంకా అటవీశాఖ పాఠశాల విద్యార్థుల పర్యటన కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుండడం విశేషం. అయితే జంతువుల కలయిక కాలంలో, వర్షాకాలంలో సఫారి యాత్రలు లేకుండా పార్క్ని మూసివేస్తారు. ట్రాఫిక్ కదలికలను ప్రొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టడి చేసి అడవికి ఇరువైపులా ఉండే గేట్లని మూసివేస్తారు.



కొద్దిసేపటికి మేము ఆర్చ్ రాక్ చేరుకున్నాము. భూమి నుండి 142 అడుగుల ఎత్తులో ఉన్న ఇది సున్నపు రాతితో ఏర్పడి ఒంపు తిరిగిన చిన్న శిలాతోరణం లాంటిది. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద నుండి క్రిందికి చూస్తే ఈ దీవికి మూడు ప్రక్కల నీల వర్ణంలో ఒక అనంత సాగరంలా విస్తరించి ఉన్న హురాన్ సరస్సు, దీవి చుట్టూ మెలికలు తిరిగిన రహదారి కనువిందు చేస్తాయి. ఇంత అద్భుతమైన దృశ్యం మరెక్కడా చూడలేమనిపించింది. తర్వాత మా బండి చివరి మజిలీ అయిన మెకినా కోట వద్ద ఆగింది. అమెరికన్ విప్లవ కాలం (1780)లో బ్రిటిష్ వారిచే నిర్మించబడిన ఈ కోట 1815 సంవత్సరంలో అమెరికా వశమై, 1895 వరకు వినియోగంలో ఉందని, సివిల్ వార్లో పాల్గొన్న వలంటీర్లు ఇక్కడ శిక్షణ పొందారని చెప్పారు.



'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' చూడ్డానికి ఉదయం ఆరు గంటలకు డబ్లిన్ నుండి బయల్దేరాం. కారుతో పాటు జి.పి.యస్. (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) కూడా అద్దెకి తీసుకున్నాం. దానికోసం మరో 20 యూరోలు అదనంగా చెల్లించాలి. జి.పి.యస్. పరికరంలో మనం బయలుదేరిన ప్రదేశం, మన గమ్యస్థానం మార్క్ చేస్తే సాటిలైట్ ద్వారా అదే మనకు దారి చూపుతుంది.
బయల్దేరిన రెండున్నర గంటల్ల్లోనే (ఉదయం 8.30కి) క్లిఫ్స్ ఆఫ్ మొహర్ చేరుకున్నాం. ఈ ప్రదేశం ఐర్లాండ్లోని మరొక ముఖ్య పట్టణం గాల్వే సమీపంలో సముద్ర తీరంలో ఉంది. క్లిఫ్స్ అంటే నీటితో నిలువుగా కోయబడి, ఏర్పడిన రాతి కొండలని అర్థం. ఈ క్లిఫ్స్ సాధారణంగా సముద్ర తీరాన ఉన్న పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి.
శ్రీరంగపట్టణం... విజయనగర సామ్రాజ్య కాలం నుండి పుణ్యే త్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అంతేగాక మైసూ రు రాజ్య రాజధానిగా కూడా విశేష సేవలందించింది ఈ నగరం. రంగ రాయ మహారాజును ఓడించిన వడ యార్ రాజు 1610లో శ్రీరంగపట్ట ణాన్ని వశపరుచుకున్నాడు. విజయ నగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్ రాజును విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, అందువల్ల వడయార్ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ప్రచారంలో ఉంది. రాజా వడయార్ రంగరాయను ఓడించిన తరువాత 1610లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు. అప్పటినుండి ఇక్కడ నవరాత్రి ఉత్సవా లను ఎందో వైభవోపేతంగా జరపడం ఆనవాయితీగా మారింది. అప్పటినుండి మైసూర్ దసరా ఉత్సవాలకు ఒక గుర్తింపు వచ్చింది. చాముండేశ్వరీ దేవిని కొలుస్తూ... పదిరోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు దేశంలోనే ఎంతో పేరుప్రఖ్యాతులను సంతరించుకున్నాయి.
1610లో రాజా వడయార్ వశపరుచున్న శ్రీరంగపట్టణం 1947లో భారత్కు స్వాతంత్య్రం సిద్ధించేవరకు మైసూర్ రాజధానిగా వెలుగొందింది. రాజా వడయార్ తరువాత, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం... మైసూరు రాజ్యానికి రాజధాని అయ్యింది. టిప్పు సుల్తాన్ తన రాజ్యానికి ‘ఖుదాదాద్ సల్తనత్’ లేదా ‘సల్తనత్ ఎ ఖుదా దాద్’ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్టణాన్ని రాజధాని చేసుకుని, దక్షిణ భారత్ లోని చాలా ప్రాంతా లను తన రాజ్యంలో కలుపు కున్నాడు. ఇండో - ఇస్లామీ య నిర్మాణ శైలిలో టిప్పుసుల్తాన్ సమాధి, టిప్పూ ప్యాలెస్, దరియా దౌలత్, జుమ్మా మసీదు లాంటి నిర్మా ణాలు ఈ నగరానికి శోభను చేకూర్చుతున్నాయి. ఇలాం టి ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించి తనదైన శైలి పరి పాలనతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన టిప్పు సుల్తాన్ 1799 లో తన సొంత అనుచరగణం విద్రోహ చర్యవల్ల శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్ వారిచే చంపబడ్డాడు.
మైసూర్ పర్యటన పూర్తిచేసుకొని శ్రీరంగపట్టణంలో అడుపెట్టగానే ఎన్నెన్నో చారిత్రక నిర్మాణాలు ప్రకృతి రమణీయతలు స్వాగతం పలుకుతాయి. రంగనాథ స్వా మి దేవాలయంతో పాటు... టిప్పు సుల్తాన్ నిర్మించిన జుమ్మా మసీదు, అంతేకాకుండా రంగన్తిట్టు పక్షి అభ యారణ్యం, కరిఘట్ట శ్రీనివాస ఆలయం, దరియా దౌల త్ గార్డెన్, శివనసముద్ర జలపాతం లాంటి ఎన్నో ప్రదే శాలు విహారాన్ని జీవితాంతం గుర్తుండేలా చేస్తాయి.
బెంగుళూరు నగరానికి 139 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి ఓ విశిష్టత ఉంది. ఈ జలపాతం యొక్క ఎడమ భాగాన్ని గగనచుక్కీ అని, కుడి భాగాన్ని భారచుక్కీ అని పిలుస్తారు. వాస్తవానికి, భారచుక్కీ జలపాతాలు. గగనచుక్కీ జలపాతాలకు నైరుతి దిశలో కొన్ని కిలోమీటర్లు ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే కావేరీ నది కూడా ఉత్తర దిశలో కొన్ని కిలోమీటర్లు పశ్చిమ, తూర్పు భాగాల్లోకి విడిపోతుంది. పశ్చిమ భాగం ఫలితంగా గగనచుక్కీ జంట జలపాతాలుగా విభజించబడుతుంది. అలాగే తూర్పు భాగం ఫలితంగా భారచుక్కీ జలపాతాలు విభజించబడతాయి. గగనచుక్కీ జలపాతాలను శివనసముద్ర వాచ్ టవర్ నుండి చాలా దగ్గరగా వీక్షించవచ్చు. దక్షిణాది భాషలకు సంబంధిచిన చలనచిత్రాల్లోని జలపాత దృశ్యాలు చాలావరకు ఇక్కడివే కావడం విశేషం. గగనచుక్కీ జలపాతాలకు... దర్గా హజ్రాత్ మార్డాన్ గాయిబ్ నుండి మరొక మార్గం ఉంది. అక్కడ ఉంచిన హెచ్చరికలను పట్టించుకోకుండా, ప్రజలు రాళ్లపై నుండి కిందకి దిగి, వెనుక నుండి జలపాతాలను చూడటానికి ప్రయత్నిస్తున్నారు, దీనివల్ల ఇక్కడ అప్పుడప్పుడు పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.



హైదరాబాద్ నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ప్రతి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:30 - 6:00 గంటల మధ్య భద్రాచలం చేరుకుంటుంది. అక్కడే హరిత హోటల్లో బస. శబరీ నదీ స్నానం, కొండపై కొలువైన భద్రాద్రి రాముని దర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి 70 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణం. పర్ణశాల, ఇతర స్థానిక పర్యాటక కేంద్రాల సందర్శనాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది.
180 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ బోటులో సుమారు రెండున్నర గంటల మేర ప్రయాణం నిజంగా ‘హరిత’మయమేనని అనిపిస్తుంది. ఎందుకంటే... పచ్చగా అలరారే దట్టమైన అడవుల మధ్య పాయగా చీలిన గోదావరి అలలపై ఈ పడవ పర్యాటకులను తీసుకెళ్తుంది. సూర్యాస్త మయం వేళ, బంగారు రంగులో మెరిసిపోయే గోదావరి నదీ జలాలు, పర్వతాల బారుల వెనుక అస్తమించే సూర్యు డిని తిలకించడం ఓ అద్భుతమే..!
కొల్లూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పాపికొండల మధ్య వెలసిన పేరంటాల పల్లి శైవక్షేత్రం సందర్శన ఉంటుంది. ఏటా కార్తికమాసం, శివరాత్రి పర్వదినాల సమయంలో ఈ శైవక్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పేరంటాల పల్లి నుంచి హరితలోనే తిరుగు ప్రయాణం ఉంటుంది. లాంచీలో పోచవరం, అక్కడి నుంచి మళ్లీ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులో భద్రాచలం చేరుకుంటారు. పాపి కొండల ప్రయాణం మిగిల్చే మధు రానుభూతులతో హైదరాబాద్కు ప్రత్యేక బస్సులో తిరుగు ప్రయా ణం అవుతారు. ఇది జీవితంలో మరిచిపోలేని విహారంగా మగిలిపోతుంది.


ఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీశ 983వ సం వత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక. ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్ర హాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిం దే. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు. ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహు బలి పాదం ఎత్తుకు సరిపోతాం.
గోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.
మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని ృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.