విహారాలు

India

Gamyam

Thursday, July 8, 2010

విజయనగర సామ్రాజ్య వైభవం

statuesవిజయనగర సామ్రాజ్య వైభవానికి ప్రతీక చంద్రగిరి కోట. విజయ నగర యుగం నాటి సంస్కృతి, వైభవం సజీవంగా ఉట్టిపడే రాజ మహల్‌, రాణీమహల్‌, ఇతర కట్టడాలన్నీ చూపరులను ఆకర్షిస్తున్నా యి. తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న ఈ మహా కట్టడం 10 దశాబ్ధాలు పూర్తయినా నేటికి సజీవంగా చెక్కు చెదరని కళావైభవం కళ్ల కు కట్టినట్లు కనబడుతుంది. ప్రకృతి శోభలీలు సుందరమగు లోయ లో గంభీరమైన రాజప్రసాదాలు, సొంపైన తటాకాలు, శిలామండపాలు విజయనగర సామ్రాజ్య ప్రభువులకు మూడవ రాజధాని నగరమై విరాజిల్లిన చంద్రగిరి కోట అంటే నాటి వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యం.

పురాణ గాధలను అనుసరించి ఇక్కడ ఎతె్తైన ఒక కొండపై చంద్రుడు తపమాచరించి శివుడిని ప్రసన్నం చేసుకొని వరం పొందాడని అందువలన నాటి నుంచి చంద్రగిరి అనే పేరుతో ఈ ప్రాంతం ప్రాచుర్యా న్ని పొందింది. చరిత్రను అనుసరించి క్రీ.శ. 1000 సంవత్సరం నాడు చంద్రగిరి పట్టణానికి సమీపంలో ఉన్న నారాయణవనాన్ని పరిపాలిం చిన ఇమ్మడి నరసింహ యాదవ రాయులవారు ఈ కోట నిర్మించారు. ఈ కోట చుట్టూ ప్రాకారాలను అనుసరించి పెద్ద శిలలతో నిర్మించిన చదరపు రుజువులు ఉన్నాయి. కోట గోడలను ఆనుకొని అగడ్తలు ఉండేవి.

దుర్గానికి ఇరువైపులా ప్రవేశ ద్వారాలున్నాయి. స్థానిక చరిత్ర ప్రకారం చంద్రగిరి కోట 314 సంవత్సరాలు యాదవ రాజుల ఆధీన ములో ఉంది. చంద్రగిరి ప్రాంతానికి ప్రభువుగా ఉండి, ఆ కోటలోనే నివసించిన ఘనత అప్పటి యాదవరాజులకే దక్కింది. ఆ తరువాత హంపిలో విజయనగర చక్రవర్తులు శక్తి కోల్పోయి రాజ్యభారము వహించలేక శత్రువు విజయనగర సామ్రాజ్య ఆధిపత్య భారమును తీసుకొని పేరు ఘడించారు. నరసింహరాయుల కాలమున క్రీ.శ. 1565లో సంభవించిన రాకాతి తంగడి (తళ్లికోట) యుద్ధంలో విజయ నగర ప్రభువులు పరాజితులై గత్యంతరము లేక కర్నాటక రాష్ట్రానికి చెందిన హంపి నుంచి పెనుగొండ (అనం తపురం జిల్లా) చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి పట్టణానికి తరలించారు.

ఆ నాటి నుంచి చంద్రగిరి కోట పలు చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలచింది. క్రీ.శ. 1000వ సంవత్స రంలో ఇమ్మడి నరసింహ యాదవ రాయుల చే నిర్మించిన చంద్రగిరి కోటలో ఆముఖమై ఉన్న భవనాన్ని రాజమహల్‌ అని పేర్కొంటా రు. ఈ భవన నిర్మాణం అంచలంచెలుగా పూర్తి చేస్తూ 16వ శతాబ్ధం నాటికి ఈ కట్ట డం పూర్తయినట్లు చరిత్రకారుల అంచనా. మూడంతస్థులతో గంభీరంగా ఈ భవనం దర్శనమిస్తోంది. రాజమహల్‌ పైన ఉన్న మూ డు గోపురాలలో పెద్ద గోపురం 24 చదరపు అడుగుల వైశాల్యం గల దర్బారు మాలులోని మధ్య గోడలు లేని స్తంభ పంక్తి రెండంతస్థుల ఎత్తు వరకు ఉంది. ఈ ఏర్పాటు వలన దర్బారులో కి తగినంత గాలి, వెళుతురు వచ్చేందుకు అవకాశం ఏర్పడింది.

భవ నం పునాదులు రాతితోను, పై భాగాన్ని ఇటుక, కరక్కాయ, సున్నం, బెల్లం, కోడిగుడ్డులోని తెల్లసొన తదితర మిశ్రమాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో ఎక్కడా కూడా కలప వినియోగించకపోవ డం ప్రత్యేక విశేషం. పరదాల ఏర్పాటుకు కూడా గోడలలోనే ఏర్పాటు చేసి ఉంచారు. రాజమహల్‌పైన ఉన్న గోపురాల్లో ఏర్పాటు చేసిన రం ధ్రాలు లోపలివైపు బంగారు ఆభరణాలు, నిధులు నిక్షిప్తం చేయబడిన ట్లు స్థానికులు పేర్కొంటారు. ఇలా నాటి రాజుల వైభవాన్ని నేటికీ కళ్లకు కట్టినట్లు చూపించే మహల్‌ వైభవాన్ని తనివితీరా చూడాల్సిందే.

అంత ేకాకుండా పంచలోహ విగ్రహాలు శైవ, వైష్ణవ , జైన మతాలకు చెందిన శిలా కాంస్య నిర్మితమైన దేవతా ప్రతిమలు ఈ కోటలో ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచిన విజయనగర చక్రవర్తుల సేవకు గుర్తింపు గా శ్రీకృష్ణ దేవరాయులు, ఆయన దేవేరులు తిరుమలదేవి, చిన్నాంబిక లు, వెంకటపతిరాయులు, శ్రీరంగరాయులు తదితరుల శిలా ప్రతిమ లు సహజతత్వాన్ని ఉట్టిపడేలా కనిపిస్తాయి.దక్షిణ భారతదేశంలోని అ న్ని రాష్ట్రాల నుంచి తిరుపతి పట్టణానికి రైలు ప్రయాణ సౌకర్యం ఉంది. తిరుపతి నుంచి ఆర్‌టిసి బస్సులలో చం ద్రగిరి పట్టణానికి చేరుకోవచ్చు. తిరుపతి పట్టణానికి చేరువలో రేణిగుంట విమానా శ్రయం కూడా ఉండటం విశేషం. యాత్రి కుల సౌకర్యం కోసం చంద్రగిరి నుంచి రాజమహల్‌ పురావస్తు ప్రదర్శనశాలకు వెళ్లడానికి ఆటోలు, రిక్షాలు నడుస్తున్నాయి.

ఆకట్టుకుంటున్న అరుదైన ప్రదర్శన


paintings-exhibition

ఆంధ్రభోజుడుగా పేరుగాంచిన విజయనగర సామ్రాజ్యాదీశుడు శ్రీకృష్ణదేవరాయులు. స్వయంగా గొప్ప కవి, సాహితీవేత్త అయిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు, కన్నడ భాషలకు ఎనలేని కృషిచేశారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటిన శ్రీకృష్ణదేవరాయ పంచమ శతాబ్ది పట్టాభిషేక మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలలో భాగంగా నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రదర్శనశాలలో విజయనగర సామ్రాజ్య కాలానికి చెందిన నాణాలు, శాసనాలు, బంగారు, వెండి వస్తువుల ప్రత్యేక ప్రదర్శన మంగళవారం ప్రారంభమైంది.

కవి, సాహితీవేత్త అయిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద అనే తెలుగు గ్రంథాన్ని రచించి తెలుగు భాషకు ఎనలేని కృషిచేశారు. రాయల ఆస్థానంలో అష్టదిగ్గజములనే కవులు కొలువు తీరి ఉండేవారు. వారితే జరిపే సాహితీ గోష్టిని ‘భువన విజయం’ అని పిలిచేవారు. ఆయన కాలంలో వ్యవసాయాభివృద్దికి చెరువులు, కాలువలు, బావులు, ఆనకట్టలు నిర్మించినట్టు విదేశీ పర్యాటకులైన పీస్‌, ఎలియట్‌, న్యూనిజ్‌ తదితర రచనల ద్వారా తెలుస్తోంది. ఆయన పెనుగొండ, చంద్రగిరి, గుత్తి, గండికోట, హంపి తదితర ప్రాంతాల్లో టంకశాలలను ఏర్పాటుచేసి బంగారు,వెండి, రాగి లోహాలను ముద్రించి నాణాలను చలామణి చేశారు. ఆయన కాలం సాంఘీక, సామాజిక, ఆర్థిక రంగాలలో మహోన్నత స్థాయికి చేరి స్వర్ణయుగంగా పేరుగాంచింది.

ఆకట్టుకుంటున్న ప్రదర్శన...
statues-exibitionవిజయనగర కాలానికి చెందిన నాణాలు, శాసనాలు, బంగారు, వెండి వస్తువుల ప్రత్యేక ప్రదర్శనను మంగళవారం ఉదయం రాష్ట్ర సాంస్కృతిక శాఖ ప్రధాన కార్యదర్శి డా.యస్‌.చెల్లప్ప ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో 2.88 లక్షల నాణాలను ఏర్పాటుచేయడం విశేషం. ఇవి క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఆఖరి నిజాం (19వ శతాబ్దం) కాలానికి చెందినవి.

వీటిలో సుమారు 8000 బంగారు నాణాలు విజయనగర కాలానికి చెందినవి కాగా శ్రీకృష్ణ దేవరాయల కాలానికి చెందిన 2333 బంగారు నాణాలను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఈ నాణాలలో విశిష్టమైన నాణాలు సందర్శకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రదర్శనలో 75 తామ్ర శాసనాలలో 20 విజయనగర కాలానికి చెందినవి కాగా అందులో 8 శాసనాలను ప్రదర్శనలో ఏర్పాటుచేశారు. ఇక 2000 పంచలోహ, రాగి, ఇత్తడి లోహాలతో చేసిన విగ్రహాలు క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి క్రీ.శ.19వ శతాబ్దానికి చెందినవి కావడం విశేషం. వీటిలో సుమారు 500 విజయనగర కాలానికి చెందినవి కాగా వాటిలో కొన్నింటిని ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించిన దేవాలయాలు, కోటలు, శాసనాల ఛాయాచిత్రాలను సైతం ఏర్పాటుచేశారు.

No comments:

Post a Comment