విహారాలు

India

Gamyam

Monday, March 14, 2011

భాగ్యనగరానికి వన్నెతెచ్చిన గోల్కొండ కోట

అంతా ‘ధ్వని’ మాయ ..!
Fateh_Darwaazaహైదరాబాద్‌ పేరు చెప్పగానే... ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్‌, ఆ తరువాత గోల్కొండ కోట. కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌ షాహీల ఏలుబడిలో ఎంతో ఘనత వహించిన ఈ అద్భుత కోట రాష్ట్రానికే గాక, దేశంలో ప్రఖ్యా తిగాంచిన పర్యాటకకేంద్రంగా వెలుగొందుతోంది. భాగ్యనగరానికి వన్నెతెచ్చిన ఈ కోటలో ఇప్పటికీ అంతుబట్టని విషయాలెన్నో..! అందులో ఒకటి ఫతే దర్వాజా ధ్వని మాయ. శాస్త్ర విజ్ఞానానికీ అంతుచిక్కని ‘విజయ ద్వార’ రహస్యం ఇప్పటికీ ఓ వింతే...

నాలుగు వేరు వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో కలిపి 10 కిలోమీటర్ల పొడవుతో కూడిన గోడలు, 8 సింహ ద్వారములు, 4 వంతెనలు (డ్రా బ్రిడ్జి), లెక్కలేనన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలతో అలారారుతున్న గోల్కొండ కోట ప్రత్యేకత ప్రవేశద్వారం (ఫతే దర్వాజ) నుండే మొదలవుతుంది.

ఫతే దర్వాజా (విజయ ద్వారం)...
Golconda సింహద్వారాలలో అన్నింటికంటే కిందిది. అన్నింటికంటే బయటగా ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారం) నుంచే మనం గోల్కొండ కోటలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఔరంగజేబు విజయం తరువాత ఈ ద్వారం గుండానే తన సైన్యాన్ని నడిపించాడట. ఏనుగుల రాకను అడ్డుకునేందుకు కోటకు ఆగ్నేయ దిక్కున పెద్ద పెద్ద ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు.

ధ్వనిశాస్త్రంలో ఆరితేరిన నిపుణులచే నిర్మించిన ఈ ఫతే దర్వాజాను చూసిన ఎవరికయినా సంబ్రమాశ్చ ర్యాలు కలుగక మానవు. ఎందుకంటే... గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశం లో నిలబడి చప్పట్లు కొడి తే కిలోమీటరు అవతల ఉండే గోల్కొండ కోటలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బాలా హిస్సారు దర్వాజా వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషాన్ని ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతాలు తెలిపేందుకు ఉపయోగించేవారట. కానీ, ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా అది చరిత్రలో మిగిలిపోయింది.

బాలా హిస్సారు దర్వాజా...
Golconda1 అన్ని ముఖ ద్వారాలలోకెల్లా బాలా హిస్సారు దర్వాజా ఎంతో మనోహరమైంది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహ పు బొమ్మలు ఈ రక్షణ ద్వారానికి ప్రత్యేక అలంకా రాలుగా చెప్పుకోవచ్చు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళేందుకు 380 ఎగుడు, దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువా తనే మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపం కనిపిస్తుంది.

దర్బారు హాలుగా ఉపయో గించే ఈ కట్టడంలో 12 ఆర్చీలు, మూడు అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమైన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీల ద్వారా వెనుక ద్వారం తెరచుకుంటుంది. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనం కనిస్తుంది.

కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపంలో అబుల్‌ హసన్‌లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్ముతారు. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది. అదేంటంటే... జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమైన కూలరులాగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ కోట భాగ్యనగరానికి ప్రధాన విహారకేంద్రంగా వెలుగొందుతోంది.

కర్టసీ : సూర్య Daily

No comments:

Post a Comment