విహారాలు

India

Gamyam

Wednesday, November 30, 2011

ప్రకృతి కళా‘ఖండాలు’ ...ఖండాలా

http://www.indiahillstation.info/images/west-india-hill-stations/Khandala-hill-station.jpg
కనుచూపు మేర పచ్చదనం తప్ప మరేమీ కనపడని అద్భుత ప్రదేశం ఖండాల. భారతదేశంలోని ప్రధాన హిల్‌ స్టేషన్లలో ఖండాలా ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహానగరానికి 101 కిలోమీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో కొలువైయున్న ఖండాలాలో ట్రెక్కింగ్‌ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.




ప్రకృతి ప్రేమికులకు, కొత్త జంటలకు, ప్రేమికులకు స్వర్గధామంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాల పర్వత ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో ఖండాలా చత్రపతి శివాజీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అనంతరం బ్రిటీష్‌ వారి పాలన వచ్చాక... దక్కన్‌ పీఠభూమి, కొంకణ్‌ మైదానాల మధ్య గల రోడ్డు మార్గంలో గల భోర్‌ ఘాట్‌లో భాగమయ్యింది. బోర్‌ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలను కలిగి ఉండేవి. ముంబై-పూణే ఎక్స్‌‌‌రరపెస్‌ రైలు మార్గం, అలాగే ముంబై, పూణేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.

అందాల‘లోనవాలా’...

 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEil6NrQWioymlOkm4tBBd0UL7f286PhAwE840wZ1cgKvIIPqiQ2KoxcVI4qWehcxIZnsoCNbvZr5vOlQXnoppAHy-D5KR_lzIyo4arqIT4siTJbCLrmBRXH0NTXLcDQSOC3A5Tc-6_u_-U/s320/Karla+(6).jpg

ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో లోనవాలా అనే మరో ప్రఖ్యాత హిల్‌ స్టేషన్‌ కూడా చూడదగ్గది. ఖండాలాకంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి రమణీయత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు... తుగవులి, లోనావాలా, భుషి సరస్సుల హొయలు... ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశేషాలతో లోనావాలా అలరారుతుంటుంది.

రమణీయ కోట...రజ్‌మాచి...http://punetouristguide.com/images/places/Karlacaves.jpg

ముంబయి నుంచి లోనవాలాకు వెళ్లే మార్గ మధ్యంలో పర్వతాలు ప్రారంభమయ్యే చోట అందమైన ఓ ఉద్యానవనం వంటివి దర్శనమి స్తాయి. వాటిలో ముఖ్యమైనవి రజ్‌మాచి పార్క్‌, రజ్‌ మాచి కోట గోపురాలు. కోట దిగువ భాగంలో అతి పెద్దలోయ ఉంటుంది. ఆ లోయలోనే ఒక దేవాల యంతోపాటు హోటల్‌ కూడా ఉంటుంది. దానికి దగ్గ ర్లోనే చిన్నపిల్లల ప్రత్యేకంగా రూపొందించిన పార్క్‌ ఒకటి ఉంటుంది. దాని తరువాత వంద అడుగుల ఎత్తునుంచి కిందికి దుమికే ‘కునే’ జలపాతాలు కూడా చూడదగ్గవే. ఇవి ఖండాలాకు లోనవాలాకు మధ్యలో ఉన్నాయి. 
Lonavala & Khandala Tour Packages











ఇవేకాకుండా టైగర్స్‌లీప్‌, సాకుర్‌ ప్లాటియా, మంకీ హిల్‌, లోహ్గాడ్‌ దర్శన్‌, శివాజీ పార్క్‌, డ్యూక్స్‌నోస్‌ లాంటి అనేక పర్యాటక ప్రాంతా లు పర్యటనను మధురానుభూతులతో నింపుతాయి.
http://www.indianholidaytours.com/wp-content/uploads/2006/05/khandala-ghat.jpg
ఖండాలా ఎలా వెళ్లాలంటే...

 http://www.holidayiq.com/uploadimages/Khandala-1344_6.jpg

http://amitkulkarni.info/pics/lonavala/lonavala-images/P1010295.JPG
ఖండాలాలో ఎయిర్‌పోర్టు లేని కారణంగా, దానికి దగ్గర్లోని పూణే వరకు విమానంలో వెళ్లవచ్చు. అక్కడికి దగ్గర్లోని రైలు మార్గం ద్వారా 69 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లోనవాలా రైల్వే స్టేషన్‌ చేరుకోవచ్చు. లోనవాలాలో ముంబై-పూణే రైలు మార్గంలో ప్రయాణించే రైళ్లన్నీ అందుబాటులో ఉంటాయి. కాగా.. లోనవాలా నుంచి ముంబై చేరేందుకు కేవలం 3 గంటల సమయం సరిపోతుంది. అదే విధంగా లోనవాలా నుంచి పూణే వెళ్లాలంటే మాత్రం నాలుగు గంటలు ప్రయాణించాల్సిందే. ఇక బస్సు సౌకర్యం విషయానికి వస్తే.. ముంబై-పూణే మార్గంలో ఖండాలాకు అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

పురాతన గుహాలు గుర్లా,భజాhttps://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjQ4TG1203QyqlVcSi7M5wOjd7J9XqaQ4vDhU6Cv6DU443DU6DEzzZh5L7qzIcErMDQYicB0wtb-DMiTJIp52w8qiTdM8gP8mxVSkJ7J0arAQ9CZRuaFxPQSwqvL0AXz8uWQg0BUB50HgZ9/s1600/karla.JPG

ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువైయున్న కర్ల మరియు భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని రాతి ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించినట్లు తెలుస్తోంది. 
http://tourservicesindia.files.wordpress.com/2010/04/466454855_4193c1aeb4.jpg
అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్‌ పాయింట్‌... తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రదేశం. 
Lonavala & Khandala Tour Packages










ఇవే కాకుండా... ముంబయి నుంచి ఖండాలా ప్రయాణ మార్గంలో కూడా అనేక దర్శనీయ ప్రాంతాలు కానవస్తాయి. ఇలాంటి వాటిలో చారిత్రకమైన కోటలు, జలపాతాలు, సరస్సులు అనేకం ఉన్నాయి. 
http://lh6.ggpht.com/_G3YC6ed31bA/TMlNDyJFn5I/AAAAAAAAAFI/GBz86vyrAU8/Places%20to%20visit%20in%20Lonavala%5B6%5D.jpg

Sunday, November 27, 2011

లోయలో ప్రశాంతమైన ప్రకృతితో .... మనసు 'కదిలె'

'కదిలె' ప్రాంతం ఎంత బావుంటుందో తెలుసా? ఒకసారి రాకూడదూ'' అని బంధువులు చెబితే ఆదిలాబాద్ జిల్లాలోని ఆ ఊరికి మొన్న దీపావళి సెలవుల్లో వెళ్లాం. హైదరాబాద్‌లో ఉదయం 9 గంటలకు బయలుదేరిన మేము 210 కి.మీ. ప్రయాణించి.. మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్మల్ చేరుకున్నాం. అక్కడి నుంచి భైంసా రూటులో 12 కి.మీ. తిరిగి కుడివైపుకు మరో మూడు కిలోమీటర్లు వెళ్లగానే ఎత్తయిన సత్శల కొండలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. కొండల మధ్యలో నుంచి వెళుతూ.. రెండు మూడు పల్లెలు దాటిన తరువాత ఒక లోయలో ప్రశాంతమైన ప్రకృతితో మమ్మల్ని స్వాగతించింది.. 'కదిలె'.

రెండు ఎత్తయిన పర్వత సానువుల మధ్య జన్మించి.. జలజలా ప్రవహిస్తోంది ఒక సెలయేరు. ఇది పాపహరేశ్వరాలయం మీదుగా ఉత్తరం వైపు లోయమార్గంలోకి పరుగులిడుతోంది. ఈ సెలయేరుకు ఇరు వైపులా 50 మీటర్లకు పైగా ఎత్తున్న చెట్లున్నాయి. నీటి మధ్యలో కూడా పొడవాటి వృక్షాలు కనువిందు చేస్తున్నాయి. ఆలయానికి ఈశాన్యంలో సెలయేరుకు అడ్డంగా కట్టిన డ్యామ్ పైనుంచి దుముకుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తోంది. సెలయేరులో నడుచుకుంటూ ఒక ఫర్లాంగు దూరం వెళ్లగానే కుడివైపున ఒక ఆశ్రమం కనిపించింది. దాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఆ ఆశ్రమ స్వామీజీ.
ఆశ్రమం ముందు పెద్ద వట వృక్షాలు, వాటి చుట్టూ విశాలమైన ఆవరణ ఉంది. ఆశ్రమం దాటి ఆ సెలయేరు ఇంకా ఎంత దూరం ప్రవహిస్తుందో తెలియదు.
మేము మాత్రం ఇంకొంచెం దూరం నడిచి చిన్నపిల్లలకు కాళ్లు నొస్తాయేమోనని వెనుదిరిగాం. ఆకాశాన్ని తాకే చెట్ల మధ్య, పక్షుల కేరింతల మధ్య, నీటి గలగలల మధ్య నడవడం ఒక మధురానుభూతి. ఆ దృశ్యాలన్నిటినీ కెమెరాల్లో బంధించాం.

కదిలే శివలింగం..

ఆలయానికి తూర్పు వైపున తప్ప మిగతా అన్ని వైపులా ద్వారాలున్నాయి. ఉత్తరం వైపున్న ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన శృంగి, భృంగి విగ్రహాలున్నాయి. వాటిని దాటి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకు కోష్ట విగ్రహాలుగా బ్రహ్మ, గజానన, ఉమామహేశ్వరి, వరాహావతారం, విష్ణు విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయానికి ఆనుకుని ఈశాన్యంలో దక్షిణాభిముఖంగా అన్నపూర్ణ మాతా మందిరం ఉంది. ఆలయం ముందున్న నవరంగ మంటపంలో శిల్పకళతో అలరారే నంది విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నంది చెవిలో మన చెవి పెట్టి వింటే 'ఓం నమః శివాయ' అని వినిపిస్తుందని పూజారి చెప్పారు.

నాకు మాత్రం అక్కడి సెలయేరు సవ్వడి, పక్షుల కువకువలు, చెట్లపై వీస్తున్న గాలి చప్పుడే లౌడ్‌స్పీకర్‌లో పెట్టి వినిపించినంత స్పష్టంగా వినిపించాయి. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. అది కదులుతుంది. భార్గవ రాముడు తండ్రి ఆజ్ఞ మేరకు తల్లిని చంపిన తర్వాత పాపపరిహార నిమిత్తం దేశంలో 31 శివలింగాలను ప్రతిష్టించాక.. ఇక్కడికొచ్చి 32వ లింగాన్ని పెట్టాడట. అయితే ఈ శివలింగం కదలడంతో తనకు శివుడు ప్రసన్నుడైనాడని ఆయన భావించినట్లు చెబుతుంది స్థల పురాణం. వాస్తవంగా గుట్టల్లో నుండి ఉబికి వస్తున్న నీటిబుగ్గ చుట్టూ పానవట్టాన్ని బిగించి, సరిగ్గా ఆ బుగ్గపైనే శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో.. అది నీటి తాకిడికి కదులుతోంది. ప్రకృతి సౌందర్యానికి పవిత్రతను చేకూర్చేందుకే ఇలా చేశారనిపించింది.

ఆలయానికి దక్షిణంగా ఉన్న రెండు విశాలమైన గదుల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. భోజనం తీసుకువచ్చామన్నా మమ్మల్ని కూడా తినమన్నారు ఆలయ నిర్వాహకులు. అక్కడ భక్తులు తమ ఇష్టసిద్ధి కోసం యాగాలు చేస్తున్నారు. ఆలయానికి ఈశాన్యంలో విశాలమైన, చదునైన ఖాళీ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆవరణలోనే ఏటా శ్రావణమాసంలో 30 రోజులపాటు జాతర, శివరాత్రి సందర్భంగా మరో 3 రోజుల జాతర నిర్వహిస్తున్నారు.

18 చెట్ల వటవృక్షం..

ఆలయానికి కొంతదూరంలో 18 రకాల చెట్లు ఒకే మహా వటవృక్షంలో పుట్టి పెనవేసుకొని పెరిగాయి. ఈ వటవృక్షంలో మద్ది, మేడి, జీడి, వేప, రావి, టేవు తదితర చెట్లుండటం విశేషం. దాని చుట్టూ ప్రదక్షిణ పథం ఉంది. అందులో ప్రదక్షిణలు చేస్తూ.. వటవృక్షానికి నిర్ణీత సంఖ్యలో నూలుదారం చుట్టి.. దీని మొదలు దగ్గర పూజలు చేసినవారికి సంతానయోగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ వటవృక్షం దగ్గరికి ప్రతినెలా పౌర్ణమి, అమావాస్యల రాత్రి వెయ్యేళ్ల సర్పం వస్తుందని, దాన్ని చూసినవారు ఇక్కడ చాలా మందే ఉన్నారని చెపుతారు.

పాప హరిణి..

ఇక్కడున్న దేవుని పేరు పాపహరేశ్వరుడు. సామాన్యులు 'పాపన్న' అంటారు. భక్తుల పాపాలను హరించే దేవుడు కావడంతో ఆ పేరు వచ్చింది. ఈ దేవాలయమున్న కొండల పేరు సత్మల కొండలు లేదా నిర్మల కొండలు. సత్+మల అంటే 'మంచికొండలు' అని, నిర్మల అంటే స్వచ్ఛమైన కొండలు అని ఏదైనా అర్థం ఒకటే. ఈ ప్రదేశాన్ని దర్శించినవారికెవరికైనా ఇక్కడి కొండలు, లోయలు, చెట్లు, గాలులు ఎంత స్వచ్ఛంగా ఉన్నాయో, అవి మన ఆరోగ్యానందాలకు ఎంత ఉపకారం చేస్తాయో అనుభవంలోకి వస్తుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పే బోర్డులు కనిపిస్తాయి. అంగ వస్త్రాన్ని తీసేశాకే భక్తుల్ని లోపలికి అనుమతిస్తారు.

లోయలో ఉన్న ఈ ఆలయానికి పశ్చిమాన ఎత్తయిన పర్వతాలున్నాయి. అటు వైపు నుంచి వచ్చే చెడు గాలులు, కాస్మిక్ శక్తులను ఆ కొండలు ఆపి భక్తులను రక్షిస్తాయి. ఈ ప్రక్రియను సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో... పశ్చిమం వైపు 'శని' ఉంటాడని, ఇక్కడి దేవుడు అతని బారి నుండి భక్తులను కాపాడతాడని చెప్తారు. దేశంలో దేవాలయాలన్నీ తూర్పుకు అభిముఖంగా ఉండగా, ఇదీ, కాశ్మీర్‌లో ఉన్న మరొక ఆలయం మాత్రమే పశ్చిమాభిముఖంగా ఉన్నాయని చెపుతారు.

సప్తర్షి గుండాల వెనుక..

ఆలయం వెనుక పారుతున్న సెలయేరులో ఏడు గుండాలు ఉన్నాయి. వీటిని సప్తర్షి గుండాలని, జీడి గుండాలని కూడా పిలుస్తారు. ఔషధ మూలికలను కలుపుకొని వస్తున్న నీరు జీడి రంగులో ఉండడం వలన ఆ పేరు వచ్చింది. మొదటి గుండం పేరు ఋషి గుండం. ఇది 18 చెట్ల మహావృక్షం కిందుగా వస్తున్న నీటిసారంతో ఏర్పడింది. ఈ నీటిలో కొన్ని దినాలు స్నానం చేస్తే సంతానం కలుగుతుందని, సుఖరోగాలు నశిస్తాయని, ఈ నీటిని పంట పొలాలపై పిచికారీ చేస్తే చీడ పురుగులు నశించి దిగుబడి పెరుగుతుందని స్థానికుల విశ్వాసం. ఈ చెట్లన్నీ మన ప్రాచీనులు సంతాన సాఫల్యతకై చేసే ఆయుర్వేద చికిత్సలో మూలికలుగా వాడేవే కాబట్టి ఈ విశ్వాసం వెనుక శాస్త్రీయత కూడా ఉందేమో. ఉదాహరణకు, వేప కీటక నాశిని. మేడి చెట్టు ఇనుప ధాతువునిస్తుంది. ఈ రోజుకూ డాక్టర్లు గర్భిణులను ఎండిన మేడిపండ్లను (అంజీర్) తినమనడం, వాటి ధాతువులతో చేసిన ఐరన్ సప్లిమెంట్ మందు గుళికలు ఇవ్వడం గమనార్హం.

రెండవ గుండు పేరు సర్వ పాపనాశిని గుండం. ఆవు మూతిలో నుంచి వస్తున్న నీటితో ఒక మేడి చెట్టు కింద ఏర్పడింది ఈ గుండం. హిరణ్యకశ్యపుణ్ణి చంపిన అనంతరం నరసింహస్వామి చేతి గోళ్ల నుంచి రక్తం కారిపోతూనే ఉంటే లక్ష్మీదేవి మేడి ఆకుల రసం పోసి ఆ రక్తస్రావాన్ని ఆపిందని 'గురుచరిత్ర'లో ఉంటుంది. అలాంటి హీలింగ్ పవర్ ఉన్న చెట్ల నుంచి వస్తున్న నీటిలో స్నానం చేస్తే రోగాలు హీల్ (నయం) అవుతాయంటే నమ్మొచ్చేమో.

అత్తా కోడళ్ల గుండాలు..

మూడవ, నాల్గవ గుండాల పేర్లు శివార్చన గుండం, పాలగుండం. గర్భగుడిలో శివలింగానికి చేసిన అభిషేకపు నీటితో, పాలతో ఈ గుండాలేర్పడ్డాయని ఆ పేర్లు పెట్టారు. ఐదవ నీటి గుండానికి శివతీర్థ గుండమని పేరు. దీనికి ఉత్తరాన ఉన్న ఆరవ, ఏడవ గుండాలకు సూర్య చంద్ర గుండాలని పేరు పెట్టారు. సూర్య గుండంలోని నీరు వేడిగా, చంద్రగుండంలోని నీరు చల్లగా ఉంటుంది. అందుకే ఆ పేర్లు. ఈ రెండు గుండాలను స్థానికులు అత్తాకోడళ్ల గుండాలని కూడా అంటారు.

వాస్తు శిల్పాల చరిత్ర..

ప్రధాన ఆలయానికి కొంత దూరంలో మరో చిన్న ఆలయముంది. దాన్ని ధ్యాన మందిరం అని పిలుస్తున్నారు. ఆలయ గర్భగృహానికి ఇరువైపులా రెండేసి చిన్న గదులున్నాయి. ఆ గదులు ధ్యానం చేయడానికి ఉద్దేశించినవని చెపుతున్నారు. కాని సూర్యగుండం మెట్ల మీద, ప్రధానాలయం కోష్టాల్లో శివునితోపాటు బ్రహ్మ, విష్ణు, అన్నపూర్ణ -ఉమ, గణపతుల విగ్రహాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటే, ఈ ఐదు దేవతల మతాలను పంచాయతనం అంటారు కాబట్టి ధ్యాన మందిరంగా పిలుస్తున్న ఆలయం మొదట పంచాయతన ఆలయమే అని చెప్పడానికి ఎక్కువ ఆస్కారం ఉంది.

పైగా ఈ రెండు ఆలయాల శిఖరాలు, వాటికున్న ఎత్తయిన అరుగులు, స్తంభాలు చాళుక్యరీతిలో ఉన్నాయి కాబట్టి.. చాళుక్యులు పంచాయతన మతాలను పోషించారన్న వాదన సమర్థనీయంగానే కనిపిస్తోంది. చాళుక్యులు తెలంగాణను క్రీ.శ 560 నుంచి 753 వరకు ఒకసారి, క్రీ.శ.973 నుంచి 1160 వరకు మరోసారి పరిపాలించారు.
ఇక్కడి లింగం 32వదని, కర్నూలు జిల్లా యాగంటిలోని శివునితో సంబంధం కలదని స్థలపురాణం చెప్పడంలో ఓ ఆంతర్యం ఉంది. అదేమిటంటే- ఈ రెండు స్థలాల మధ్య చాళుక్యుల సామ్రాజ్యం విస్తరించడం.
ఇలా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన 'కదిలె' ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ తమ బాసర ఇక్కడికి 60 కిలోమీటర్లు. కుంటాల జలపాతం ఇక్కడికి 50 కిలోమీటర్లు. టూర్లలో భాగంగా చేర్చి ప్రచారం చేస్తే బాగుంటుంది.

- డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ, ఫోన్ 9440687250

Wednesday, November 23, 2011

ఇంద్రలోకాన్ని తలపించే... ఇండోనేషియా

 http://www.indonesiatravel.org.uk/gifs/indonesia-travel.jpg
పర్యాటకులకు స్వర్గధామం ఇండోనేషియా. 23 కోట్ల ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో హిందూ మూలాలు అనేకం... ఈ దేశంలోని బాలి పట్టణంలో 90% హిందువులు నివసించే ఎప్పటికీ వింతే... 30 లక్షల జనాభా ఉన్న బాలికి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యా టకులు వస్తుండటం విశేషం. 
http://www.worldwidehomestay.com/res/default/indonesiaborobud.jpg
హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో, అందమైన సెలయేళ్ళు, పచ్చని అడవుల ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఇండోనేషియా... అన్నీ దీవి పట్టణాలే... జకార్తా, బాలి, బాండుంగ్‌, మేడాన్‌... ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నాయి . మరి ఆ దీవుల్లో విహరిద్దామా..!

Art_Center_Bali 

ఇండోనేషియాలో జావా, సుమత్ర, సులవేసి, మలుకు, కాలీమంతన్‌, ఇరియన్‌ జయ అనే ఆరు ముఖ్యమైన దీవులున్నాయి. నిజానికి ఇండోనేషియా 14 వేల దీవుల సమాహారం అయినప్పటికీ... పైన చెప్పుకున్న ఆరింటిలో మాత్రమే జనావాసం ఉంది. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, జావా ద్వీపంలో ఉంటుంది. ఈనగరంతో పాటు సురబయ, బాలి, బాండుంగ్‌, మేడాన్‌, సెమారంగ్‌లు ఇక్కడి ప్రధానమైన ఇతర పట్టణాలు ఉన్నాయి.జకార్తాని 17వ శతాబ్దంలో జయకర్త అని పిలిచేవారట. అంటే... గొప్ప విజయానికి చిహ్నమైన నగరం అని దానర్థం.

అదే రానురాను వాడుకలో జకార్తాగా మారిపోయింది. జకార్తాలో చూడదగ్గ మ్యూజియంలు అనేకం ఉన్నాయి. ఇక్కడి జాతీయ ప్రదర్శనశాల, పపెట్‌ మ్యూజియం, టెక్స్‌టైల్‌ మ్యూజియం, స్టాంప్‌ మ్యూజియం, ఫ్రీడం మ్యూజియం.. లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఒకచోట ఇండోనేషియా చరిత్రను కళ్లకు కట్టినట్లు కనిపిస్తే, మరోచోట రకరకాల బొమ్మలు కనువిందు చేస్తాయి. ఇంకోచోట జాతీయ ఉద్యమ ఘట్టాలు, మరోచోట అక్కడి ప్రజల మత విశ్వాసాలు దర్శనమిస్తాయి. అయితే ఈ మ్యూజియంలు ఉన్న భవనాలన్నీ పురాతనమైనవే కావడం గమనార్హం.

జకార్తాలో చూడదగ్గ మరో ప్రాంతం నేషనల్‌ మాన్యుమెంట్‌. దీన్నే మోనాస్‌ అంటుంటారు. ఇదో పెద్ద స్తూపం. 137 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే దీనిపై వెలుగుతున్న దివిటీలాంటి నిర్మాణం ఉంది. 35 కిలోల బంగారంతో ఈ స్తూపాన్ని నిర్మించారట. దీన్ని ఆ దేశ స్వాతంత్య్రానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నగరంలోని మరో ఆకర్షణ తమన్‌ మినీ ఇండోనేషియా ఇండా అనే మీనియేచర్‌ పార్క్‌. దీన్ని చూస్తే, ఆ దేశం మొత్తాన్ని చూసినట్లే...! బీచ్‌లు, దీవులూ, మధ్యయుగంనాటి భవనాలు, చారిత్రక కట్టడాలు.. ఎన్నె ఎన్నెన్నో ఈ పార్కులో కొలువుదీరి ఉంటాయి.

పుష్పవనం... బోగోర్‌...

http://w22.indonetwork.co.id/pfimage/15/s_530715_foto_location.jpg
జకార్తాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే బోగోర్‌ పట్టణం కూడా పర్యాటక ప్రాంతమే. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పట్టణంలోని ప్రధాన ఆకర్షణ బొటానికల్‌ గార్డెన్‌. దీన్ని 1811వ సంవత్స రంలో సర్‌ స్టాన్‌ఫోర్డ్‌ రఫెల్స్‌ నిర్మించాడట. 

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEirxqrmITA2-1If-hH1bYQNT_3XMj0n5wlSTQg70SycULvrTHn03sugQY5BCT0nZyvs2Ay6RoW2ANs-lSSndpHnc8tSRhXUrCqpMuR2NeZYfZ8v6ptkqeqkFBTCzD5Yyh0oFZ9yrZ1sVwE/s1600/528px-Bunga_bangkai.jpg
ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం నుంచి అతి చిన్న పువ్వుదాకా ఈ గార్డెన్‌లో మనకు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో చిన్న చిన్న వెదురు వంతెనలు భలే తమాషాగా ఉంటాయి. ఈ గార్డెన్‌ మెయిన్‌ గేట్‌కు దగ్గర్లోనే ఒక జువలాజికల్‌ మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో దాదాపు 30 వేల స్పెసిమన్లు ఉంటాయి. స్టఫ్డ్‌ ఖడ్గ మృగం, వేల్‌ చేప, కొమొడొ డ్రాగన్‌లు మన చూపుల్ని కట్టిపడేస్తాయి.

locations 

దేవాలయాల విషయానికి వస్తే... ఈ బోగోర్‌ పట్టణంలో శివాలయం, సాయిమందిరం, కృష్ణుడి గుడి అంటూ హిందూ దేవతల ఆలయాలు చాలానే కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో భారతదేశం నుంచి వచ్చిన స్థిరపడినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇక్కడ హిందువులతో పాటు ముస్లిం ప్రజలు కూడా హిందూ పండుగలను జరుపుకోవడం. రామాయణం చదివే ముస్లింలు బోగోర్‌లో చాలామందే కనిపిస్తుంటారు.http://ilove-indonesia.com/wp-content/uploads/2010/11/Welcome-to-Bali.jpg
బాలి విహారం భలే.. భలే..
బాలి గురించి తెలుసుకోవాలంటే నెట్‌లో, పుస్తకాల్లో దొరికే సమాచారం కాదు అదంతా పర్యాటకులు వివరించాల్సిందే. మనదేశంలో వేళ్లూనుకొని ఉన్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలిలో కూడా ఉంది. ఇలాంటి సాంప్రదాయ సమాజాల్లో సంస్కృతీ సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ముఖ్యంగా స్ర్తీలే. గృహ జీవితంలో, పిల్లల పెంపకంలో, ఆహారం తయారు చెయ్యటంలో, ఇలా వివిధ నిత్య గృహ కృత్యాల్లో తమ చర్యల ద్వారా సాంప్రదాయాల్ను కొత్త తరానికి అందజేస్తుంటారు ఇక్కడి స్ర్తీలు. ఇండోనేషియాలోని జావా, లాంబాక్‌ దీవుల మధ్యనున్నది బాలి దీవి.
http://www.indonesiatravel.org.uk/gifs/bali-in-indonesia.jpg
మొత్తం 17వేల దీవులతో కూడిన ఇండోనేషియాలో బాలి అందం ప్రత్యేకత మరి దేనికీ లేదంటారు. బాలి తూర్పునుంచీ పశ్చిమానికి 140 కి.మీ., ఉత్తరం నుంచీ దక్షిణానికి 80 కి.మీ విస్తరించి ఉంది. అయితే తూర్పు నుంచీ పశ్చిమానికి నిప్పులు చెరిగే పర్వతాలు ఉండటం దురదృష్టంగానూ భావిస్తారు. వీటిలో అత్యంత పెద్దది గునుంగ్‌ అగుంగ్‌ పర్వతం 1963లో పేలి నిప్పు నది ప్రవహించింది. ఆ తర్వాత ఇంతవరకూ అలాంటవి సంభవించలేదు. ఈక్వేటర్‌కి ఎనిమిది డిగ్రీలు దక్షిణంగా ఉన్న ఈ బాలి వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు సీజన్లే ఉంటాయి. ప్రతీ సంవత్సరం చలి, పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాధారణంగా ఇక్కడ 28 డిగ్రీల సెల్సియస్‌ వేడిమి ఉంటుంది.భారీ వర్షాల కాలంలో పచ్చగా మెరుస్తూ మహాద్బుతంగా ఉంటుంది బాలి. ఎంతో మాగాణి భూమి కావడంతో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. బాలి దక్షిణాన కొండప్రాం తాల్లో ధాన్యం, ఉత్తర తీర ప్రాంతాల్లో కాఫీ, కూరగాయలు బాగా పండుతాయి.

ఇక్కడ హిందువులే అధికం...
అత్యధిక ముస్లిం జనాభా వున్న ఇండోనేషియాలోని బహు చక్కని దీవి బాలి. బాలిలో అత్యధికభాగం హిందువులే ఉన్నారు. దీన్ని దేవతల నివాసంగా పిలుస్తారు. అంత ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. 2.5 మిలియన్ల జనాభా లో 90 శాతం హిందువులే ఉన్నారు. తమను ప్రశాంతంగా ఉండేట్టు చేయమని, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరుతూ ప్రతీ ఇంటాపూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆ మంత్రోచ్ఛారణ అంతటా వినవస్తూంటుంది. ప్రతీ దేవాలయంలోనూ సాయింత్రాలు పూజలు, మంత్రాల పఠనంతో ఆ ధ్యాత్మిక వాతావరణం కట్టేస్తుంటుంది.
http://www.traveljournals.net/pictures/l/15/157387-hindu-statue-in-downtown-kuta-bali-indonesia.jpg
భజనల్లో అక్కడక్కడ సంస్కృత పదా లు వినపడుతూంటాయి. బాలి ప్రజల్లో మతం, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పలు దేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తూ పోతున్నప్పటికీ ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలకు మాత్రం ఎలాంటి ఆపదా కలగలేదు. ఇక్కడి ప్రధాన మతం ఆగమ హిందూ ధర్మం. 11వ శతాబ్దంలో సుమత్రా, జావాల్లో హిందూ ప్రచారం బాగా జరగడంతో బాలిలో ఆగమ హిందూ ధర్మం ఏర్పడింది. భారత దేశం నుంచీ వచ్చిన మతమే అయినప్పటికీ బాలిలో హిందు, బౌద్ధ, జావా మతాలు ఆచారంలో ఉన్నా యి. 15వ శతాబ్దంలో జావాకు ఇస్లాం రావడంతో అక్కడి కళాకారులు, సంగీతకారులు అనేకమంది బాలికి పారిపోయారంటారు. http://www.photoatlas.com/photo/indonesia_bali_01.jpg
పురాణాలంటే మహా ఇష్టం...
బాలి ప్రజలు ఎంతో సృజన సంపన్నులు. సంప్రదాయసిద్ధమైన శక్తి సామర్ధ్యా లు ఎక్కువగా మతపరమైన కార్యకలాపాలకే వినియోగిస్తారు. రామాయణం, భారతం పట్ల అపార భక్తి శ్రద్ధలున్నాయి. వాటిలోని కథలతో ఇక్కడి ప్రజలు స్పూర్తి పొందుతున్నారు. ప్రతీ పండుగ సందర్భం ఎంతో ఆనందంగా, కళాత్మకంగాచేసుకోవడం వారి ప్రత్యేకత. ప్రతీ పని, ప్రతీ అంశంలోనూ సౌందర్యం తొణికిసలాడుతుంది. వారిది కళా దృష్టి కావడమే అందుకు కారణం.
Sunset at Kuta, Bali
అందాల కుగ్రామం... కూటా... Sunset at Kuta, Bali
బాలిలోని దిన్‌పాసార్‌, సింగరాజా పట్టణాలు ఎంతో బావుంటాయి. టూరిస్టులును అమితంగా ఆకట్టుకుంటున్న కూటా బాలి విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది. ఇదో కుగ్రామం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 

Sunset at Kuta, Bali
ఇక్కడి బీచ్‌లు, ఎంతో ఆకట్టుకునే సూర్యోదయ, సూర్యాస్తమయాలు టూరిస్టులను కట్టిపడేస్తాయి. 1970ల నుంచీ పర్యాటకుల రాక ఎక్కువయింది. ఇపుడు ఇది రిజార్ట్‌ టౌన్‌గా మారింది. వందల హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, అనేక రకాల దుకాణాలు ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ తన ‘సాగరిక’ అనే కవిత 80ఏళ్ల క్రితం ఇక్కడ పర్యటనికి వచ్చినపుడు రాశారు.

Sunset at Kuta, Bali
Sunset at Kuta, Bali
‘‘విదేశీయునిగా నేను మొదటగా ఇక్కడికి వచ్చినపుడు ఆరాతి తీరంలో నువ్వు కూర్చుని వున్నావు. నన్ను ఆహ్వానించావు. మనం ఇద్దరం పువ్వుల్ని సేకరించాం. నేను మరోసారి వచ్చినపుడు నువ్వు వాణిజ్య రాకుమారుడివి. మళ్లీ నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించావు. దేవతలను కలిసి ప్రార్ధించాం. నా ఆస్తులు తరగిపోయాయి. ఇవాళ నా వీణతో వచ్చాను. నీలో నన్ను దర్శిస్తున్నాను. నన్ను గుర్తించావా?’’ అని ప్రశ్నించారు టాగోర్‌ తన కవితలో. ఇవాళ బాలివాసులు సమాధానంతో సిద్దంగా వున్నారు. భారతీయులను ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తూన్నారు. ఇండోనేషియా సందర్శించే పర్యాటకులలో సగంపైగా పర్యాటకులు బాలిలో ఒక్కరోజైనా గడపడానికి వెళతారు. ఇక్కడి ఉబుద్‌ అనే గ్రామం సంప్రదాయ హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి.

ఎప్పుడైనా రావచ్చు...
ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా సరే ఇండోనేషియా పర్యటనకు వెళ్లవచ్చు. రాజధాని జకార్తా నగరం షాపింగ్‌కు అనుకూలం. మకదువా, బోటనీ స్క్వేర్‌లలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, దుస్తులు చాలా చౌకగా లభిస్తాయి. ఈ దేశానికి వీసా పొందటం కూడా చాలా సులభం. వీసా ఆన్‌ ఎరైవల్‌ పద్ధతిలో జకార్తాకు చేరుకున్నాక విమానాశ్రయంలోనే వీసాను పొందవచ్చు.

ఎలా వెళ్లాలంటే...
హైదరాబాదులోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మూడు గంటలపాటు ప్రయాణిస్తే థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ చేరుకుంటాం. అక్కడి నుంచి ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాకు మరో మూడు గంటలపాటు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి జకార్తాకి నేరుగా విమాన సౌకర్యం లేదు కాబట్టి, బ్యాంకాక్‌ లేదా మలేషియాల మీదుగా వెళ్ళాల్సిందే...!!

Tuesday, November 15, 2011

ప్రకృతి సోయగం... పరిశుభ్రతే తొలి నియమం సింగపూర్‌

 http://img100.imageshack.us/img100/5344/dsc40452lg.jpg
పచ్చదనం అంతా అక్కడే సువిశాలంగా పరుచుకొని ఉంటుంది. మనసును మరులుగొలిపే ఎన్నో పర్యాటక అందాలకు నెలవు ఆ దేశం. వైశాల్యం దృష్ట్యా 20వ స్థానంలో ఉన్న ఆ చిన్న దేశం పరిశుభ్రతకు  మారుపేరు. ఇక్కడ కొలువై ఉన్న ఎన్నో ప్రకృతి అందాలు ఏటా లక్షల కొద్ది పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తూనే ఉన్నారు. ఆ దేశ ఆర్థిక వనరుల్లో పర్యాటకరంగానిదే పెద్దపీట. 
http://www.inhabitat.com/wp-content/uploads/fusionopolissingapuraih.jpg 
FUSIONOPOLIS: Singapore's New Green Skyscraper

తరుచూ వర్షం కురుస్తూనే ఉండే ఆ దేశం ఎప్పుడూ నీలిమేఘాలతో దోబూచులాడుతూనే ఉంటుంది. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిచిన ఆ దేశమే సింగపూర్‌. 
http://img216.imageshack.us/img216/2821/2005blk146askygdn8nc.jpg 
Singapore does not sacrifice density or urbanity for greenery, ...

మరి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు  అలా వెళ్లొద్దామా..?!

Merlion-Park 
యూరప్‌ దేశాల్లోని వాతావరణ పరిస్థితులను తనలో మమేకం చేసుకున్న సింగపూర్‌లో ప్రజలు ఎక్కువగా, ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు బాష లు. అవి ఒకటి మకాన్‌, రెండు సింగ్లీష్‌. ఇంగ్లీష్‌ అనే బాషను విన్నామేగానీ, సింగ్లీష్‌ ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా..? మరేం లేదండి.. మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్‌ లాంటి ఇతర భాషలను ఇంగ్లీషుకు మేళవించి సింగపూర్‌ వాసులు మాట్లాడే భాషనే సింగ్లీష్‌ అంటారు. ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే సింగపూర్‌ ఇంగ్లీష్‌ అనవచ్చు.ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్‌లో చూడా ల్సిన ప్రదేశాలు బోలెడు. వాటిల్లో నైట్‌ సఫారీ, సింగపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌, జూరాంగ్‌ బర్డ్‌ పార్కు, మెర్‌లయెన్‌ పార్క్‌, సెంతోసా ద్వీపం, అండర్‌ సీ వరల్డ్‌... తదితరాలు చాలా ముఖ్యమైనవి.

నిశిరాత్రిలో విహారం... నైట్‌ సఫారీ...
http://www.amsamways.com/home/images/stories/tour_singapore/night_safari.jpg
సాధారణంగా జంతుప్రదర్శన శాలలను చూడాలంటే ప్రపంచంలో ఎక్క డైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటా రు. కానీ సింగపూర్‌లో మాత్రం రాత్రి వేళల్లో కూడా వాటిని సందర్శించవ చ్చు. దీనినే నైట్‌ సఫారీ అని పిలుస్తుం టారు. 
http://jannersdownunder.files.wordpress.com/2009/04/singapore-zoo-9.jpg
రాత్రివేళల్లో తిరిగే జంతువుల ను, పక్షులను చూడాలంటే ప్రత్యేకమై న చీకటి గుహల్లోనే చూడాలి. ఈ అవ కాశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కల్పించింది సింగపూరే. రాతల్లో జంతువులను వాటి సహజ పరిస్థి తుల్లో చూసే అవకాశం కలగటంతో పర్యాటకులు ఓ వింత అనుభూతికి లోనవుతారు.http://images.travelpod.com/tw_slides/ta00/bb4/2b8/fire-show-night-safari-singapore-singapore.jpg
ఈ నైట్‌ సఫారీలో ప్రత్యేక ఆకర్షణ అక్కడి ఆదివాసుల స్వాగత నృత్యం. బలంగా ఉండే యువకుల విలువిద్యా కౌశల ప్రదర్శన, వెదురుబొంగులు వేగంగా కదులుతుంటే వాటి మధ్య అడుగులు వేస్తూ చేసే నృత్యం చూడ ముచ్చటగా ఉంటాయి. ఇందులో మరో ఆకర్షణ మంటలతో ఆదివాసీలు చేసే నృత్యం. నైట్‌ సఫారీను చూసేందుకు పర్యాటకులు ట్రాములో వెళ్లాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రాము కదులుతుంటే, జంతువులు వాటి సహజ పరిసరాల లో మనకు చాలా దగ్గరనుంచీ కనిపిస్తాయి.

విహంగాలకు ఆలవాలం... జురాంగ్‌ పక్షి కేంద్రం...
http://singapore-trip.com/wp-content/uploads/2010/12/jurong-bird-park-singapore.jpg
ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్క్‌గా ప్రఖ్యాతి చెందిన జురాంగ్‌ పక్షుల కేంద్రం సింగపూర్‌లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం.
http://resource.isango.com/Uploads/ProductImages/Descriptions/Jurong%20Bird%20Park_Singapore_5093_3.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG/230px-Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG/230px-Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG/230px-Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG
600 జాతులకు చెందిన 8 వేల పక్షులు నెలవైన ఈ పార్క్‌ను ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా ఏసీ, పానో రైలు సదుపాయం ఉంది. మెయిన్‌ స్టేషన్‌లో ఎక్కి లోరీ స్టేషన్‌లో దిగి మళ్లీ రైలెక్కి వాటర్‌ఫాల్‌ స్టేషన్‌లో దిగి మళ్లీ అక్కడనుంచి మెయిన్‌స్టేషన్‌ చేరుకోవచ్చు. లోరికీట్‌ పక్షులు (ఎరుపు రంగు చిలుకల్లా ఉండేవి) లోరీ స్టేషన్‌లో దిగినపుడు చూడవచ్చు. ఇక పక్షులకి ఆహారం పెడుతున్నపుడు వాటి హడావుడి చూసితీరాల్సిందే. పక్షులకి మనం కూడా ఆహారం వేస్తూ ఫోటోలు తీయించుకోవచ్చు.http://blog.701panduan.com/images/school-holidays-singapore/jurong-bird-park.jpg
వాటర్‌ఫాల్‌ స్టేషను లో దిగితే 60 జాతులకి చెందిన 1500 పక్షులని వాటి సహజసిద్ధమైన నివాస ప్రాంతా ల్లో చూడగలిగే అరుదైన అవకాశం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణగా మానవనిర్మితమైన అతి ఎతె్తైన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టు కుంటుంది. ఈ పార్క్‌లో 200 పెంగ్విన్లని, నిశాచర పక్షుల్ని, పెవికాన్లని, రకరకాల కొంగల్ని కూడా చూడవచ్చు. ఫుజీహాక్‌వాక్‌ స్టేడియంలో గద్దలు, హాక్‌లు, ఫాల్కన్‌ పక్షుల విన్యాసాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పక్షులు వేటాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలు గుతుంది. ఆంఫీథియేటర్‌లో అనేక పక్షుల చేత.. చిన్న రాళ్లతో గుట్టని పగులగొట్టడం, బాస్కెట్‌ బాల్‌ ఆడటం, సందర్శకుడి చేతినుంచి డాలర్‌ నోటు ఎగరేసుకుపోవడం లాంటి ఫీట్లు చేయించడాన్ని చూడవచ్చు.http://www.yuliang11.net/wp-content/uploads/2011/05/duck-tour-singapore.jpg
ఆద్యంతం ఆహ్లాదం... డక్‌టూర్‌...
ఆసియాలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన సింగపూర్‌ డక్‌టూర్‌ ఒక ప్రత్యేక ఆకర్ష ణ. నీటిమీదా, నేలమీదా ప్రయాణించే ఉభయచర వాహనంలో పన్‌ టెక్‌సిటీ, విక్టోరియా థియేటర్‌ సుప్రీంకోర్ట్‌, వార్‌ మెమోరియల్‌ పార్క్‌, నీటిలో ప్రయాణించి నపుడు ఎప్సలనేడ్‌ మెర్‌లయన్‌ విగ్రహం, తదితర విశేషాలు నేల ప్రయాణంలో చూడవచ్చు. సింగపూర్‌లోని పురాతన చైనా గుడి చూడదగ్గది. ద్వారపాలకులుగా సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఇంకా... బుద్ధుడి దంతం ఉన్నదని చెప్పబడే గుడి, సింగపూర్‌ జూ, పాసిక్‌ రిస్‌ పార్క్‌, ఎమ్‌ఎన్‌ టి బొమ్మల మ్యూజియం, నేషనల్‌ మ్యూజియం, వార్‌ మెమోరియ ల్స్‌లాంటివి ఇతర సందర్శనీయ స్థలాలు. ఇక చివరిగా... టూరిస్టు వీసాలు సులభంగా లభించే సింగపూర్‌ చెక్కేయాలంటే.. అక్కడి విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసాలను మంజూరుచేసే వ్యవస్థ మనకు తోడ్పడుతుంది.
http://www.findsingapore.net/gallery/var/albums/Singapore-Botanic-Gardens/singapore-botanic-gardens-02.jpg?m=1300717554
పచ్చని అందాలకు నెలవు... బొటానికల్‌ గార్డెన్స్‌...
140 సంవత్సరాల చరిత్ర కలిగిన బొటానికల్‌ గార్డెన్స్‌ సింగపూర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం. పదివేల రకాల వృక్షాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చూస్తే, ఆశ్చర్యచకితులవుతారు. ఇక్కడి పువ్వులు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే, ఇందులోని ఆర్కిడ్‌ ఉద్యానవనం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఆసక్తికలవారు వాటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ కంప్యూటర్‌ తెరలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పిల్లలకోసం ఓ ప్రత్యేకమైన గార్డెన్‌ కూడా ఉంది. ఇక్కడ ఉష్ణప్రదేశాల్లో ఉండే మాంసాహార చెట్లు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.

అరుదైన ఆకర్షణ... మెర్‌లయెన్‌ పార్క్‌...
 http://www.friendlyplanet.com/media/gallery/asia/singapore/singapore-merlion-park.jpg
సింగపూర్‌ ఇతర ఆకర్షణల విషయానికి వస్తే... నగరంలోని మెర్‌ లయెన్‌ పార్క్‌ తప్పక చూడాల్సినదే. ‘సింహపురి’... ‘సంగపూర్‌’గా రూపాంతరం చెందడం వల్ల కాబోలు సింహం, చేప కలగలసిన శిల్పానికి అత్యంత ప్రజాదరణ అభించింది. లండన్‌ కన్నా పెద్దదైన సింగపూర్‌ ఫ్లైయర్‌ ఎక్కిన వారు 165 మీటర్ల ఎత్తు నుంచి సింగపూర్‌నే కాకుండా, మెరినాబేని కూడా చూడవచ్చు.

బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌... సెంతోసా ద్వీపం...
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjPBzJXSvxhVeZfVwcPOZ_6T6Me7T98a0H7i5uPSJtBNo-8K6UdmXfe89tp63JKyYUbwFuvF-BYbzbP313Q-r5rzoEWtFX-t-SWnDKyjKEC4A2km6rjompRHNM_TrbN8fMR927cWL_ioPU/s1600/sentosa-singapore-tourism-board.jpg
సింగపూర్‌ పర్యటనలో సెంతోసా ద్వీపాన్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. 
http://cache2.artprintimages.com/p/LRG/36/3697/498AF00Z/art-print/pearl-bucknall-sentosa-island-cable-cars-singapore.jpg
ఈ ద్వీపంలోకి కేబుల్‌ కార్‌లో వెళ్లటమే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. భూమి నుంచి అనేక అడుగుల ఎత్తు నుంచి విహంగవీక్షణం చేయగలగడం ఒక మరపురాని అనుభూతి.
http://2011lphslangfest.files.wordpress.com/2011/03/merlion11.jpg
సింగపూర్‌ సాంస్కృతిక చిహ్నమైన మెర్‌లయన్‌ 37 మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. తొమ్మిదవ అంచె నుంచి సింగపూర్‌ దక్షిణభాగం, సెంతోసా, స్కెలైన్‌ కనిపిస్తాయి. 
http://tourisminsingapore.com/userfiles/Butterfly-Park2.jpg
సీతాకోకచిలుకల పార్క్‌ నయనానందకరంగా దర్శనమిస్తుంది.ఇక్కడ పదిహేనువందల సీతాకోక చిలుకలనే కాకుండా మూడు వేల రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కలుగుతుంది. 
http://www.venkia.com/pdata/29233.jpg
అలాగే ఇక్కడి అండర్‌ వాటర్‌ వరల్డ్‌లో 2500 జాతులకి చెందిన 2,500 జలాచరాల్ని చూసే అదృష్టం కలుగుతుంది. 83మీటర్ల సొరంగం నుంచి ట్రావ్‌లేటర్‌ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడడం ఒక వింత అనుభవం. 
http://www.wisatasingapura.sg/wp-content/gallery/national-museum-of-singapore/national-museum.jpg
ఇమేజెస్‌ ఆఫ్‌ సింగపూర్‌ మ్యూజియం సింగపూర్‌ చరిత్ర, జాతులు, జీవనవిధానాలు సమగ్రంగా తెలియజేస్తుంది.
http://travelguideworld.info/wp-content/uploads/2011/10/singapore_Sentosa-hotel_001p1.jpeg